Tuesday, January 26, 2016

Sammakka Saralamma Jatara




వచ్చింది, వచ్చింది.  మేడారం జాతర వచ్చింది.  తెలంగాణ రాష్ట్రంలో తోలి మేడారం జాతర వచ్చింది.  తల్లి వస్తుంది.  బిడ్డ వస్తుంది.  కుటుంబం అంతా వస్తరు.  నాలుగు రోజులుంటరు.  అందరిని ఆశీర్వదిస్తరు.  మొక్కులందుకుంటరు.  ముడుపులందుకుంటరు.  మళ్ళి రెండేళ్ళకు వస్తమని అభయమిచ్చి అడవికెళ్ళి పోతరు.
సకుటుంబ సపరివార సమేతంగా
 
కోరికలు తీరినోళ్ళు కుటుంబాలతో వస్తరు.  ముడుపులు చెల్లించుకుంటరు.  కొత్త ఆశలు ముందు పెడ్తరు.  మళ్ళి రావాలని కోరుకుంటు వేళ్తరు.

బంగారంతో తులాభారం

ఎప్పుడైనా  అమ్మవారిని, సమ్మక్కని మాఘ పౌర్ణమి నాడు గద్దెల వద్దకు తీసుకొస్తరు.  బిడ్డ ఓక రోజు ముందు వస్తుంది.  మొక్కులు చెల్లించుకునేవారు ఎక్కువుగ పున్నమి నాడే మొక్కులు చెల్లించుకుంటరు.  కాలెండర్లో చూస్తె పున్నమి 22న వున్నది.  అప్పటి వరకు జాతర అయిపోతుంది.   మరి ఈ సారి ఎందుకు ఇట్ల మర్చిన్రో?

దర్శనానికి వెళ్ళ్తున్న జనం
జరుగుతున్న అబివృద్ధి పనులు
జాతర నాటికి పూర్తాయెనా?

నాలుగు రోజుల్లో రోజుకు లక్షల్లో జనాలు వస్తే, అమ్మవార్ల గద్దెల దగ్గరకు వెళ్ళడం కష్టమని ఈ  మధ్య చాల మంది ముందె వచ్చి ముడుపులు చెల్లించుకుంటున్నరు.  జాతర ఫిబ్రవరి 17-20 వరకైతే పదిహేను రోజులనుండే ప్రజలు మేడారానికి వస్తున్నరు.

జాతరకు లక్షల మంది వస్తారని తెలిసిన, ప్రతి యేడు నెల రెనెళ్ల ముందు రోడ్డు మరి ఇతర పనులు మొదలు పెడ్తరు.  తొందరగా  పనులు కావాలని తాత్కాలికంగా ఏదో చేసామనిపింఛి దులుపుకుంటరు.  తెలంగాణ ప్రభుత్వము కాస్త శ్రద్ధ తీసుకుంటదని అనిపిస్తుంది.  పనులైతే అయితున్నయి. నాణ్యత మళ్ళి జాతర వరకు తెలిసిపోతుంది.

విద్యుదీకరణకు సాగుతున్న పనులు
జాతరనాటికి పూర్తయితే కరెంటు దీపాల వెళ్తురులో
జాతర రోజుల్లో రాత్రిలు కూడ అమ్మవార్లను దర్శించుకోవచ్చనుకుంటా

ఈ జాతర ఘనంగా జరుగుతుందని ఆశిస్తున్న. అమ్మవార్ల  ఆశీర్వాదంతో  రాష్ట్రము చైతన్యవంతమై ప్రగతి పథంలోకి వెళ్తుందని, వ్యవసాయము చక్కగా సాగి,ప్రజల కనీసావసరాలు - కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం  అందరికి అందుబాటులో వుండాలని కోరుకుంటున్న.  అదే బంగారు తెలంగాణ.
కోమట్లను, బాపన్లను పక్కన పెడితె
తెలంగాణలో పండగంటే ముక్క, చుక్క వుండాల్సిందే
ఆమె ముఖంలో సంతోషము చూడండి


దర్శనానికి ముందు గంటలు కొడ్తున్న భక్తులు

వనదేవతకు జరుగుతున్నా అర్పణలు
అక్కడ వేసిన బెల్లం బంగారం అందుకోవటం
అమ్మవార్ల అనుగ్రహం పొందటమె


సమ్మక సారలమ్మ మట్టి విగ్రహాలు చేసి
వాటికి రంగులు వేస్తున్నతల్లి కొడుకులు
జాతర అప్పుడు గద్దెల వద్దకు పోలెకపోతె ఇక్కడకు వచ్చి మోక్కొచ్చు



దర్శనం చేసుకొని వచ్చేసరికి ఆకలి, అలసట తప్పదు
ఇక్కడకు వచ్చి కోవా బన్ను తిని కాస్త శక్తి పొందొచ్చు  

