Saturday, June 29, 2013

The eternal dilemma - Give or Not to Give

తెలంగాణ వచ్చేస్తుందా!?!????!!!!!
వస్తుంది, వస్తుంది, వచ్చేస్తుందని అంటున్నారు.  ఇట్లా వినబట్టి
పదేళ్ళు కా‌వస్తుంది.  రోజుల గడువు పెట్టారు.  వారాలన్నారు,
పండగలన్నారు, ఓ పండగ కాకపోతే మరో పండగకు గడువు
పెంచారు, ప్రతి పండగ మళ్ళీ యేడు తెలంగాణలోనే నన్నారు,
జనవరి ఫస్టన్నారు, పార్లమెంట్ సమావేశాలు - శీతాకాలము
కాకపోతే ఎండని, వానని అన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల
కాని అన్నారు, ఉద్యమముంటె చల్లబడాలన్నారు, నెలంటె
నెలకాదన్నారు, చర్చలు, చర్చోపచర్చలన్నారు, రాష్ట్రమివ్వట
మంటే ఇన్‍స్టంట్ కాఫి కాదు, అట్టు పోసినట్టు కాదు, బీడి
ఇచ్చినట్టు కాదు, ఇడ్లి తిన్నట్టు కాదు, యాభై ఏళ్ల సమస్య
అంత తేలికది కాదన్నారు.  పార్టీల్లో ఏకాభిప్రాయం కావాలన్నారు.
అధిష్టానల ఇష్టమన్నారు, ప్రజలే మా అధిష్టానమన్నారు. రాజీ
నామాల డ్రామాలాడారు.  రాజీనామాలు చేసి గెలిచినా సెంటిమెంట్
అని పక్కన పెట్టారు.  పూటాకో మాట, రోజుకో దాటవేత, నెలకో
లీకులతో ఆశ నిరాశల మధ్య ఎన్ని యువ ప్రాణాలు గాలిలో కలి
శాయో! రాజకీయ నాయకులు పరస్పర విరుద్ధ స్టేట్‍మేంటులిస్తు
ఉద్వేగాల వేడిలో రాజకీయ పునాదులను పటిష్టము చేసుకుంటు
పదవుల పొందుతు, ఆస్తులు పెంచుకున్నారు.
ఇప్పుడిక రాష్ట్రములో అన్నిస్థాయిల్లో ఎన్నికలు దగ్గరపడ్డాయి.
మరి ఓట్లు దండుకోవాలి కదా!  సో, కొత్త ప్రణాళికలు మొదలైనట్టున్నాయి.
చర్చలన్ని అయిపోయినాయట!  తెలంగాణ ప్రకటించటమే తరువా
యంటున్నారు.  ఇప్పుడు మాట తప్పితే కాంగ్రేసుకు ఓట్లగతులుండవు.
తెలంగాణ ప్రజల దృష్టిలో ఎప్పటికి దిగజారి పోతుంది.  పాతాళానికి
జారుతుంది.  భవిష్యత్తులో కోలుకునే ప్రశ్నె వుండదు.  ఇప్పుడు
ఆ పార్టీ నాయకులు చేస్తున్న ఆర్భాటమంత పేలని లక్ష్మి ఆటంబాంబులా
తుస్సు మంటుందా లేక ఖచ్చితమైన నిర్ణయముంటుందా కాలమే
చెప్పాలి.  ఇది తెలంగాణలో కాంగ్రేసు 'make or break' stage.
Nobody is excited.  Though hoping best to happen,
Telangaanites have just kept there fingers crossed.

జై తెలంగాణ, జై జయహో తెలంగాణా !

Sunday, June 23, 2013

Nature's Fury

చార్ ధామ్




గంగమ్మ కట్లు తెంచుకుంది
గట్లు తెంచుకుంది
ఉరకలే వేసింది,
ఉగ్రరూపం దాల్చింది.

ఎన్ని బాధలు ఓర్చుకుందో
ఎన్ని కన్నీళ్ళు దాచుకుందో
ఓపలేక పరుగులే తీసింది
పవరేంటో చూపింది.

పంచభూతాలేకమైన జీవాత్మా
ప్రకృతై విలసిల్లు పరమాత్మ
మానవుని పెత్తనానికి
ప్రళయమే సమాధానమాయె.

