Sunday, January 4, 2015

Musing

నాలో నేను 

ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటే రకరకా ఆలోచనా తరంగాలు ఎగిసిపడుతుంటాయి.  జీవితం అంటే ఏంటో అర్థమయ్యేసరికి జీవిత కాలం సరిపోదనిపిస్తుంది.  
అన్ని జీవరాసుల్లో పంచభూతాలు అంతర్లీనమై వున్నా బుద్ధి, మనస్సు, అహంకారం మానవులలో మాత్రమే వ్యక్తమౌతుంది. మనస్సు ఇంద్రియాలకు అలవాలామైతే అది జంతువుల్లో వున్నట్లే. ఎందుకంటె అవి పూర్తిగా ఇంద్రియాలకు లోబడే పనిచేస్తుంటాయి. వీటిలో కొంతమేరకు అహంకారము కూడ వుంటుందేమో? అవి గుంపుగా వుండటము, వాటిని సంరక్షించుకోవటము జీవనపోరాటమే కాక  స్వీయ అస్థిత్వ  అహంకారములో భాగమేనని నా కనిపిస్తుంది. 
'బుద్ధి' అన్నది మాత్రమే కేవలము మానవజాతికే పరిమితమైనది.  బుద్ధి వలన జ్ఞానము, విచక్షణ, ఇంద్రియ నిగ్రహము వృద్ది చెందుతాయి. విషయ పరిజ్ఞానము విచక్షణ కలుగజేస్తుంది.  యుక్తాయుక్త విచక్షణ మనస్సుని ఇంద్రియ ప్రలోభాలను నిగ్రహించెటట్లు చేస్తుంది.  ఇంద్రియ ప్రలోభాలు తత్సుఖాలనుండి మనస్సు విడివడితె అది ప్రశాంతమౌతుంది.  ఆ ప్రశాంతమైన మనస్సు నిశ్చల సరస్సు వలే వుండి పరమాత్మను సాక్షాత్కరింప చేసుకుంటుంది. నిశ్చలమైన సరస్సులో భూమ్యాకాశాలు, పరిసరాలు ఏ విధంగానైతే స్పష్టంగ ప్రతిబింబిస్తాయో నిశ్చల మనస్సులో కూడ  సర్వాంతర్యామి సాక్షాత్కరిస్తారు.  

No comments:

Post a Comment