Thursday, November 14, 2013

News - Views

చంద్రబాబు - ధృతరాష్ట్ర ప్రేమ
చివరాఖరకు చంద్రబాబు జీవొఎం ముందుకు తాను
వెళ్లలేదు.  పార్టీ నుండి కూడ ఎవరిని పంపలేదు.  అసలు
ఆయన ఆలోచన పద్ధతేంటో ఎవరికి సమజైత లేదనుకుంటా.
విభజన తప్పదని తెలిసి కూడ సమన్యాయమేంటో చెప్పలేక
పోవడము తొమ్మిదేళ్లు ఆం.ప్ర. ముఖ్యమంత్రిగా పని చేసిన బాబు
అఙ్ఞానాన్ని అవకాశవాదాన్ని, వెన్నుపోటు గుణాన్ని బైటపెడుతుంది.
వైకాపా సమైక్యవాదాన్నైన వినిపించి, మేము విభజన ఆపడానికి
అన్ని ప్రయత్నాలు చేసినట్టు ప్రజలకు చెప్పుకోవచ్చు.  విభజన
అనుకూలంగ లేఖ ఇచ్చి వెనిక్కి తీసుకోని బాబు రేపు ప్రజలకు
ఏం చెప్పుకుంటాడు?  వేయికి మించి ఆత్మహత్యలకు కారణమై
బాబును తెలంగాణ ప్రజలు ఎలాగు క్షమించరు.  విభజన తరువాత
తమకు కావలసిందేమిటో చెప్పని బాబును ఆంధ్రప్రజలు మన్నిస్తారని
అనుకోను.  ఎన్డియే హయాములో కేంద్రాన్ని తెలంగాణ ఇవ్వకుండ
శాసించిన చంద్రబాబుకు యుపియె ప్రభుత్వము ముందు తన ప్రజల
అవసరాలను ముందుపెట్టడానికి అహంకారము అడ్డమొచ్చిందను
కుంట.  అన్ని పార్టీలు కేంద్రానికి తమ అభిప్రాయాలు తెలిపినప్పుడు
చంద్రబాబు తెల్పక పోవడము అతని ఆంధ్ర అభిజాత్యానికి, అహం
కారానికి పరాకాష్ట.
చంద్రబాబు అదివరకు రెండు కళ్ల సిద్ధాంతము గురించి మాట్లాడిండు.
కళ్లు రెండైనా చూపు ఒకటె కద, మెల్ల కన్నుంటె తప్ప.  సరె, పోని.
చూపు సీమాంధ్రా వైపనుకున్నా తీర విభజన సమయములో ఆంధ్రోళ్లకు
ఏం న్యాయం కావాలో చెప్పలేదు.  అంటె ప్రస్తుతానికి అతనికి రెండు కళ్లలో
పూవు (cataract) వచ్చిందా లేక షుగరుంది కాబట్టి నరాలు దెబ్బ
తిన్నాయా? అందుకే సీమాంధ్ర భవిషత్తుకు ఎలాంటి vision ముందు
పెట్టలేక పోయిండు.
 రెండు కళ్ల తరువాత సమన్యాయము పాటెత్తుకున్నడు.
అసలుకైతె ఈ పదాన్ని ముందు ముందుకు పట్టుకొచ్చింది శ్రీమతి
విజయలక్షమ్మమ్మగారు.  దాన్ని కాస్త చంద్రబాబుతో సహా అందరు
అంది పుచ్చుకున్నరు.  సమన్యాయం జరగట్లేదనే తెలంగాణ వాదము,
పోరాటము ముందుకొచ్చింది.  రాజకీయ ఉద్యమ పార్టీగా తెరాస
అహింసాయుతంగా, రాజ్యాంగబద్ధంగా పోరాటము చేస్తు, ప్రజాస్వామ్య
బద్ధంగా ఓట్లు, సీట్లు సాధించుకొని శాసించి తెలంగాణ తెచ్చుకుంది.
