హైదరాబాద్ లో ఒకప్పుడు ఎన్నో చెరువులు ఉండేవని అవన్నీ ఆంద్రొళ్ళ పాలనలో కబ్జాకు గురైనవని అంటరు. "City Of Lakes"గా గుర్తింపు పొందిన హైదరాబాదులో ఇప్పుడు చెరువులు ఎక్కడెక్కడ వున్నాయో వెతుక్కొని, ఏ స్థితిలో వున్నయో చూసుకొని బాగుచేసుకోవాల్సిన పరిస్థితి. KCR - తెలంగాణ ప్రభుత్వములో "మిషన్ కాకతీయ" పేరుతో నీటి పారుదల శాఖ మంత్రి అదే పనిలో వున్నడు. ఏట్లాగు పక్క రాష్ట్రాలు కట్టిన రకరకాల చిన్న పెద్ద ప్రాజెక్టుల కారణంగా మనకు క్రిష్ణా, గోదావరి నీళ్లు రావటము అంతంత మాత్రమె అని సీరియస్ గా చెరువుల పూడికతీతకు పూనుకున్నరు. ఈ పని కొంతవరకు జరిగి అప్పుడె సత్ఫలితాలు ఇస్తున్నట్టు వార్తలు వినబడుతున్నయి. మరో రెండుమూడేళ్ళలొ చెరువులన్నీ పూడికతీసి, చెట్లు నాటే కార్యక్రమము సక్రమంగా సాగి చెట్లు పెరిగితే తెలంగాణా సస్యశ్యామలం అవుతుంది.
గత కొన్ని ఏళ్లలో చెరువులు ఎట్లా నాశనం అయ్యయో, నదులు ఎట్లా మురికి కాలువలుగా మారాయో తెలుసుకోవడానికి హుస్సేన్ సాగర్ ను మూసినదిని చూస్తే అర్థమైపోతుంది.
హైదరాబాద్ నుండి వరంగల్లు వెళ్ళే దారిలో, ఉప్పల్ దగ్గర నల్లచెరువు ఒకప్పుడు చాల పెద్దగ వుండెది. నా చిన్నప్పుడు చూసిన గుర్తుంది. చుట్టు పక్కల దగ్గరలో ఇల్లు కనిపించేవి కాదు. చెరువులో బాతులు తిరుగుతూ కనిపించెవి. రానురాను ఆ చెరువు చుట్టు ఇల్లు అపార్ట్ మెంట్లు రావటము, ఆ చెరువు చిన్నగ కావటము అక్కడ కొన్నిసార్లు కంపు వాసన రావటము బాధ కలిగించేది.
ఈమధ్యె ఆ దారమ్మట వెళ్ళ్తు నేను కొన్ని పక్షులను చూసిన. ఆ నీటి పిట్టలను చూసి చాల సంతోషమనిపించింది. చకచక కొన్ని ఫోటోలను తీసుకున్నాను.
చెరువుల బాధ్యత మంత్రి, హరీషరావు గారిదైతె, నగర సుందరీకరణ మంత్రి తారక రామారావు గారిది. ఇద్దరు కలిసి ఈ చెరువును పునరుద్దరించి, దానిని ఒక చిన్న "బర్డ్ సంక్టురిగా మారిస్తే అదో అందమైన ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతమవుతుంది. ఆ జాతీయ రహదారిన వెళ్ళే వాళ్లు కాస్సేపు అక్కడ ఆగి ఉత్సాహంగా ముందుకు సాగుతరు
No comments:
Post a Comment