Monday, November 25, 2013

News - Views

ఏం టీ నాన్చుడు?
మళ్ళి  కొత్త కథ మొదలు పెట్టినరు.  రాయల తెలంగాణ
ఇస్తె ఎట్లుంటదని కేంద్రం ఆలోచిస్తుందంట.  ఇద ఎవరి
ఆలోచన, ఎందుకీ కొత్త ఆలోచన?  సీడబ్ల్యుసీ ఏదైనా
చెపితె అది శిలాశాసనమని అన్నరు.  హైదరాబాదు
రాజధానిగా పది జిల్లాల తెలంగాణ ఇవ్వాలని కదా
సీడబ్ల్యుసీ ఈ ఏడాది జులై ముప్పైన నిర్ణయించినట్టు
ప్రకటించింది.  ఇప్పుడు దాన్ని రాయల తెలంగాణాగా
మార్చుకుంటే ఆ నిర్ణయము పెన్సిల్ గీతలా, లేకపోతె
నీటి మూటలా?  ఈ అనుమానము నాకే కాదు అందరికి
వస్తుంది.  కేంద్రం తెలంగాణ విషయము మళ్లి నాన్చాలనుకుంటుందా?
ఇందులో సీమాంధ్రు నాయకుల కుట్ర్ల ఏమైవుంటుంది?
పొరపాటున రాయల తెలంగాణ అంటె ఇప్పడి వరకు తయారు
చేసిన తెలంగాణ బిల్లు మూల పెట్టి మళ్ళి కొత్తది తయారు
చేయాల్సిందే.  అంటె తెలంగాణ బిల్లు రాబోయె శీతాకాల సమా
వేశాల్లో రాకుండ అపేస్తె ఆ తరువాత యుపియె హయాంలో
తెలంగాణ రాకుండ ఆపేసినట్టే.  అంతే కాకుండ, సీడబ్ల్యుసీ తన
నిర్ణయాన్ని మార్చుకుంది కాబట్టి, అది శిలాశాసనము కానట్టె.
కాబట్టి సీడబ్ల్యుసీ ఒక నిర్ణయాన్ని వెనిక్కి తీసుకుంటె, అట్లాగె
తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని కూడ మార్చుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా
వుంచాలని సీమాంధ్ర నాయకులు అన్ని శక్తియుక్తులతో తీవ్ర ప్రయత్నం
చేస్తరు.  సో, తెలంగాణ కాంగ్రేసు నాయకులెవ్వరు రాయల తెలంగాణకు
పొరపాటున కూడ ఆవగింజలో వెయ్యోవంతు కూడ సానుకులత చూపొద్దు.
రాయల తెలంగాణ వద్దే వద్దు.  హైదరాబాదు రాజధానిగా పది జిల్ల్లాల
తెలంగాణే ముద్దు. 

No comments:

Post a Comment