Thursday, August 14, 2014

Telangana Survey

ఉల్కెందుకు ?

 తెలంగాణా ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమాలు సరిగ్గా అమలుపరచేందుకు ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంది.
అందుకని ముందుగా సర్వే చేయాలని నిర్ణయం తీసుకొని దానిని పకడ్బందిగా చేయాలంటే ఒక్క రోజులో అయితే బాగుంటుందని అనుకొని ఈ నెల పంతొమ్మిది మంగళవారం (19-8-2014) ఖరారు చెసింది.  మంగళ వారమైతే సామాన్యంగా  తెలుగు వారెవరు ఫంక్షన్లు, ప్రయాణాలు పెట్టుకోరు.  తప్పని పరిస్థితిలోనైతేనే routine పనులకి తప్ప ఇంటి సరుకులు కొనడానికికూడ కొందరు బైటకు వెళ్లరు.  దానికి ముందు సోమవారం అష్టమి - గోకులాష్టమి అవుతుంది.  పండగ చేసుకునే వాళ్ళంత ఇంట్లోనే వుంటారు. పంద్రాగస్టు జెండా ఎగెరేసినంక ఉద్యోగస్తులు ఒక్క రోజు సెలవు పెట్టుకుంటే 19 తారీఖు వరకు ఇంట్లో వుండి 20 తారీఖు పొద్దుటే మళ్లి డ్యుటిలో చేరొచ్చు.  గవర్నమెంటు ఆ రోజు సెలవని ప్రకటించింది కాబట్టి ప్రైవేటులో కూడ అంతా సెలవే.   ఈ తేదీని ఎంతో ముందుగ ప్రకటించడము జరిగింది కాబట్టి తెలంగాణా  సామాన్య ప్రజలంతా కూడ సర్వే కోసం సన్నద్ధ మౌతున్నరు.
ఈ సర్వే గురించి ఆంధ్రొళ్ళకు ఉల్కెందుకో? దీని గురించి కేంద్రానికి షికాయితులు, కోర్టులో కేసులెందుకో? వారిలోనైన సామాన్యులకు కలిగే నష్టమేమి?  ఏమున్నా, ఇటు తెలంగాణలో కాని, ఆంధ్రలో కాని  ఇబ్బడి ముబ్బడిగా,అడ్డగోలుగ   దోపిది డారుల్లాగా  ఆస్తులు - ముఖ్యంగా భూములు  సంపాదించుకున్న బడాబాబులకే కాస్త ఇబ్బందేమొ.  అయినా వారి మార్గాలు వారికి ఉంటాయిలె.  కేవలము తెలంగాణలో ఏ పని సరిగ్గా సాగనియోద్దనే కుళ్ళు ఆలోచనతో సీమాంధ్ర రాజకీయనాయకులు ఆడుతున్న కుతంత్రము.  వాళ్ళ కుతంత్రము అర్థమైన తెలంగాణా ప్రజలు రెట్టింపు పట్టుదలతో ఈ సర్వేను విజయవంతం చేయాలనే పట్టుదలతో వున్నరు.
ఈ సర్వె ఒక చరిత్రాత్మక సర్వే.  ఈ సామాజిక ఆర్థిక సర్వే తెలంగాణా ప్రగతికి తోడ్పడటమే కాదు మున్ముందు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయదలచుకున్నదేశంలోని  అన్నిరాష్ట్రాలకె కాదు ప్రపంచానికే దిక్సూచి కాగలదు.
ఇతర రాష్ట్రాల్లో, లేదా దేశాల్లో వున్న తెలంగాణ స్థానికుల వివరాలు సర్వే పాల్గొన్న సభ్యుల నుండి తెలుసుకున్నవిషయాలు హొమ్ శాఖ ద్వారా నిర్దారించుకోవచ్చు.  తరతరాలుగా తెలంగాణలో స్థానికులైన వారెవరు కేవలం ఈ సర్వే మూలంగా స్థానికత కోల్పవడమన్నది అసంభవము.
తెలంగాణ వారుగా, తెలంగాణా వాదులుగా ఈ సర్వే  విజయవంతం చేయటము ప్రజలందరి బాధ్యత.