Sunday, March 17, 2013

Ruling Opposition Leader

రెడ్డి నాయుడి గెలుపు
చంద్రబాబు నాయుడు మొత్తానికి కిరణ్ కుమార్ రెడ్డి
ఋణం తీర్చుకున్నడనె చెప్పాలి.  తెలంగాణాలో 2000 వేల
మంది పోలీసులతో రక్షణ కల్పించి, పాదయాత్ర సజావుగ
సాగెటందుకు సాయం చేసాడు కిరణ్ రెడ్డి.  ఇప్పటికి
ఆంధ్రలో యాత్ర సాగే అందుకు సహకరిస్తున్నాడు.
అందుకు ప్రతిఫలంగా అవిశ్వాస తీర్మానాన్ని సరిగ్గ
చర్చకు కూడా రాకుండ తుస్సుమనిపించి కిరణ్ రెడ్డికి
మరింత అత్మవిశ్వాసాన్ని పెంచాడు చంద్రబాబు నాయుడు. 
ఎంతైనా ఆంధ్రులిద్దరు ఒక జిల్లా వారె కద!  తెలంగాణా
విషయము వస్తె ఏ పార్టి వారైన సీమాంధ్రులంతా
ఒకటైపోతారు. ఈ తెలంగాణ నాయకులకు బుద్ద్ధి
ఎప్పుడు వస్తుందో?   
           *************
కె.సి.ఆర్ అవిశ్వాసము పెడతానన్నప్పుడె అందరికి
తెలుసు అది చర్చకు రావడము కూడ డౌటెనని.
అయిన ఎందుకు పెట్టారూ?  తెలంగాణా పదమె ఉచ్చరించ
నివ్వని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణా గురించి మాట్లాడక
తప్పని పరిస్థితి కలిపించటము, అసెంబ్లి సాక్షిగా తెలంగాణకు
జరుగుతున్న అన్యాయాల గురించి ప్రజలకు తెలియచేయటము
సాధించారు.  ఇది TRS MLAలు అసెంబ్లిలో వుండటము
వల్లనె సాధ్యమైంది.  17 మంది ఇట్లా నిలదీయగల్లిగినప్పుడు
వంద మంది TRS MLAలు వుంటె పరిస్థితి ఎలా వుంటుంది?
KCR వ్యవహారాల పట్ల ఎంత అయిష్టత, అసహనము వున్నా
TRS తెలంగాణ పార్టిగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.
              ****************
TRSతో పొత్తు పెట్టుకొని 2009లో తెలంగాణాలో సీట్లు
గెలుచుకున్న చంద్రబాబు దాన్ని‘ తోక పార్టి’ అని ఈసడించటం
తెలంగాణ ప్రజలను ఈసడించటమె.  ఈ మాట అన్న బాబుగారు
పాము తోకను తొక్కారని మర్చిపోవద్దు.  అప్పుడెప్పుడో
CM-YSR, తెలంగాణ మంత్రులు రాజీనామ ఇచ్చారంటె,
‘ఐతె ఏంటటా’ అని నవ్వారు.  మొన్నటికి మొన్న‘ తెలంగాణాకు
ఒక్క రూపాయి కూడ ఇవ్వం.  ఏం చేసుకుంటావో చేసుకోపో’, అని
అసెంబ్లి సాక్షిగ AP CM అన్నారు.  ఈ మాటలు, అట్లా
అంటున్నప్పుడు వారి హావభావాలను కూడ ప్రజలు మర్చిపోరు.
            *******************
భాష రాని వారితో ఎంత బాధనో!  తెలంగాణాలో నిలదీసి అడగటాన్నీ
‘గల్లా(కాలర్) పట్టుకొని’ అడగటమని అంటారు.  దానిని literalగ
తీసుకుని తెలంగాణ పట్ల లోపల వున్నఅయిష్టతని, వ్యతిరేకతని
ప్రజల ముందు ప్రదర్శించాడు, ఆంధ్ర సి.ఎమ్.  తెలంగాణ ప్రజలు
తెలంగాణ ఉద్యమము ద్వార చైతన్యవంతులై వాళ్ళ హక్కుల
కొరకు పోరాడుతున్నారు.  అదె విషయము హరీశ్ నోటి వెంట వచ్చింది.
అది ఒక సాకుగ తీసుకొని కిరణ్ రెచ్చిపోయి మనసులొ తెలంగాణ
పట్ల వున్న అక్కసును బైట పెట్టాడు.
              ********************
చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు నాయడుగ పేరున్న సంగతి
లోకమంతా తెలుసు.  ఇప్పుడు కొత్తగ జీవతాంతము వెన్నాడె
మరో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.  రోడ్ల మీద ప్రభుత్వాన్ని దుయ్య
బడుతాడు, కాని అసెంబ్లిలో మాత్రము నిలదియ్యడు.  ఒక ప్రాంత
ప్రజల కష్టాల గురించి   ఏ మాత్రము పట్టింపు ఉండదు.  ప్రధాన ప్రతి
పక్ష నేతగ వుండి అసెంబ్లిలో ప్ర్జజల పక్షాన పోరాడక,యాత్రల మీద
యాత్రలు చేస్తున్నాడు.  ఉన్న ప్రభుత్వము తప్పులు ఇంక ఇంకా
చేయాలని, తరువాత ప్రజలు తనను తప్పక ఎన్నుకుంటారని
ఆయన నమ్మకము.  చూడబోతె బాబు మళ్ళి ఎలక్షనులు వచ్చె
వరకు పాదయాత్రలోనె వుండేట్లువుంది.  ‘పాదయాత్రల ప్రభుత్వప్రతిపక్ష
నేతగా’ చరిత్రలో నిలిచిపోతాడు.  బాబు CM కావలనె
 మనాదితో ఏమైతడో ఏమో?

No comments:

Post a Comment