ఓట్లు సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారనే వాళ్లు - రాజకీయ పార్టీలు,
తెరాసతో పొత్తు పెట్టుకున్నది, తెలంగాణకు అనుకూలంగ లేఖ ఇచ్చింది,
తెలంగాణకు అనుకూలమని తరువాత సమైక్య రాగమందుకున్నది
ఓట్లు, సీట్ల కోసం కాదా?  తెలంగాణకు అనుకూలం కాని రాజకీయ
పార్టీ తెలంగణలో అడ్రసు లేకుండా పోతుందని తెలిసే కదా అన్ని పార్టీలు,
ఒక CPM మినహా ఎప్పుడో అప్పుడు తెలంగాణ ఏర్పాటుకు మేము
అడ్డము కాదు, నిలువు కాదని అన్నయి.  CPM కూడ ఆఖరకు మేము
అడ్డుపడతె మాత్రము మీరు ఇవ్వడము ఆపుతారా? మీ ఇష్టం.  ఏం చేస్తారో
చేయండి అని చెప్పింది.  ఈ రెండు కళ్ల బాబుకే స్పష్టత లేదు.  తెలంగాణకు
వ్యతిరేకము కాదంటడు.  సమన్యాయమంటడు.  ఏ విధంగా సమన్యాయము
చేయాలో చెప్పడు.  తెలుగుజాతి ముక్కలు చేస్తున్నరని, జాతిని ఒక్కటిగా
వుండాలని అంటడు.  అంటే, రాష్ట్రాన్ని విభజించవద్దని చెప్పొచ్చు కదా.  అట్లా
చెప్పడు.  అసలు చంద్రబాబు ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నడు?
తనను తనే మోసగించుకోవటముతో సాధించేదేమిటో?
ఈ మధ్య ఇద్దరు కొడుకుల సిద్ధాంతాన్ని పట్టుకొచ్చిండు. ఇక్కడ కూడ gender
bias. ఇద్దరు పిల్లలనొచ్చు కదా?  సరె పోని.  ఒక్కరె సంతానము వున్నప్పుడు
choice వుండదు.  ఒక్కరికంటె ఎక్కువ పిల్లలున్నప్పడు అందరిని ప్రేమగా
చూసినా ఎవరో ఒకరిపట్ల కాస్త పక్షపాతము వుండొచ్చని, దానికి కారణాలు
వుండొచ్చని పురాణ కాలం నుండి కూడ దృష్టాంతాలు వున్నాయి.  ఈ మధ్య
కాలములో అమెరికాలో ఓ యూనివర్సిటి వాళ్లు పరిశో్ధించి మరీ చెప్పారు
తల్లిదండ్ర్ల్లు పిల్లలందరిని ప్రేమించినా వాళ్లకు ఒక్కొక్కరి పట్ల ప్రత్యేక అభిమాన
ముండొచ్చని.  దానికి వారికి కారణాలు కూడ వుంటాయి.  నేను చిన్నప్పుడు
రామాయణము చదివినప్పుడు ఒక కథ నాకు బాగ గుర్తుండి పోయింది.
విశ్వామిత్రుడు ఒకసారి యాగము చేయటానికి యఙ్ఞ పశువుగా కట్టడానికి
మనిషి కావల్సి వచ్చింది.  అప్పుడతను తన చెల్లెలు దగ్గరకు వెళ్తాడు.  ఆమెకు
ముగ్గురు కొడుకులు.  చెల్లెలుకు తను వచ్చిన పని చెపుతాడు.  అప్పుడు విశ్వా
మిత్రుని బావ అంటాడు, నేను మాత్రము నా పెద్ద కొడుకును పంపనని, చెల్లెలు
అంటుంది తను చిన్న కొడుకును విడిచి అసలే వుండలేనని.  అప్పుడు నడిపి
కొడుకు మేనమాతో అంటాడు, "నా తల్లిదండ్రులు వాళ్ల కిష్టమైన వాళ్లను ఎంచుకు
న్నారు.  ఇక మిగిలింది, వాళ్లకు పట్టింపు లేనిది నేనే.  నేను మీ వెంట వస్తాను".
విశ్వామిత్రుడు అతన్ని తన వెంట తీసుకువెళ్లి, యాగము తరువాత అతనికి
ఉపదేశము చేసి, కొంత సంపద కూడ ఇచ్చి పంపిస్తాడు.
దశరథునికి నలుగురు కొడుకులున్నా శ్రీ రాముడంటె అత్యధిక ప్రేమ.
