Monday, November 25, 2013

News - Views

ఏం టీ నాన్చుడు?
మళ్ళి  కొత్త కథ మొదలు పెట్టినరు.  రాయల తెలంగాణ
ఇస్తె ఎట్లుంటదని కేంద్రం ఆలోచిస్తుందంట.  ఇద ఎవరి
ఆలోచన, ఎందుకీ కొత్త ఆలోచన?  సీడబ్ల్యుసీ ఏదైనా
చెపితె అది శిలాశాసనమని అన్నరు.  హైదరాబాదు
రాజధానిగా పది జిల్లాల తెలంగాణ ఇవ్వాలని కదా
సీడబ్ల్యుసీ ఈ ఏడాది జులై ముప్పైన నిర్ణయించినట్టు
ప్రకటించింది.  ఇప్పుడు దాన్ని రాయల తెలంగాణాగా
మార్చుకుంటే ఆ నిర్ణయము పెన్సిల్ గీతలా, లేకపోతె
నీటి మూటలా?  ఈ అనుమానము నాకే కాదు అందరికి
వస్తుంది.  కేంద్రం తెలంగాణ విషయము మళ్లి నాన్చాలనుకుంటుందా?
ఇందులో సీమాంధ్రు నాయకుల కుట్ర్ల ఏమైవుంటుంది?
పొరపాటున రాయల తెలంగాణ అంటె ఇప్పడి వరకు తయారు
చేసిన తెలంగాణ బిల్లు మూల పెట్టి మళ్ళి కొత్తది తయారు
చేయాల్సిందే.  అంటె తెలంగాణ బిల్లు రాబోయె శీతాకాల సమా
వేశాల్లో రాకుండ అపేస్తె ఆ తరువాత యుపియె హయాంలో
తెలంగాణ రాకుండ ఆపేసినట్టే.  అంతే కాకుండ, సీడబ్ల్యుసీ తన
నిర్ణయాన్ని మార్చుకుంది కాబట్టి, అది శిలాశాసనము కానట్టె.
కాబట్టి సీడబ్ల్యుసీ ఒక నిర్ణయాన్ని వెనిక్కి తీసుకుంటె, అట్లాగె
తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని కూడ మార్చుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా
వుంచాలని సీమాంధ్ర నాయకులు అన్ని శక్తియుక్తులతో తీవ్ర ప్రయత్నం
చేస్తరు.  సో, తెలంగాణ కాంగ్రేసు నాయకులెవ్వరు రాయల తెలంగాణకు
పొరపాటున కూడ ఆవగింజలో వెయ్యోవంతు కూడ సానుకులత చూపొద్దు.
రాయల తెలంగాణ వద్దే వద్దు.  హైదరాబాదు రాజధానిగా పది జిల్ల్లాల
తెలంగాణే ముద్దు. 

