ధనమే ధర్మం
ధర్మాన్ని నాలుగు కాళ్ళ కామధేనువుతో పోల్చారు.
కృతయుగంలో ధర్మము నాలుగు పాదాలు నడిచిందంట. అప్పుడు ఎలాంటి పాపాలు, తప్పులు జరగలేదట. త్రేతాయుగంలో ధర్మము మూడు పాదాల మీద నడిచింది. శ్రీరాముడు తాటకిని చంపాడు. వాలిని చెట్టు చాటు దాక్కొని చంపాడు. రావణుడి తమ్ముడు విభీషణుడి సహకారాంతో రావణ బ్రహ్మను స్వర్గానికి పంపాడు. ద్వాపరయుగం వచ్చేసరికి శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులకు అండగా నిలిచి, కురుక్షేత్రంలో గీత బోధన చేసి కలియుగ ఆరంభానికి స్వాగతం పలికాడు. కలియుగంలో ధర్మము మూడు పాదాలతో కుంటుకుంటు నడుస్తుందని అన్నారు. నిజమే అని ఇన్నాళ్ళు అనుకున్నాను. ప్రపంచములో యుద్ధాలు ఎక్కడో అక్కడ ఎప్పుడు జరుగుతునే వున్నాయి. మరి మరో కొత్త యుగం మొదలైందని అనుకుంటా. ధర్మము నాలుగు కాళ్ళు విరిగిపోయాయి. నడవలేక మూలకు పడింది. మూలిగె శక్తి కూడ లేక తన కన్నీరు తానే తాగుతు కోమాలోకి వెళ్లిపోయింది.