Tuesday, May 12, 2015

News - Views

ధనమే ధర్మం  

ధర్మమేంటో అధర్మేంటో అర్థం చేసుకోవడము కష్టము.  అట్లనే న్యాయం, అన్యాయం కూడ.  ఒకప్పుడు ఓ విషయము, నిర్ణయము చెప్పి ఇది ఇంతే అనేవాళ్ళు.  పైసా పెడ్తె అంగట్లో అన్ని దొరికే కాలం.  అమ్మతనం కూడ (తప్పుగా అర్థం చేసుకోవద్దు, సర్రుగసి గురించి మరిచిపోవద్దు).  ఎప్పుడు ఏది తప్పౌతుందో, అది మళ్ళి ఎప్పుడు ఒప్పౌతుందో, దానికి ఎంత ఖర్చౌతుందో, కాలం పడుతుందో చెప్పటము కష్టం.  కాస్త ఓపిక, మరెన్నో కాసులు వుంటె ఏ నేరము చేసిన బతికినన్నాళ్ళు తప్పించుకు తిరగొచ్చు.  (తప్పించుకు తిరుగువాడె ధన్యుడు సుమతి!).  చచ్చాక ఏమైతె ఎవరికి నష్టం, ఎవరికి కష్టం.  పేదవాడికి బతికనన్నాళ్లు నేలతల్లి వడిలోనె పంటాడు.  చచ్చాక ఇంకాస్త వెచ్చాగా లోపల దాక్కుంటాడు.  ధనవంతుడు పట్టెమంచంలో పడుకున్నా, ఏసిలో అలసిసొలసి పోయినా చచ్చాక మట్టిలో కలిసిపోక తప్పదు.
ధర్మాన్ని నాలుగు కాళ్ళ కామధేనువుతో పోల్చారు.

కృతయుగంలో ధర్మము నాలుగు పాదాలు నడిచిందంట.  అప్పుడు ఎలాంటి పాపాలు, తప్పులు జరగలేదట.  త్రేతాయుగంలో ధర్మము మూడు పాదాల మీద నడిచింది.  శ్రీరాముడు తాటకిని చంపాడు.  వాలిని చెట్టు చాటు దాక్కొని చంపాడు.  రావణుడి తమ్ముడు విభీషణుడి సహకారాంతో రావణ బ్రహ్మను స్వర్గానికి పంపాడు.  ద్వాపరయుగం వచ్చేసరికి శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులకు అండగా నిలిచి, కురుక్షేత్రంలో గీత బోధన చేసి కలియుగ ఆరంభానికి స్వాగతం పలికాడు.  కలియుగంలో ధర్మము మూడు పాదాలతో కుంటుకుంటు నడుస్తుందని అన్నారు. నిజమే అని ఇన్నాళ్ళు  అనుకున్నాను.  ప్రపంచములో యుద్ధాలు ఎక్కడో అక్కడ ఎప్పుడు జరుగుతునే వున్నాయి.  మరి మరో కొత్త యుగం మొదలైందని అనుకుంటా.  ధర్మము నాలుగు కాళ్ళు విరిగిపోయాయి.  నడవలేక మూలకు పడింది.  మూలిగె శక్తి కూడ లేక తన కన్నీరు తానే తాగుతు కోమాలోకి వెళ్లిపోయింది.