Monday, November 18, 2013

News - Views

ఆత్మగౌరవ ఓదార్పు
"కేంద్రము తెలంగాన ఏర్పాటుకు చక చక ముందుకు పోతున్నట్టె
వుంది కదా".
"అవును.  తెలంగాణ వచ్చుడు ఖాయములే."
"మరి గీ బాబులు ఇంకా ఏందో యాత్రలు చేస్తరంట?"
"చేస్తరు, చేస్తరు.  మరి అధికారమెటు లేదు.  ప్రజల మధ్య
వుంటానికి, టీవిలల్ల కనబడ్డానికి ఏదో చెయ్యాల గద."
"ఏం చేసుడో, ఏందో.  పచ్చ జెండాయనకు ఆత్మగౌరవం  తక్కు
వైందట.  ఆత్మగౌరవ యాత్ర చేస్తడంట.  మాటకు కట్టుబడనోళ్లకు
గౌరవముంటదా?  మాటలు మారుస్తు, వెన్నుపోటు పోడిచేటోడిని
ఎవరు గౌరవిస్తరు?  ఎవరి గౌరవాన్ని పెంచుతడు?  జగనన్నకేమో
ఓదార్పు కావలంట.  ఈ ఓదార్పు ఎవరి కోసము, ఎందుకొసమో
నాకైతె సమజైతలేదు."
"జైల్లొ వుండి వచ్చిండు కదా.  ఆయన ప్రజల్ను ఓదార్చుడు కాదు.
ప్రజలు ఆయన్ను ఓదార్చాలె."
"కరక్టే.  తండ్రి పోయి నాలుగేండ్లాయె.  వారసత్వంగా ముఖ్యమంత్రి
పీఠం మీద కూర్చోవల్సింది పోయి జైల్లో యాడాది కంటె ఎక్కువ
వుండాల్సి వచ్చే.  ఇప్పుడేమో తెలంగాణలో పార్టీ అడ్రెస్ లేకుండా
పోయె.  పాపం. జగనుకేన్ని కష్టాలో.  నిజంగానే ఆయనకు ఓదార్పు
అవసరము.  జనాలంత ఇడుపులపాయకో, తామరకొలనుకో పోయి
కొన్నాళ్ళుండి జగనన్నను, ఆయన కుటుంబాన్ని ఓదారుస్తె బాగుంటది."
"షర్మిలమ్మను ఓదార్చలన్న విషయాన్ని ఎట్లా మర్చిపోయవని నేను
అడగదల్చుకున్నా."
"అవునవును.  ఆ బాణం ఇప్పుడె అమ్ముల పొదిలో వుందో తెలుసికొని
ఓదార్చాల్సిందె.  ఆ బాణం అరిగి పోయిందా, విరిగిపోయిందా ఏ మూలుందో
ఎవరికి తెలుస్తలేదు.  అసలు సిసలు ఓదార్పు ఆమెకె కావాలె."
"ఇవాళ్టితో జీవోఎమ్‍తో పార్టీల, మంత్రుల భేటి ఆఖరైంది కాబట్టి, ఇక కాంగ్రేసోళ్ళు
కూడ జోరుగా జైత్ర యాత్రలు చేపడ్తరు కావచ్చు."
"నిజంగా వాళ్లకు కొంచెం కూడ ‘ఇది’ లేదు.  పిల్లలు ఉద్యమాలు చేసి ప్రాణాలు
పోగొట్టుకుంటుంటే, ఆస్పటల్లో, జైల్లో పడితె ఒక్కనాడన్న పట్టించుకున్నరా?
ఇప్పుడు మేమె తెలంగాణ తెచ్చినమని సభలు పెట్టి డప్పు కొట్టుకుంటున్నరు.
కిరణ్‍కుమార్ రెడ్డి అయితే రచ్చబండ పేరుతో లేనిపోని అబద్ధాలు చెప్పుకుంట
అన్ని జిల్ల్లాలుకు తిరుగుతున్నడు.  తెలంగాణలో రానిస్తలేరు కాబట్టి ఆంధ్రకెళ్లి
విషం కక్కుతున్నడు."
"అసలు కిరణ్‍కుమార్ కాంగ్రేసు నాటకములో పావేమో?  లేక పోతే పోతే సీమాంధ్ర
కన్న తెలంగాణకే చాలా నష్టమని కొత్త ప్రచారము స్టార్ట్ చేసిండు.  ఇది సమైక్యమని
అనేవాళ్లకు కాస్త ఓదార్పుగ పనిచేస్తుందేమో."
"ఈ రాజకీయ నాటకాలేమో కాని అంతా ప్రజల ఉసురు పోసుకుంటున్నరు.  60 ఏండ్ల
బట్టి పోరాడుతుంటే, ఇప్పటి వరకు 1500 మంది ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ
సాధించుకుంటె, ఇంకా ఓట్లకోసం సీట్లకోసం అన్ని పార్టీలు  ప్రతిరోజు ఏదో ఒక పరెషాన్
చేసె మాటలంటు ప్రజలను టెన్షన్లో పెడుతున్నరు.  ఈ ఏడాది ఈ కథ ముగిసి కొత్త
ఏడాదన్న ప్రశాంతంగ గడవాలె."

