Wednesday, February 12, 2014

Sammakka Saralamma


అడవి బిడ్డవు నీవు సమ్మక్క
అడవిలో పుడ్తివి సమ్మక్క
అడవిలో పుడ్తివి సమ్మక్క
అడవిలో నిలిస్తివి సమ్మక్క
ప్రజలంత నీవాళ్లె సమ్మక్క
ప్రజలంతా నీవాళ్లె సమ్మక్క
ప్రజలకోసం నీవు సమ్మక్క
ప్రభువులతోనే పోరాడావు సమ్మక్క
ముక్తికోసం సమ్మక్క 
విముక్తికోసం సమ్మక్క
భుక్తికోసం సమ్మక్క 
భూమికోసం సమ్మక్క
ప్రభువులతో నీవు సమ్మక్క
సమరము చేస్తివి సమ్మక్క
మా భూమి మాదేనని సమ్మక్క
నీవు రణమే చేస్తివి సమ్మక్క
ప్రజల కోసం సమ్మక్క 
ప్రాణాలే ఇస్తివి సమ్మక్క
అడవిలో శక్తివి సమ్మక్క
ఆదిపరాశక్తివె సమ్మక్క
అడవి బిడ్దవు నీవు సమ్మక్క
ఆరాధ్య దైవానివి సమ్మక్క

**********************

అమ్మలకు మొక్కరా, తమ్ముడా!
అడవి తల్లులకు, మొక్కరా!
తల్లిబిడ్డలు అడవిబిడ్డలు
పోరుగడ్డపై ఓరుగల్లు రాజుతో
పోరాడినారు తమ్ముడా,
ప్రజల గుండెల్లో దేవతలై 
వెలసినారు తెలుసుకోరా.

రాచరికాలు పోయినా
రాజకీయాలున్నాయిరా
బక్కోడికి బుక్కెడు బిచ్చమేసి
కోట్లు దోచుకుంటున్నారురా
ప్రాజెక్టులంటు ప్రజలనే
ముంచేస్తున్నారురా
ప్రగతి అంటు ఊళ్లనే
బొందలు చేస్తున్నారురా
చెట్టు చేలని తుడిచి పెట్టి
విషవలయాలనే సృష్టిస్తున్నారురా
బడుగు జీవుల భవితనే
బజారుపాలు చేస్తున్నారు, తెలుసుకోరా.

ఆత్మగౌరవంతో బతకాలంటె తమ్ముడా,
పోరుచేయక తప్పదురా
అమ్మలనే మొక్కరా, తమ్ముడా
వారి శౌర్యాని తల్చుకొని
వారసత్వాన్ని అందుకొని
అడుగు ముందుకెయ్యరా తమ్ముడా
జయము నీ సొంతమే తెలుసుకోరా.

Thursday, February 6, 2014

News - Views

నల్లారి నాటకాలు
సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి గౌ.శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆం.ప్ర
అసెంబ్లీలో 'T' బిల్ల్లుకు వ్యతిరేకంగ గొంతు చించుకొని గొంతు
నొప్పి తెచ్చుకున్నాడేమో, అందుకు ఢిల్లీలో ఇక అరిచే ఓపిక లేక
మౌనదీక్ష చేప్పట్టిండనుకున్నా.  కాని దీక్షలో కూర్చున్న నల్లారి
వారు హుషారుగ అందరితో చిరునవ్వు చిందిస్తు ముచ్చటించారు.
అది మౌనదీక్షనా, ముచ్చట్ల దీక్షనా అని అందరికి డౌటు.  అయినా
ఎదురుగ కనబడెది నిజం, మళ్లి డౌటు పడాల్సిన అవసరమేముంది?
సీమాంధ్రులు నిరవధిక నిరాహారదీక్ష అంటె, ఇంటి ముందు టెంట్
వేసుకొని దినమంతా కూచోని రాత్రి, వో రెండు గంటలు చీకట్లో, ఇంట్లో
పనులు చక్కదిద్దుకోవటం.  మౌనదీక్ష అంటె తోటి మంత్రులను, అందు
లోను మహిళా మంత్రులపై దాడి చేయించి, పిడికిలెత్తి బెదిరించి, వెక్కిరింతగ
నవ్వుకుంటు వేదికకు వెళ్ళటము అక్క్డడ హుషారుగా అందరితో ముచ్చట
పెట్టటం.  ఆంధ్రోల్ల మాటలకు అర్థాలే వేరులే.
నల్లారి నల్లికుట్లోడె కాదు, నికృష్టుడు.  కిరణ్ రెడ్డి కిరికిరి రెడ్డె కాదు, కిరాతక
రౌడి.
రాష్ట్రములో 80% మంది సమైక్యాన్ని కోరుకుంటున్నారట!  సమైక్యము పేరుతో
రాజ్యసభ ఎన్నికల్లో నిలబడ్డ ఇద్దరు కాస్తా వెనుకాముందు పోటి నుండి
విరమించుకున్నారు, గెలవలేమని భయంతోనెనని వాళ్ళె ఒప్పుకున్నారు.
మరి సమైక్యం ఎక్కడుంది?  సమైక్యము గెలవలేదంటె, ఓడిపోయిందని వాళ్ళే
బట్టబయలు చేసుకున్నరు.  ఈ నాటకాలు ఇంకా ఎన్ని రోజులు చూడాలో?
ఈ దౌర్జన్యానికి ముగింపు ఎప్పుడు?