రాముడు అడవికి వెళ్తె మిగిలిన కొడుకులను చూసుకుంటు బ్రతికి
వుండాల్సింది కద.
ఇప్పటి కాలములో కూడ చూస్తాము.  పిల్లలందరి మీద ప్రేమ వుండటము
వేరు.  అందులో ఎవరో ఒకరి పట్ల ప్రత్యెక అభిమానముండటము వేరు.  ఇది
బహిరంగంగ కనిపించక పోవచ్చు.  నాకు తెలిసిన కొంతమంది వున్నారు.  వారికి
పిల్లలందరికి ఏ అవసరమొచ్చినా బాగా చూసుకుంటారు.  కాని అందులో ఒకరి
దగ్గర వుండడానికే, చివరి రోజుల్లో వుండటానికి ఇష్టపడుతారు.  దానికి వాళ్ల కారణాలు
వాళ్లకు వున్నాయి.  చంద్రబాబుకు ఒక్కడె కొడుకు వుండటంతో పక్షపాతము చూపే
అవకాశము లేదు.  చంద్రబాబు సీమాంధ్రకు చెందిన వాడిగా సీమాంధ్ర పట్ల పక్షపాత
ధోరణి వుండటము అందరు అర్థం చేసుకుంటారు.  కాకపోతె ఆ విధమైన పక్షపాతము
చూపెట్టడము విఙ్ఞతగల నాయకుడి లక్షణము కాదు.  రెండుప్రాంతాల్లో ఓట్లు, సీట్లు
కావాలనుకున్నప్పుడు విభజన సమయములో కేంద్రము మీద లేనిపోని అభాండాలు
మోపుతు బహిష్కరించేకంటే, సంపూర్ణ సహకారము అందించి, విభజన సామరస్యంగా
జరిగెట్లు చూడాలి.  అప్పుడె చంద్రబాబు రెండు ప్రాంతాలకు సమన్యాయము చేసిన
వాడవుతాడు.  లేకపోతె సమ అన్యాయము చేసినవాడవుతాడు.
ఇంతకు ముందె విన్నాను.  కొత్తగా కొబ్బరికాయ సిద్ధాంతము గురించి మాట్లాడాడట.
నేనైతె అది ఏంటొ వినలేదు.  కొబ్బరికాయ చెట్టునుండి తెంపటము కష్టమా?
కొబ్బరి చెట్టుకింద నిలబడితె కొబ్బరికాయ మీద పడితె దెబ్బ బాగానే తగులుతుంది.
తెలంగాణను అడ్డుకుంటె అదే పరిస్థితి.  కొబ్బరికాయ పీచు సరిగ్గా తీయకపోతె కొట్టడము
కష్టమే.  అందుకే పీచు తీయాలి.  విషయ అవగాహనకు శ్రీ క్రిష్ణ కమిటీ ఊరూరు తిరిగి,
చిన్నోళ్ళని, పెద్దోళ్లోను, ఆడోళ్ళను, మగోళ్ళను, పళ్ళోళ్లను, పట్టణపోళ్లను, ప్రభుత్వపోళ్లను,
పార్టీలోళ్లను అందరిని సంప్రదించి ఒక నివేదిక కూడ ఇచ్చింది.  ఈ రిపోర్టును ముందేసుకొని,
మళ్లి మళ్ళి కేంద్రమోళ్ళు అఖిల పక్షమీటింగులు పెట్టి విషయాలన్ని తేటతెల్లంగా తెలుసు
కున్నది.  ఇక విభజన బిల్లు రావటమే మిగిలింది.  అంటె కొబ్బరికాయ కొట్టడానికి
రెడీగా వుంది.  ఎవరి ముక్క వాళ్లకు రావలిసిన విధంగా వస్తుంది.  ఒక ముక్క కాస్త
చిన్నది (పది జిల్లాల తెలంగాణ) రెండోది కాస్త పెద్దది (పదమూడు జిల్లాల సీమాంధ్రా)
వస్తుంది.  సామరస్యంగా విడిపోతు, కొబ్బరి నీళ్ళలాంటి తెలుగు వారి ఔన్నత్యాన్ని
కొత్త రాష్ట్రాల అభివృద్దితో ప్రపంచానికి చాటాలి.

No comments:

Post a Comment