Thursday, November 14, 2013

News - Views

చంద్రబాబు - ధృతరాష్ట్ర ప్రేమ
చివరాఖరకు చంద్రబాబు జీవొఎం ముందుకు తాను
వెళ్లలేదు.  పార్టీ నుండి కూడ ఎవరిని పంపలేదు.  అసలు
ఆయన ఆలోచన పద్ధతేంటో ఎవరికి సమజైత లేదనుకుంటా.
విభజన తప్పదని తెలిసి కూడ సమన్యాయమేంటో చెప్పలేక
పోవడము తొమ్మిదేళ్లు ఆం.ప్ర. ముఖ్యమంత్రిగా పని చేసిన బాబు
అఙ్ఞానాన్ని అవకాశవాదాన్ని, వెన్నుపోటు గుణాన్ని బైటపెడుతుంది.
వైకాపా సమైక్యవాదాన్నైన వినిపించి, మేము విభజన ఆపడానికి
అన్ని ప్రయత్నాలు చేసినట్టు ప్రజలకు చెప్పుకోవచ్చు.  విభజన
అనుకూలంగ లేఖ ఇచ్చి వెనిక్కి తీసుకోని బాబు రేపు ప్రజలకు
ఏం చెప్పుకుంటాడు?  వేయికి మించి ఆత్మహత్యలకు కారణమై
బాబును తెలంగాణ ప్రజలు ఎలాగు క్షమించరు.  విభజన తరువాత
తమకు కావలసిందేమిటో చెప్పని బాబును ఆంధ్రప్రజలు మన్నిస్తారని
అనుకోను.  ఎన్డియే హయాములో కేంద్రాన్ని తెలంగాణ ఇవ్వకుండ
శాసించిన చంద్రబాబుకు యుపియె ప్రభుత్వము ముందు తన ప్రజల
అవసరాలను ముందుపెట్టడానికి అహంకారము అడ్డమొచ్చిందను
కుంట.  అన్ని పార్టీలు కేంద్రానికి తమ అభిప్రాయాలు తెలిపినప్పుడు
చంద్రబాబు తెల్పక పోవడము అతని ఆంధ్ర అభిజాత్యానికి, అహం
కారానికి పరాకాష్ట.
చంద్రబాబు అదివరకు రెండు కళ్ల సిద్ధాంతము గురించి మాట్లాడిండు.
కళ్లు రెండైనా చూపు ఒకటె కద, మెల్ల కన్నుంటె తప్ప.  సరె, పోని.
చూపు సీమాంధ్రా వైపనుకున్నా తీర విభజన సమయములో ఆంధ్రోళ్లకు
ఏం న్యాయం కావాలో చెప్పలేదు.  అంటె ప్రస్తుతానికి అతనికి రెండు కళ్లలో
పూవు (cataract) వచ్చిందా లేక షుగరుంది కాబట్టి నరాలు దెబ్బ
తిన్నాయా? అందుకే సీమాంధ్ర భవిషత్తుకు ఎలాంటి vision ముందు
పెట్టలేక పోయిండు.
 రెండు కళ్ల తరువాత సమన్యాయము పాటెత్తుకున్నడు.
అసలుకైతె ఈ పదాన్ని ముందు ముందుకు పట్టుకొచ్చింది శ్రీమతి
విజయలక్షమ్మమ్మగారు.  దాన్ని కాస్త చంద్రబాబుతో సహా అందరు
అంది పుచ్చుకున్నరు.  సమన్యాయం జరగట్లేదనే తెలంగాణ వాదము,
పోరాటము ముందుకొచ్చింది.  రాజకీయ ఉద్యమ పార్టీగా తెరాస
అహింసాయుతంగా, రాజ్యాంగబద్ధంగా పోరాటము చేస్తు, ప్రజాస్వామ్య
బద్ధంగా ఓట్లు, సీట్లు సాధించుకొని శాసించి తెలంగాణ తెచ్చుకుంది.
ఓట్లు సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారనే వాళ్లు - రాజకీయ పార్టీలు,
తెరాసతో పొత్తు పెట్టుకున్నది, తెలంగాణకు అనుకూలంగ లేఖ ఇచ్చింది,
