Wednesday, September 23, 2015

ప్రాణాపాయ సెల్ఫీలు



మొబైల్ ఫోన్లు వచ్చినంక ఫొటోలు తీసుడు చాల కామన్ అయిపోయింది.  ఏ చిన్న సందర్భము వున్నా ఎవరో ఒకరి దగ్గర ఫోన్ వుండటము దానితో ఫోటో తీయటము అనుకోకుండా చాలా సహజంగా, అలవాటుగా జరిగిపోతున్నది.  ఎమ్మెమ్మెస్లు, ఆ తరువాత వాట్సాప్లలో అవి ప్రపంచములో ఏదో మూలలో వున్న బంధు మిత్రులతో షేర్ చేసుకోవటము క్షణాల్లో జరిగిపోతుంది.
సెల్ఫిలు వచ్చనంక అయితే కొంతమంది కూచున్నా, పడుకున్నా, నిలబడ్డ, తింటున్నా, కొత్త ప్రదేశాలు చూస్తున్నా, ఏం చేస్తున్నా, చేయకున్న ఫోటోలు తీసుకొని సన్నిహితులకు పంపించుకోవడము, ఫేస్ బుక్ లో పెట్టుకోవడమైతుంది.  సందర్భాసందర్భాల గురించి ఆలోచించకుండ శవాల పక్కన, చెరువులు, కొండల పక్కన, అడవి జంతువుల పక్కన, కొన్ని సార్లు ప్రమాదకర పరిస్థితుల్లో వుండి కూడ సోషల్ మిడియాలో ప్రచారము కోసం, అధిక లైకులు షేర్ల కోసం అత్యుత్సాహముతో సెల్ఫీలు తీసుకుంటున్నరు. అనాలోచితంగా ప్రమాదకర పరిస్థితుల్లో సెల్ఫీ తీసుకున్నందువల్ల కొన్నిసార్లు ప్రాణాలు కూడ కోల్పోతున్నరు.  ఏ ఏడాది ఇప్పటి వరకు సొరచేపలు - శార్క్ ల వల్ల ఎనిమిది మంది చనిపోతె సెల్ఫీల వల్ల పన్నెండు మంది చనిపోయారని ఓ పత్రికలో వచ్చింది.  మరి మన దేశములో ఎంతమంది అలా చనిపోయారో?
ఆ మధ్య ఒకామె ఓ మడుగు పక్కన సెల్ఫీ తీసుకుంటుంటె ఓ మొసలి ఠక్కున వచ్చి ఆమెను నోట కర్చుకొని నీట్లోకి వెళ్లిపోయిన వీడియో వాట్సాప్ లో హల్ చల్ చేసింది.  ఇలాంటివి చూసినంకైనా సెల్ఫీ పిచ్చివాళ్ళు కాస్తా జగ్రత్తగా, సమయసందర్భాలేకాక, పరిసరాల గురించి జరుగ గల ప్రమాదాలు గురించి తెల్సికొని, తగు జాగ్రత్తలు తీసుకున్న్ తర్వాతే సెల్ఫీ తీసుకోవడమ్ మంచిది.  లేకపొతె అదే అఖరి సెల్ఫీ అయితుందేమో!
రష్యాలో ఈ ఏడు కొన్ని వందలమందు సెల్ఫీల వల్ల గాయపడ్డము, పదుల సంఖ్యలో మరణించటము జరిగింది.   ఒక 21 సం. స్త్రీ తుపాకి పట్టుకొని సెల్ఫీ తీసుకుంటుంటె అది కాస్త పేలి చనిపోయింది.  మరో ఇద్దరు యువకులు చేతిలో గ్రెనెడ్ పట్టుకొని సెల్ఫీ తీసుకుంటే దానికి సాక్ష్యంగ  ఆ సెల్ఫీతో ఫోన్ ఈ లోకంలో వుంది, వాళ్లు మాత్రం పరలోకానికి చేరుకున్నరు.  ఇలాంటివన్ని చూసినంక రష్యా ప్రభుత్వము సురక్షిత సెల్ఫి ప్రచారము మొదలు పెట్టింది.  అది ఇప్పుడు ప్రపంచమంతా ప్రచారానికి పనికి వస్తుంది.
సెల్ఫీ ప్రియులు తస్మాత్ జాగ్రత్త.  ముందువెనకలు చూసుకొని అందమైన సెల్ఫీలు తీసుకుంటు, అందరితో షేర్ చేసుకుంటు ఆనందంగా వుండండి.


సురక్షిత సేల్ఫీ  - రష్యా ప్రచారానికి వాడుతున్నది, గూగుల్ ఇమేజస్ నుండి తీసుకున్నది

Saturday, September 12, 2015

ప్రకృతి వరము లక్నవరము



వరంగల్లు జనాలందరికి లక్నవరము గురించి తెలిసే వుంటుంది.  లక్నవరము గ్రామములో లక్నవరము చెరువుంది.  లక్నవరము వరంగల్లు నుండి దాదాపు 70 కి.మీ. వుంటుంది.  వరంగల్లు నుండి వయా ములుగు రోడ్డు మీదుగా వెళ్ళాలి.  బస్సు లేదా స్వంత వాహనమ్ పై వెళ్ళొచ్చు.  దారి, ముఖ్యంగా ములుగు దాటినంక చాలా బాగుంటుంది.  అటు, ఇటు పొలాలు, చెట్లు, అక్కడక్కడ గుట్టలు, దారమ్మట గొర్రెలు, మేకల మందలు వెళ్ళడం, వాటి ముందు వాటి కాపరులు పోతుంటె ప్రయాణము చాల ఆహ్లాదకరంగా సాగుతుంది.

