తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ తొలి బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఆరు నుండి జరుగుతున్నయి. కొత్త రాష్ట్రములో సమావేశాలు సజావుగా సాగుతున్నందుకు సంతోషమనిపించింది. అది కాస్త ఇవ్వాల ఆవిరైంది. ఏ పార్టి వాళ్ళైన తెలంగాణకు అనుకూలంగా మాట్లాడాల్సిందే. తెదేపా తెలంగాణ నాయకులు తప్పనిసరిగా తెలంగాణ ప్రజల పక్షము తీసుకోక తప్పదు. తెలంగాణ ప్రగతికై అడుగు వేయక తప్పదు. కరుడుగట్టిన ఆంధ్ర పక్షపాతి, రెండు కళ్ళతో ఆంధ్ర వైపే దృష్టి సారించే బాబుగారి నాయకత్వములో పనిచేస్తున్న తెతెదేపా నాయకులు వారి రాజకీయ భవిష్యత్తుకై తెలంగాణను
బంగారు తెలంగాణ చేయటానికి ఇక్కడి ప్రభుత్వానితో చేయి కలుపక తప్పదు. అందుకనే తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర విద్యుత్ అవసరాలకు కేంద్రానికి పంపించే లేఖకు అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు తెల్పినవి. ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టి అమోదించాయి.
తెలంగాణలో వుంటె జాతీయ పార్టీలు వుండాలి లేద తెరాస వుంటుంది . ఎం ఐ ఎం ఒక ఎక్సెప్షన్. తెలంగాణలో తింటూ, తెలంగాణలో పంటు ఆంధ్రకు అప్ అండ్ డౌన్ చేస్తూ ఆ రాష్ట్రాన్ని ఏలుతున్న చంద్రబాబు తెదేపాను ఎన్నటికి జాతీయ పార్టీని చేయలేడు . ఆ అవకాశాన్ని 2010లోనె బాబు జారవిడుచుకున్నడు. తెలంగాణను అష్టకష్టాలు పెట్టాలన్న ముందుచూపుతోనె పోలవరము ముంపు మండాలాలను ఆంధ్రలో కలుపుకున్నడు. పిపిఎలు రద్దు చేసి తెలంగాణను కరెంటు కష్టాలలో ముంచి ఎంతొ మంది రైతుల మరణానికి కారణమైనడు. అట్టి నాయకుని కింద తెతెదేపా నాయకులు ఎన్నాళ్ళు పనిచేస్తరో చూడాలే.
సభను సరిగ్గా జరగకుండ ఆంద్ర నాయకుడు ఎన్ని పన్నాగాలైన పన్నుతడు. దానిలో భాగమేననుకుంట నిజామాబాదు ఎంపి పైన ఆరోపణ. తప్పుడు ఆరోపణ చేసి పొరపాటు ఒప్పుకోకుండా రాద్ధాంతం చేసి సభ వాయిదా పడేటట్టు చేసారు. మళ్ళీ ఇట్లా కాకుండా తెలంగాణ ప్రభుత్వపక్ష నాయకులు తగు జాగ్రత్తలు తీసుకుంటారనుకుంటా.
తెలంగాణ తొలి బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఆరు నుండి జరుగుతున్నయి. కొత్త రాష్ట్రములో సమావేశాలు సజావుగా సాగుతున్నందుకు సంతోషమనిపించింది. అది కాస్త ఇవ్వాల ఆవిరైంది. ఏ పార్టి వాళ్ళైన తెలంగాణకు అనుకూలంగా మాట్లాడాల్సిందే. తెదేపా తెలంగాణ నాయకులు తప్పనిసరిగా తెలంగాణ ప్రజల పక్షము తీసుకోక తప్పదు. తెలంగాణ ప్రగతికై అడుగు వేయక తప్పదు. కరుడుగట్టిన ఆంధ్ర పక్షపాతి, రెండు కళ్ళతో ఆంధ్ర వైపే దృష్టి సారించే బాబుగారి నాయకత్వములో పనిచేస్తున్న తెతెదేపా నాయకులు వారి రాజకీయ భవిష్యత్తుకై తెలంగాణను
బంగారు తెలంగాణ చేయటానికి ఇక్కడి ప్రభుత్వానితో చేయి కలుపక తప్పదు. అందుకనే తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర విద్యుత్ అవసరాలకు కేంద్రానికి పంపించే లేఖకు అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు తెల్పినవి. ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టి అమోదించాయి.
తెలంగాణలో వుంటె జాతీయ పార్టీలు వుండాలి లేద తెరాస వుంటుంది . ఎం ఐ ఎం ఒక ఎక్సెప్షన్. తెలంగాణలో తింటూ, తెలంగాణలో పంటు ఆంధ్రకు అప్ అండ్ డౌన్ చేస్తూ ఆ రాష్ట్రాన్ని ఏలుతున్న చంద్రబాబు తెదేపాను ఎన్నటికి జాతీయ పార్టీని చేయలేడు . ఆ అవకాశాన్ని 2010లోనె బాబు జారవిడుచుకున్నడు. తెలంగాణను అష్టకష్టాలు పెట్టాలన్న ముందుచూపుతోనె పోలవరము ముంపు మండాలాలను ఆంధ్రలో కలుపుకున్నడు. పిపిఎలు రద్దు చేసి తెలంగాణను కరెంటు కష్టాలలో ముంచి ఎంతొ మంది రైతుల మరణానికి కారణమైనడు. అట్టి నాయకుని కింద తెతెదేపా నాయకులు ఎన్నాళ్ళు పనిచేస్తరో చూడాలే.
సభను సరిగ్గా జరగకుండ ఆంద్ర నాయకుడు ఎన్ని పన్నాగాలైన పన్నుతడు. దానిలో భాగమేననుకుంట నిజామాబాదు ఎంపి పైన ఆరోపణ. తప్పుడు ఆరోపణ చేసి పొరపాటు ఒప్పుకోకుండా రాద్ధాంతం చేసి సభ వాయిదా పడేటట్టు చేసారు. మళ్ళీ ఇట్లా కాకుండా తెలంగాణ ప్రభుత్వపక్ష నాయకులు తగు జాగ్రత్తలు తీసుకుంటారనుకుంటా.
No comments:
Post a Comment