తెలంగాణకు అనుకూలమని తరువాత సమైక్య రాగమందుకున్నది
ఓట్లు, సీట్ల కోసం కాదా?  తెలంగాణకు అనుకూలం కాని రాజకీయ
పార్టీ తెలంగణలో అడ్రసు లేకుండా పోతుందని తెలిసే కదా అన్ని పార్టీలు,
ఒక CPM మినహా ఎప్పుడో అప్పుడు తెలంగాణ ఏర్పాటుకు మేము
అడ్డము కాదు, నిలువు కాదని అన్నయి.  CPM కూడ ఆఖరకు మేము
అడ్డుపడతె మాత్రము మీరు ఇవ్వడము ఆపుతారా? మీ ఇష్టం.  ఏం చేస్తారో
చేయండి అని చెప్పింది.  ఈ రెండు కళ్ల బాబుకే స్పష్టత లేదు.  తెలంగాణకు
వ్యతిరేకము కాదంటడు.  సమన్యాయమంటడు.  ఏ విధంగా సమన్యాయము
చేయాలో చెప్పడు.  తెలుగుజాతి ముక్కలు చేస్తున్నరని, జాతిని ఒక్కటిగా
వుండాలని అంటడు.  అంటే, రాష్ట్రాన్ని విభజించవద్దని చెప్పొచ్చు కదా.  అట్లా
చెప్పడు.  అసలు చంద్రబాబు ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నడు?
తనను తనే మోసగించుకోవటముతో సాధించేదేమిటో?
ఈ మధ్య ఇద్దరు కొడుకుల సిద్ధాంతాన్ని పట్టుకొచ్చిండు. ఇక్కడ కూడ gender
bias. ఇద్దరు పిల్లలనొచ్చు కదా?  సరె పోని.  ఒక్కరె సంతానము వున్నప్పుడు
choice వుండదు.  ఒక్కరికంటె ఎక్కువ పిల్లలున్నప్పడు అందరిని ప్రేమగా
చూసినా ఎవరో ఒకరిపట్ల కాస్త పక్షపాతము వుండొచ్చని, దానికి కారణాలు
వుండొచ్చని పురాణ కాలం నుండి కూడ దృష్టాంతాలు వున్నాయి.  ఈ మధ్య
కాలములో అమెరికాలో ఓ యూనివర్సిటి వాళ్లు పరిశో్ధించి మరీ చెప్పారు
తల్లిదండ్ర్ల్లు పిల్లలందరిని ప్రేమించినా వాళ్లకు ఒక్కొక్కరి పట్ల ప్రత్యేక అభిమాన
ముండొచ్చని.  దానికి వారికి కారణాలు కూడ వుంటాయి.  నేను చిన్నప్పుడు
రామాయణము చదివినప్పుడు ఒక కథ నాకు బాగ గుర్తుండి పోయింది.
విశ్వామిత్రుడు ఒకసారి యాగము చేయటానికి యఙ్ఞ పశువుగా కట్టడానికి
మనిషి కావల్సి వచ్చింది.  అప్పుడతను తన చెల్లెలు దగ్గరకు వెళ్తాడు.  ఆమెకు
ముగ్గురు కొడుకులు.  చెల్లెలుకు తను వచ్చిన పని చెపుతాడు.  అప్పుడు విశ్వా
మిత్రుని బావ అంటాడు, నేను మాత్రము నా పెద్ద కొడుకును పంపనని, చెల్లెలు
అంటుంది తను చిన్న కొడుకును విడిచి అసలే వుండలేనని.  అప్పుడు నడిపి
కొడుకు మేనమాతో అంటాడు, "నా తల్లిదండ్రులు వాళ్ల కిష్టమైన వాళ్లను ఎంచుకు
న్నారు.  ఇక మిగిలింది, వాళ్లకు పట్టింపు లేనిది నేనే.  నేను మీ వెంట వస్తాను".
విశ్వామిత్రుడు అతన్ని తన వెంట తీసుకువెళ్లి, యాగము తరువాత అతనికి
ఉపదేశము చేసి, కొంత సంపద కూడ ఇచ్చి పంపిస్తాడు.
దశరథునికి నలుగురు కొడుకులున్నా శ్రీ రాముడంటె అత్యధిక ప్రేమ.
