Monday, February 9, 2015

Dream City

కట్టాలంటె కూల్చాలా?

"నగరాలు ఎవరు కట్టరు, అవే అవసరాలను బట్టి మాడిఫై ఐతై  -పరిణామము చెందుతాయి", అని అన్నారు.  కరక్టె.  నగరాలు నిర్మించరు.  భవనాలు నిర్మిస్తారు. వాటిలో ప్రజలు నివసించినా, ప్రజావసరాలకు వినియోగించినా నగరాలు విలసిల్లటము జరుగుతుంది.  వేల ఏండ్ల కింద కట్టిన కట్టడాలు ఎన్నొ ఆ నాటి నగారికతకు చిహ్నంగా, చారిత్రక గుర్తులుగా ఇప్పటికి వున్నాయి.  కొన్నింటిని వారసత్వపు కట్టడాలుగా పరిరక్షించబడుతున్నయి. యుద్ధాల్లోనొ, ప్రకృతి వైపరిత్యాలవల్లో నేలమట్టమైన కోటలు, కట్టడాలను అక్కడ లభ్యమయ్యె ఆనవాళ్లతో ఆనాటి నాగరికతను, ప్రజల జీవన విధానన్ని తెలుసుకునే ప్రయత్నము జరుగుతుంది.  ప్రతి కట్టడము వెనక ఆ నాటి దేశకాల పరిస్థితుల ప్రభావము వుంటుంది.  చరిత్ర మనిషికి గతాన్ని తెలియజేయటెమే కాదు వర్తమానంలో ఎట్ల వుండాల్నో, భవిష్యత్తు ఎట్ల వుంటుందో సూత్రప్రాయంగా నేర్పుతుంది.
కెసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చింది.  దాని వెనక ఎందరు ఎన్ని రకాలుగా కష్టపడ్డారో, నష్టపడ్డారో ఆఖరకు అసాధ్యమని భావించినది ఎట్లా సాధ్యమైందో చరిత్ర తెలియచేస్తుంది.  ఒక నాటకము లేదా సిన్మా రక్తికట్టాలంటె తెరవెనుక ఎంత తతంగము జరుగుతుందో అందులో ప్రత్యక్ష్యంగా లేదా పరోక్షంగా పాల్గొన్నవారికి మాత్రమే తెలుస్తుంది.  కాని చివరఖరకు అత్యధిక గురింపు వచ్చేది కథానాయక పాత్రధారునికే.  కెసిఆర్ పట్ల తెలంగాణ ప్రజలకు ఆ ఆరాధ్య భావము, గౌరవము వున్నది.  ఆయన చూపె అత్యద్భుత కలలను కొంతైనా నిజం అవుతాయని ప్రజలు ఆశతో, ఆసక్తితో ఓపికగా ఎదురుచూస్తున్నరు.  ఆకాశహర్మ్యాలు కాదు, ప్రజలకు నేల మీద ఇల్లు కావాలి.  అవి ఎంత తొందరగా అయితె అంత మంచిది.  ఆకలిగొన్న వాడికి పరమాన్నము, బిర్యాని అవసరము లేదు.  పప్పనం చాలు,  ఓ పండిస్తె అదే పదివేలు.  పరమాన్నం వండి వడ్డించే వరకు మరి ప్రాణం నిలబడాలి కదా!  గోల్డ్ స్టాండర్డ్ కాదు సిల్వర్ స్టాండర్డ్ పెట్టుకుంటె ఎక్కువ మంది ప్రజలు లబ్ది పొందే అవకాశముంటుందన్న భావన ఒక సందర్భములో స్వామి వివేకానంద వ్యక్త పరిచినట్టు గుర్తు.
తెలంగాణలో చాలా చోట్ల ప్రభుత్వభూములున్నాయని చెప్తున్నారు కదా.  కొత్త కొత్త కట్టడాలు అక్కడ కడితె బాగుంటది.  రవింద్రభారతి వున్నది వున్నట్టుగ వుంటె మంచిదే.  దానిని మునుపటిలాగే వాడుకోవచ్చు.  విశ్వనగరంగా మారబోతున్న హైదరాబాదులొ ఎక్కువ కళాకేంద్రాలు వుంటె మంచిదే కదా. ఏ స్థాయిలో జరిగె కళా ప్రదర్శనలు ఆ స్థాయి తగ్గ కేంద్రాల్లొ జరుగుతాయి.  ఒకటి కూలగొట్టి మరోకటి అదే స్థానంలో కడ్తాననడంలో అర్థం లేదు.
తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో కొత్త నిర్మాణాల అవసరమున్నది.  కాని చారిత్రక కట్టడాలను కాపాడుకోవలసిన అవసరము కూడ అంతె వుంది.
                                             **************************
 
ఈ మధ్యే వొ వూరి నుండినా దగ్గర్కి  ఒకరు వచ్చారు.  వాళ్ల వూళ్ళొ ఇదివరకు పించన్లు వచ్చే కొందరికి పించన్లు ఆగిపోయినయంట.  "రెండు వందలు వచ్చిన చాలు ఇదివరకు వచ్చినొళ్ళందరికి పించన్లు వస్తె బాగుంటది", అని ఒక ముసలమ్మ బాధ పడింది.  ఆమె పేరు మీద ఉన్న ఆస్తి కొడుకులకు పంచింది.  రికార్డులలో  మాత్రం పేర్ల మార్పు లేదట. కొడుకులు అసలు పట్టించుకోవట్లేదని, పేర్లు మార్చాలంటె పైసలు కావలని,  ఆస్తి తన పేరు మీదే వుండటముతో పించను రావట్లేదని చెప్పింది.  నెలకు రెండు వందలు వస్తె తన మందుల కర్చులు ఎల్లిపోయేదని వాపోయింది. 

No comments:

Post a Comment