కోయదొర
ఆ దర్జా చూడండి
చిలుకతో, మూలికలతో తయారు
జోస్యం చెపుతాడు కష్ట నష్ట నివారణలకు
చిట్కాలు చెపుతాడు, మందులు (మూలికలు) ఇస్తాడు


జాతరలో దుకాణాలు
పిల్లలకు ఏమి కొనివ్వకపోతే జాతరకు
వచ్చినట్టే కాదు








Monday, January 18, 2016

Ganapur Temples


గణపురం గుళ్ళు

గణపురం గుళ్ళు, లేదా కోటగుళ్ళ గురించి ఇదివరకు రాసినా మళ్ళి ఒకసారి తెలుగులో రాయలనుకున్న. ఇవి వరంగల్లు జిల్లలో ములుగు మండలం ఘనపుర్లో వున్నవి.  ఈ మధ్య కాలంలోనీ ఇవి బాగా వెలుగులోకి వచ్చనయి, ముఖ్యంగా కాకతీయా ఉత్సవాలపుడు ఇక్కడ కూడ కొన్ని కార్యక్రమాలు జరిగినయి. 
15-16 శతాబ్దంలో అప్పటి తురక రాజు  గణపేశ్వరాలయము, అక్కడి శిల్పసంపదను ధ్వంసము చేసిండు.

కాకతీయులు కళాపోషనకు, వైభవానికి గుర్తుగా వేయి స్తంభాల గుడి, రామప్ప గుడి తో పాటు కోట గుడులు కూడా విలసిల్లుతాయి.  కోటగుడులు - 22 గుడుల సముదాయము ఓ మట్టికోట ఆవరణలో వుంటాయి.  చాలా వరకు శిథిలాలె, మట్టికోట గోడ.

ముఖ్య ఆలయము ఒక్కటే ఓ తీరుగ వున్నది.  దానికి కూడ గర్భ గుడి పైన సరైన కప్పు/గోపురము లేదు.  ఓకే ఒక బక్క పూజారి మాత్రము అక్కడ వున్న లింగ స్వరూప శివునికి దీప ధూప నైవేద్యాలు అర్పిస్తున్నడు. పండగలనాడు, ముఖ్యంగ శివరాత్రి నాడు మాత్రం పూజలు బాగా జరుగుతాయట. 
సామాన్యంగా అన్ని ఆలయాల్లో నాగదేవత విగ్రహాలు చూస్తం. ఇక్కడ ఈ విగ్రహాలకు పూజలు జరుగుతున్నయి.  నూనె దీపంత ఆ డబ్బాలో వుంది.


ప్రభుత్వము ఈ ప్రదేశాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాటానికి నిధులు ఇచ్చినా పనులు నత్త నడకన సాగుతున్నాయనిపిస్తుంది.

 తురక రాజు కింద  షితబ్ ఖాన్ అని పిలవబడిన సీతాపతి రాజు అనే కాకతీయ రాజ్యపాలకుడు శిల్పాలు ధ్వంసం కాకుండ భూమిలో పాతి పెట్టించాడంట  
ఎన్నో శిల్పాలు మట్టిలో కూరుకఫొయి వున్నయి.
తవ్వి తీసిపెట్టిన శిల్పాలు అక్కడక్కడ చూడొచ్చు
 

కొన్ని చిన్న గుడులలో,అక్కడక్కడ సున్నపు సంచులు వున్నయి.

చుట్టు పక్కల నేను వెళ్ళినప్పుడు గడ్డి పిచ్చి మొక్కలు చాల ఏపుగా పెరిగివువున్నయి.

అందమైన చెక్కడాలతో శిథిలమైన స్తంభం

పరిసరాలు మండపాలు అన్ని శుభ్రం చేస్తే, దగ్గరలో వున్నా పర్యాటక శాఖా వారి హోటలు బాగా నడిస్తే, ఈ గుడులు చక్కని దర్శనీయ స్థలము కావటము, పర్యాటకులు ఒక పూట అక్కడ ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ ఆనందంగా  సంతోషంగా గడపవచ్చు


కాలిలో ముళ్ళు తీసుకునే యువతి శిల్పాన్ని కొద్ది తేడాతో రామప్పలో కూడ చూస్తం

కుడ్యలఫై అందంగా చెక్కబడ్డ స్త్రీ, పురుషుల శిల్పాలు  
ఇక్కడ కనిపించే శిల్ప విన్యాసాలు పేరిణి నృత్యాన్ని గుర్తు తెస్తాయి
అందమైన చెక్కడాలతో కుడ్యం
శిథిలమైన అందాలను మరో తురక రాజు నిజాం రాజు కాలంలో పురావస్తు శాఖ వారు ఈ గుడులను వెలుగులోకి తెచ్చారు