రాముడు అడవికి వెళ్తె మిగిలిన కొడుకులను చూసుకుంటు బ్రతికి
వుండాల్సింది కద.
ఇప్పటి కాలములో కూడ చూస్తాము.  పిల్లలందరి మీద ప్రేమ వుండటము
వేరు.  అందులో ఎవరో ఒకరి పట్ల ప్రత్యెక అభిమానముండటము వేరు.  ఇది
బహిరంగంగ కనిపించక పోవచ్చు.  నాకు తెలిసిన కొంతమంది వున్నారు.  వారికి
పిల్లలందరికి ఏ అవసరమొచ్చినా బాగా చూసుకుంటారు.  కాని అందులో ఒకరి
దగ్గర వుండడానికే, చివరి రోజుల్లో వుండటానికి ఇష్టపడుతారు.  దానికి వాళ్ల కారణాలు
వాళ్లకు వున్నాయి.  చంద్రబాబుకు ఒక్కడె కొడుకు వుండటంతో పక్షపాతము చూపే
అవకాశము లేదు.  చంద్రబాబు సీమాంధ్రకు చెందిన వాడిగా సీమాంధ్ర పట్ల పక్షపాత
ధోరణి వుండటము అందరు అర్థం చేసుకుంటారు.  కాకపోతె ఆ విధమైన పక్షపాతము
చూపెట్టడము విఙ్ఞతగల నాయకుడి లక్షణము కాదు.  రెండుప్రాంతాల్లో ఓట్లు, సీట్లు
కావాలనుకున్నప్పుడు విభజన సమయములో కేంద్రము మీద లేనిపోని అభాండాలు
మోపుతు బహిష్కరించేకంటే, సంపూర్ణ సహకారము అందించి, విభజన సామరస్యంగా
జరిగెట్లు చూడాలి.  అప్పుడె చంద్రబాబు రెండు ప్రాంతాలకు సమన్యాయము చేసిన
వాడవుతాడు.  లేకపోతె సమ అన్యాయము చేసినవాడవుతాడు.
ఇంతకు ముందె విన్నాను.  కొత్తగా కొబ్బరికాయ సిద్ధాంతము గురించి మాట్లాడాడట.
నేనైతె అది ఏంటొ వినలేదు.  కొబ్బరికాయ చెట్టునుండి తెంపటము కష్టమా?
కొబ్బరి చెట్టుకింద నిలబడితె కొబ్బరికాయ మీద పడితె దెబ్బ బాగానే తగులుతుంది.
తెలంగాణను అడ్డుకుంటె అదే పరిస్థితి.  కొబ్బరికాయ పీచు సరిగ్గా తీయకపోతె కొట్టడము
కష్టమే.  అందుకే పీచు తీయాలి.  విషయ అవగాహనకు శ్రీ క్రిష్ణ కమిటీ ఊరూరు తిరిగి,
చిన్నోళ్ళని, పెద్దోళ్లోను, ఆడోళ్ళను, మగోళ్ళను, పళ్ళోళ్లను, పట్టణపోళ్లను, ప్రభుత్వపోళ్లను,
పార్టీలోళ్లను అందరిని సంప్రదించి ఒక నివేదిక కూడ ఇచ్చింది.  ఈ రిపోర్టును ముందేసుకొని,
మళ్లి మళ్ళి కేంద్రమోళ్ళు అఖిల పక్షమీటింగులు పెట్టి విషయాలన్ని తేటతెల్లంగా తెలుసు
కున్నది.  ఇక విభజన బిల్లు రావటమే మిగిలింది.  అంటె కొబ్బరికాయ కొట్టడానికి
రెడీగా వుంది.  ఎవరి ముక్క వాళ్లకు రావలిసిన విధంగా వస్తుంది.  ఒక ముక్క కాస్త
చిన్నది (పది జిల్లాల తెలంగాణ) రెండోది కాస్త పెద్దది (పదమూడు జిల్లాల సీమాంధ్రా)
వస్తుంది.  సామరస్యంగా విడిపోతు, కొబ్బరి నీళ్ళలాంటి తెలుగు వారి ఔన్నత్యాన్ని
కొత్త రాష్ట్రాల అభివృద్దితో ప్రపంచానికి చాటాలి.

