Saturday, March 2, 2013

Politishuns

రాజికీయ నాయకుల్లు
ఈ రాజకీయనాయకులు ప్రజలు చాలా తెలివి తక్కువ
వాళ్ళని అనుకుంటారు.  పదవుల్లో వుండేసరికి తమను
మించిన ఘనులు లేరని భావిస్తారు.  ప్రజల వల్లె వాళ్ళకు
పదవులు వచ్చాయని మర్చిపోతారు.  అధికారంలో వున్న
వాళ్ళకు మరీ నిర్లక్ష్యం.  వాళ్ళు ఏం చేసిన, మాట్లాడిన
ప్రజలు మర్చిపోతారని అనుకుంటే పొరపాటే.  మహామహులని
కూడా ఓట్లతో ప్రజలు మట్టి కరిపించిన సంగతి ఎవరు మర్చి
పోవద్దు. 
కొందరు నాయకులు ఓ నాయకుడిని అనుసరించబోయి,
ఆయనలా colloquial భాషా మాట్లాడె యత్నంలో
తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు.  ఆ నాయకుడు
ప్రజలు ఆకుట్టు కునే విధంగా వ్యవాహరిక భాష మాట్లాడి
ప్రజలను ఉత్తేజ పరిస్తే, వీరు మాత్రం ప్రజలను హింస
ప్రోత్సహిస్తున్నట్టు మాట్లాడి, అది కరెక్ట్ అని సమర్థించు
కుంటున్నారు.  ప్రభుత్వం వాళ్ళ వారిదె కాబట్టి అంతా
చెల్లిపోతుంది.  మరొకడు సాక్షాత్తు ప్రధాన మంత్రి పట్ల
‘లు*’ అంటు అసభ్య పదజాలం వాడాడు.  దీనిపై
కనీసము ఏ ఒక్క కాంగ్రెస్ నేత స్పందించక పోవటము
చాలా విచారకరము.
 రాజకీయాల్లో ఇంత దిగజారుడు
తనము సామాన్యులకు భరించటము కష్టమౌతుంది.
వీళ్ళ ఈ ప్రవర్తన కారణంగ వారిపట్ల సామాన్యులు గౌరవం
కోల్పొతుంటే, నీచుల దుశ్చర్యలకు పరిమితి లేకుండా
పోతుంది.  నాయకులు నీచులు, దుష్టులు ఐతె వారిని
అనుసరించేవారు ఇంకింత దిగజారటములో ఆశ్చర్యమే
ముంది?
యథా రాజా, తథా ప్రజ.

No comments:

Post a Comment