ఆత్మగౌరవ ఓదార్పు
"కేంద్రము తెలంగాన ఏర్పాటుకు చక చక ముందుకు పోతున్నట్టె
వుంది కదా".
"అవును. తెలంగాణ వచ్చుడు ఖాయములే."
"మరి గీ బాబులు ఇంకా ఏందో యాత్రలు చేస్తరంట?"
"చేస్తరు, చేస్తరు. మరి అధికారమెటు లేదు. ప్రజల మధ్య
వుంటానికి, టీవిలల్ల కనబడ్డానికి ఏదో చెయ్యాల గద."
"ఏం చేసుడో, ఏందో. పచ్చ జెండాయనకు ఆత్మగౌరవం తక్కు
వైందట. ఆత్మగౌరవ యాత్ర చేస్తడంట. మాటకు కట్టుబడనోళ్లకు
గౌరవముంటదా? మాటలు మారుస్తు, వెన్నుపోటు పోడిచేటోడిని
ఎవరు గౌరవిస్తరు? ఎవరి గౌరవాన్ని పెంచుతడు? జగనన్నకేమో
ఓదార్పు కావలంట. ఈ ఓదార్పు ఎవరి కోసము, ఎందుకొసమో
నాకైతె సమజైతలేదు."
"జైల్లొ వుండి వచ్చిండు కదా. ఆయన ప్రజల్ను ఓదార్చుడు కాదు.
ప్రజలు ఆయన్ను ఓదార్చాలె."
"కరక్టే. తండ్రి పోయి నాలుగేండ్లాయె. వారసత్వంగా ముఖ్యమంత్రి
పీఠం మీద కూర్చోవల్సింది పోయి జైల్లో యాడాది కంటె ఎక్కువ
వుండాల్సి వచ్చే. ఇప్పుడేమో తెలంగాణలో పార్టీ అడ్రెస్ లేకుండా
పోయె. పాపం. జగనుకేన్ని కష్టాలో. నిజంగానే ఆయనకు ఓదార్పు
అవసరము. జనాలంత ఇడుపులపాయకో, తామరకొలనుకో పోయి
కొన్నాళ్ళుండి జగనన్నను, ఆయన కుటుంబాన్ని ఓదారుస్తె బాగుంటది."
"షర్మిలమ్మను ఓదార్చలన్న విషయాన్ని ఎట్లా మర్చిపోయవని నేను
అడగదల్చుకున్నా."
"అవునవును. ఆ బాణం ఇప్పుడె అమ్ముల పొదిలో వుందో తెలుసికొని
ఓదార్చాల్సిందె. ఆ బాణం అరిగి పోయిందా, విరిగిపోయిందా ఏ మూలుందో
ఎవరికి తెలుస్తలేదు. అసలు సిసలు ఓదార్పు ఆమెకె కావాలె."
"ఇవాళ్టితో జీవోఎమ్తో పార్టీల, మంత్రుల భేటి ఆఖరైంది కాబట్టి, ఇక కాంగ్రేసోళ్ళు
కూడ జోరుగా జైత్ర యాత్రలు చేపడ్తరు కావచ్చు."
"నిజంగా వాళ్లకు కొంచెం కూడ ‘ఇది’ లేదు. పిల్లలు ఉద్యమాలు చేసి ప్రాణాలు
పోగొట్టుకుంటుంటే, ఆస్పటల్లో, జైల్లో పడితె ఒక్కనాడన్న పట్టించుకున్నరా?
ఇప్పుడు మేమె తెలంగాణ తెచ్చినమని సభలు పెట్టి డప్పు కొట్టుకుంటున్నరు.
కిరణ్కుమార్ రెడ్డి అయితే రచ్చబండ పేరుతో లేనిపోని అబద్ధాలు చెప్పుకుంట
అన్ని జిల్ల్లాలుకు తిరుగుతున్నడు. తెలంగాణలో రానిస్తలేరు కాబట్టి ఆంధ్రకెళ్లి
విషం కక్కుతున్నడు."
"అసలు కిరణ్కుమార్ కాంగ్రేసు నాటకములో పావేమో? లేక పోతే పోతే సీమాంధ్ర
కన్న తెలంగాణకే చాలా నష్టమని కొత్త ప్రచారము స్టార్ట్ చేసిండు. ఇది సమైక్యమని
అనేవాళ్లకు కాస్త ఓదార్పుగ పనిచేస్తుందేమో."
"ఈ రాజకీయ నాటకాలేమో కాని అంతా ప్రజల ఉసురు పోసుకుంటున్నరు. 60 ఏండ్ల
బట్టి పోరాడుతుంటే, ఇప్పటి వరకు 1500 మంది ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ
సాధించుకుంటె, ఇంకా ఓట్లకోసం సీట్లకోసం అన్ని పార్టీలు ప్రతిరోజు ఏదో ఒక పరెషాన్
చేసె మాటలంటు ప్రజలను టెన్షన్లో పెడుతున్నరు. ఈ ఏడాది ఈ కథ ముగిసి కొత్త
ఏడాదన్న ప్రశాంతంగ గడవాలె."