Saturday, November 9, 2013

Telangana - Politicians' Drama

పార్టీల మాటలు - తప్పడాలు, తిప్పడాలు
భాజపా:
"ఓక ఓటు - రెండు రాష్ట్రాలు".
"తెలంగాణలో ఏపి రాజధాని హైదరాబాదు వున్నది.
ఇక ప్రత్యేక రాష్ట్రము అవసరము లేదు".
"అప్పుడు చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డందుకే తెలంగాణ
ఇవ్వలేక పోయాము.  మేము చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు
ఎప్పుడు అనుకూలమే."
"తెలంగాణ బిల్లు పెట్టండి.  మేము మద్దతు ఇస్తాము.  కాని
ముందు సీమాంధ్రుల సమస్యలను (విభజనే వారి సమస్య అని
 భాజపాకు తెలియదా?)  తీర్చండి.  రాష్ట్రవిభజన మీ(కాంగ్రేసు)
 ప్రైవేటు, వ్యక్తిగత వ్యవహారం కాదు."
"సమస్య మీరు పరిష్కరించండి.  మేమేం మాట్లాడం.  విభజన తరువాత
వచ్చేసమస్యలు ముందే తీర్చాలి.  బిల్లు పెడితే మద్దతు ఇస్తాము!"

తెదేపా
"తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము అనుకూలము."
"అస్సెంబ్లిలో వెంటనేతెలంగాణ బిల్లు మీరు పెడతారా, మమ్మల్ని
పెట్టమంటారా?"
"ఒక పెద్ద నిర్ణయము, రాష్ట్రాన్ని విభజించే నిర్ణయము, అర్థరాత్రి
ప్రకటించటము, తమళనాడుకు చెందిన చిదంబరము (అప్పుడు
కేంద్రములో హోమశాఖ మంత్రి), కర్ణాటకాకు చెందిన ఒక వీరప్ప
మొయిలి (అప్పుడు న్యాయశాఖా మంత్రి) నిర్ణయము తీసుకున్న
పరిస్థితి."
"తెలంగాణ, సీమాంధ్ర నాకు రెండు కళ్ళు.  కాంగ్రేసే (కేంద్రమే) ఈ సమస్యను
పరిష్కరించాలి.  ప్రణబ్ ముఖర్జి లేఖకు కట్టుబడి వున్నము."
"సీమాంధ్రాలో రాజధానికి కేంద్రము నాలుగైదు లక్షల కోట్ల ప్యాకేజి ఇవ్వాలి."
"సీమాంధ్రలో ఉద్యమము తీవ్రంగా వున్నది.  ఇరు ప్రాంతాలకు
సమన్యాయము చేయలి.  ఇద్దరు కొడుకుల్లో ఒకరని ఎంచుకోమంటే
ఎలా? (ఒక కొడుకు ఒక కూతురున్నా, ఇద్దరు కూతుళ్లే వున్న ఎట్లా
ఎంచుకుంటారు?)"
"సమన్యాయము చేసె వరకు రాష్ట్రాన్ని విభజించొద్దు.  సమన్యాయము
ఎంటంటే మీరె తెలుసుకోవాలి.  మేమెం చెప్పం.  రెండు ప్రాంతాలు
నాకు రెండు కళ్లు, ఇద్దరు కొడుకులు." (ప్రస్తుతానికి రెండు కళ్ళలో
పూవు వుంది - cataract)