 ములుగు అడవి దారి దాటి వెళ్తుంటె జంగాలపల్లి అనే వూరు వస్తుంది.  ఇక్కడ కుడికి తిరిగి మరో ఎనిమిది కి.మీ.లు పోవాలె.  ఈ దారేమో సింగల్ రోడ్డు.  పరిసరాలు అందమైన చెట్లు పొలాలతో బాగుంటుంది కాని ఎదురుగ వేరె ఏదైన బండి వస్తె తప్పుకుంటు వెళ్లడము కాస్త చికాకైన విషయము.  మధ్యలొ వో చోట కల్వర్టు వుంది.  ఇక్కడ మరీ కష్టము.  నాకైతె అది ఎప్పుడైనా కూలి పోతుందేమొ అనిపించింది.  అంతె కాదు.  పెద్ద వాన వస్తె మునిగి పోయె అవకాశము కూడ వుంటుందనిపించింది.  ఏమో మరి.  వరంగల్లు స్మార్ట్ సిటి అవుతుంది, ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చాలనుకుంటునప్పుడు పర్యాటక ప్రదేశాలకు వెళ్ళె రోడ్లన్ని  బాగు చేసి వెడెల్పు చేయాల్సిన అవసరమెంతైనా వుంది.
లక్నవరము వెళ్లె బండ్లకు పార్కింగ్ స్థలము వున్నది కని సెలవు రోజుల్లొ అది ఎంత మాత్రము సరిపోదు.  చెరువుకు ఒక కి.మీ. దూరములోనె వాహనాలను అపెయ్యాలి.  ప్రతి చోట వున్నట్టె ఇక్కడ కూడ విఐపిల బండ్లు మాత్రము దగ్గరవరకు వెళ్ళొచ్చు.  పర్యావరణ రక్షణ అన్నది వాళ్ళకు వర్తించదు!  

పార్కింగ్ స్థలము పక్కనె ఒక చదునైన ప్రదేశము, అక్కడ ఒక గుండ్రటి అరుగు దాని మీద పసుపు రంగు వేసి పైన ఎర్రని గుడ్డ చుట్టిన ఒక చెక్క స్తూపము వుంది.  అది గట్టు ముసలయ్య దేవాలయము అని అక్కడ రాసివుంది.  ప్రస్తుతానికి అక్కడ గుడిలాగ ఏమి లేదు.  ఒక చౌకోటు మాత్రముంది.  మరో రెండు మూడేళ్లలో అక్కడ చిన్న దేవాలయము రావచ్చు.  లక్నవరము చూడ్డనికి వచ్చిన వాళ్లంత తప్పనిసరిగా అక్కడ దర్శనము తర్వాతె చెరువుకు వెళ్ళాలని చెప్పెవాళ్లు రావచ్చు.  ఆ ముసలయ్య ఎవరో, ఆ స్తూపము ఎందుకు పెట్టారో తెలుసికుందామంటె దగ్గరలో నాకెవరు కనబడలేదు.


లక్నవరము సరస్సు విస్తీరణము 108 చదరపు మైళ్ళు.   ఇది కాకతీయుల కాలములో, గణపతి దేవ చక్రవర్తి నిర్మించాడు.  ఈ సరస్సు గోదావరి  ఒక పాయగా భావించబడుతుంది.  చుట్టు వున్న అందమైన కొండలతో ఇది ఒక సహజ రిజర్వాయరుగా వుంటుంది.  దీని నుండి వచ్చె కుడి ఎడమల కాలువల ద్వారా చుట్టుపక్కల 6-7 గ్రామాలకు రెండు పంటలకు సాగు నీరు అందుతుంది.

ఈ సరస్సు నడుమ అందమైన ౧౬౦ మి.  పొడవున్న ఊయల వంతెన వున్నది.  వర్షాకాలంలో సరస్సు నిండా నీళ్ళున్నప్పుడు ఈ వంతెన నీళ్ళపైనున్నట్టె వుంటది.  సరస్సు మధ్యలో ఈ వంతెన మీద నడవటము వో మరుపురాని అనుభవము.  మధ్యలో ఓక ద్వీపము మీద రెస్టారెంటు, ప్రయాణికులకు వసతి గృహాలు వున్నాయి.  పిల్లల ఆట స్థలము, పడవ ప్రయాణానికి వసతులు వున్నాయి.  ఈ సరస్సులో వున్న మరో ద్వీపము పైన పర్ణశాలలు వున్నాయి.  సరస్సు నిండా నీళ్ళు వుంటె ఇవి నీళ్లలో వున్నట్టె అనిపిస్తుంది.

 
ఈ అందమైన సరస్సు వరంగల్లు పర్యటనకు వచ్చె పర్యాటకులు తప్పని సరిగ చూడాల్సినది.  వర్షాకాలములో ఈ సరస్సు అందాలు ఎంతో అద్భుతము.