"కేంద్రము తెలంగాన ఏర్పాటుకు చక చక ముందుకు పోతున్నట్టె
వుంది కదా".
"అవును. తెలంగాణ వచ్చుడు ఖాయములే."
"మరి గీ బాబులు ఇంకా ఏందో యాత్రలు చేస్తరంట?"
"చేస్తరు, చేస్తరు. మరి అధికారమెటు లేదు. ప్రజల మధ్య
వుంటానికి, టీవిలల్ల కనబడ్డానికి ఏదో చెయ్యాల గద."
"ఏం చేసుడో, ఏందో. పచ్చ జెండాయనకు ఆత్మగౌరవం తక్కు
వైందట. ఆత్మగౌరవ యాత్ర చేస్తడంట. మాటకు కట్టుబడనోళ్లకు
గౌరవముంటదా? మాటలు మారుస్తు, వెన్నుపోటు పోడిచేటోడిని
ఎవరు గౌరవిస్తరు? ఎవరి గౌరవాన్ని పెంచుతడు? జగనన్నకేమో
ఓదార్పు కావలంట. ఈ ఓదార్పు ఎవరి కోసము, ఎందుకొసమో
నాకైతె సమజైతలేదు."
"జైల్లొ వుండి వచ్చిండు కదా. ఆయన ప్రజల్ను ఓదార్చుడు కాదు.
ప్రజలు ఆయన్ను ఓదార్చాలె."
"కరక్టే. తండ్రి పోయి నాలుగేండ్లాయె. వారసత్వంగా ముఖ్యమంత్రి
పీఠం మీద కూర్చోవల్సింది పోయి జైల్లో యాడాది కంటె ఎక్కువ
వుండాల్సి వచ్చే. ఇప్పుడేమో తెలంగాణలో పార్టీ అడ్రెస్ లేకుండా
పోయె. పాపం. జగనుకేన్ని కష్టాలో. నిజంగానే ఆయనకు ఓదార్పు
అవసరము. జనాలంత ఇడుపులపాయకో, తామరకొలనుకో పోయి
కొన్నాళ్ళుండి జగనన్నను, ఆయన కుటుంబాన్ని ఓదారుస్తె బాగుంటది."
"షర్మిలమ్మను ఓదార్చలన్న విషయాన్ని ఎట్లా మర్చిపోయవని నేను
అడగదల్చుకున్నా."
"అవునవును. ఆ బాణం ఇప్పుడె అమ్ముల పొదిలో వుందో తెలుసికొని
ఓదార్చాల్సిందె. ఆ బాణం అరిగి పోయిందా, విరిగిపోయిందా ఏ మూలుందో
ఎవరికి తెలుస్తలేదు. అసలు సిసలు ఓదార్పు ఆమెకె కావాలె."
"ఇవాళ్టితో జీవోఎమ్తో పార్టీల, మంత్రుల భేటి ఆఖరైంది కాబట్టి, ఇక కాంగ్రేసోళ్ళు
కూడ జోరుగా జైత్ర యాత్రలు చేపడ్తరు కావచ్చు."
"నిజంగా వాళ్లకు కొంచెం కూడ ‘ఇది’ లేదు. పిల్లలు ఉద్యమాలు చేసి ప్రాణాలు
పోగొట్టుకుంటుంటే, ఆస్పటల్లో, జైల్లో పడితె ఒక్కనాడన్న పట్టించుకున్నరా?
ఇప్పుడు మేమె తెలంగాణ తెచ్చినమని సభలు పెట్టి డప్పు కొట్టుకుంటున్నరు.
కిరణ్కుమార్ రెడ్డి అయితే రచ్చబండ పేరుతో లేనిపోని అబద్ధాలు చెప్పుకుంట
అన్ని జిల్ల్లాలుకు తిరుగుతున్నడు. తెలంగాణలో రానిస్తలేరు కాబట్టి ఆంధ్రకెళ్లి
విషం కక్కుతున్నడు."
"అసలు కిరణ్కుమార్ కాంగ్రేసు నాటకములో పావేమో? లేక పోతే పోతే సీమాంధ్ర
కన్న తెలంగాణకే చాలా నష్టమని కొత్త ప్రచారము స్టార్ట్ చేసిండు. ఇది సమైక్యమని
అనేవాళ్లకు కాస్త ఓదార్పుగ పనిచేస్తుందేమో."
"ఈ రాజకీయ నాటకాలేమో కాని అంతా ప్రజల ఉసురు పోసుకుంటున్నరు. 60 ఏండ్ల
బట్టి పోరాడుతుంటే, ఇప్పటి వరకు 1500 మంది ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ
సాధించుకుంటె, ఇంకా ఓట్లకోసం సీట్లకోసం అన్ని పార్టీలు ప్రతిరోజు ఏదో ఒక పరెషాన్
చేసె మాటలంటు ప్రజలను టెన్షన్లో పెడుతున్నరు. ఈ ఏడాది ఈ కథ ముగిసి కొత్త
ఏడాదన్న ప్రశాంతంగ గడవాలె."
No comments:
Post a Comment