వైకాపా
"వైయ్యెస్సార్‍కు తెలంగాణ ప్రజలంటే ఎంతో అభిమానం."
"వైస్సార్ పార్టీ తెలంగాణ సెంట్‍మెంట్‍ను గౌరవిస్తుంది."
"తెలంగాణ ఇచ్చేశక్తి కాని, ఆపె శక్తి కాని మా పార్టీకి లేదు."
"ఆర్టికల్ మూడు ప్రకారము కేంద్రానికే తెలంగాణ ఇచ్చె శక్తి వుంది.
రాష్ట్ర విభజన చేస్తె రెండు ప్రాంతాలకు సమన్యాయము చేయాలి."
"సమన్యాయానికి ఏం చేయాలో మేమెం చెప్ఫలేం."
"మీకు సమన్యాయము చేయడము చాతకాదు కాబట్టి రాష్ట్రాన్ని
సమైక్యంగానే వుంచాలి."
"రాష్ట్రములో, దేశములో అన్ని పార్టీల మద్దతు కూడ గట్టుకొని రాష్ట్రాన్ని
సమైక్యంగా వుంచడానికి యాత్ర చేస్తాం, కృషి చేస్తాం."

లోక్ సత్తా
"అధికార వికేంద్రికరణ వల్ల పరిపాలన సులభమౌతుంది."
"రాష్ట్ర విభజన వల్ల పరిస్థితుల్లొ పెద్ద మార్పేమి వుండదు."
"రాష్ట్రములో ప్రగతి కుంటు పడింది.  ఒక అనిశ్చిత పరిస్థితి
రాష్ట్రాభ్యుదయానికి మంచిది కాదు.  కేంద్రము దీనిపై త్వరగా
ఒక నిర్ణయము తీసుకోవాలి."
"రాష్ట్రనిర్ణయము కేంద్రం (కాంగ్రేసు) ప్రైవట్ వ్యవహరం కాదు.  అన్ని
ప్రాంతాల ప్రజల మనోభావాలు పట్టించుకోకుండ నిర్ణయము
తీసుకోవడము అమానుషము.  రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా
కేంద్రము రాష్ట్రాన్ని ఎలా విభజిస్తుంది?"
(తెలంగాణలో 1000 మందికి పైగా యువత ఆత్మహత్య చేసికుంటే
మాట్లాడని వాళ్ళు,  60 ఏళ్ళ ఉద్యమము కంటె రోజుల ఉద్యమాన్ని
గంటల్లో లెక్క పెట్టి మహా ఉద్యమమని గుండెలు బాదుకుంటున్నారు).

సీమాంధ్ర కాంగ్రెసు
"తెలంగాణ ఇవ్వడానికి అభ్యంతరము లేదు.  తెరాసతో పొత్తు
పెట్టుకుందాము.  కేంద్రములో, రాష్ట్రములో అధికారానికి వద్దాము.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి నిరంతరం చర్చలు కొనసాగిస్తాం.
మళ్లి మళ్లి తెలంగాణ పేరు చెప్పుకొని ఓట్లు, సీట్లు తెచ్చుకుందాం.
సీమాంధ్రను అభివృద్ధి చేద్దాం.  సమైక్యాంధ్రకే మద్దతిస్తాం.  తెలంగాణ
సెంట్‍మెంట్‍ను గౌరవిస్తాం.  తెలంగాణ ప్రత్యేక రాష్టం అంటు ఉద్యమంటె
జైల్లో పెడ్తాం.  నక్సలైట్లని ఎన్కౌంటర్ చేద్దాం.  విభజిస్తె నీటి యుద్ధాలు
వస్తాయి. నీళ్ళని పాజేక్టుల ద్వార, నిధులన్ని తరలించుకొని తెలంగాణ
ఎడారి అయ్యాక, తెలంగాణలో దొచుకోవాడనికి ఏమి లేనప్పుడు తప్పకుండ
తెలంగాణ ఇద్దాం.  ప్రస్తుతానికి తెలంగాణ ఇవ్వాల్సిన అవసరము లేదు.
తెలంగాణ ఇస్తె, హైదరాబాదు, గ్రేటర హైదరాబాదు లేని తెలంగాణ వారు
ఎప్పుడైనా తీసుకోవచ్చు.
తెలుగుజాతి ఒక్కటిగా వుంటెనె ఆంధ్రరాష్ట్రము అభివృద్ధి పథంలో
దూసుకుపోతుంది.'