పాపమెవరిదైతెనేమి
జాతికి శాపమాయె
చార్ ధామ్ దర్శించబోయి
శివధామములో చేరిపోయె.


Image source: google images

Thursday, June 13, 2013

Telangaana spirit

చలో అసెంబ్లీ
‘చలో అసెంబ్లీ’ రేపే.  ఆంధ్ర ప్రభుత్వము చేపడుతున్న కార్య
క్రమాలు చూస్తుంటే ‘చలో అసెంబ్లీ’ అల్రెడి సక్సెస్ అయిందనే అనాలి.
గడపగడపకు ఆంక్షలు, వాడవాడల నిర్బంధాలు, ఊరూరుకీ
చెక్ పోస్టులు, సైకిలు మీద పోయెవాడినుండి, రైళ్ళలో ఎక్కిదిగే
వాళ్ళందరిని ఆరాలు తీసుడు, ద్విచక్ర, త్రిచక్ర చతుష్‍చక్ర వాహనా
లన్ని సోదాలు, నాయకుల బైండొవర్లు, గృహ నిర్బంధాలు,
కార్యకర్తల అరెస్టులు, సామాన్య ప్రజలకు హెచ్చరింపులు,
ఉద్యోగులు, విధ్యార్థులకు బెదిరింపులు, నిర్బంధాలు - ఎమర్జెన్సి
తలంపించె పరిస్థితులు.  ఇంత నిరంకుశంగా ప్రభుత్వము వ్యవహ
రిస్తున్నా ఉద్యమకారుల్లో ఎంతో మంది ధైర్యసాహాసలు, నిబద్ధత
వున్నవాళ్ళు అన్నింటికి తెగించి, చలో అసెంబ్లీలో పాల్గోంటారు.
ఒక్క ఉద్యమకారుడు వచ్చాడంటే వెయ్యి మంది వచ్చినట్లె. 
చలో అసెంబ్లలో భాగస్వాములు కావలని వున్నా, పోలీసుల
భయానికి రాలేని వాళ్ళకు మనస్సులో ఎంతో బాధ వుంటుంది.
ఆంధ్ర ప్రభుత్వము పట్ల వున్న వ్యతిరేకత పదింతలై తెలంగాణ
పార్టీని తప్పనిసరిగ గెలుపించుకోవాలనే పట్టుదల మరింత బల
పడుతుంది. 
ఈ ఆంధ్ర ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలవల్ల ఆ ప్రభుత్వము
పట్ల తెలంగాణ ప్రజలకు మరింత వ్యతిరేకత పెరుగుతుంది,
తెలంగాణ సాధించుకోవాలనె భావన మరింత బలపడుతుంది.
రవాణా సౌకర్యాలు బంద్ చేసి, కర్ఫూ విధించి, చలో అసెంబ్లీకి
ఎవరు రాలేదని మురిసిపోవటము పిల్లి కళ్ళు మూసుకొని పాలు
తాగటమే.  అణిచివేత తీవ్రత ఎంత ఎక్కువ వుంటె దానికి పదింతలు
ఉద్యమ స్ఫూర్తి పెరుగుతుంది.
తెలంగాణ ప్రజలు తెలంగాణ పార్టీని గెలిపించుకొని తమ అస్తిత్వాన్ని
చాటుకునే రోజులు దగ్గరలోనే వున్నాయి.
జై తెలంగాణ, జయహో తెలంగాణ!

Sunday, June 9, 2013

Babble

ఆ జాదు మాటలు

ఆజాదు మాటలకు అర్థాలే వేరులే
నెలంటె ఎన్ని రోజులో చెప్పలేములే
వారమంటె ఏడు రోజులు మాత్రమే కాదులె
జూనంటె ఏ ఏడు జూనో తెలుసుకోవాలిలె
చర్చలంటె బెరసారలని అర్థము చేసుకొవలెలే
బంగారు గుడ్డు పెట్టే బాతును చంపె
తెలివితక్కువ వాడు ఇప్పుడెవ్వడున్నాడులే!

           *********
పేక పట్టుకున్నంత మాత్రాన
పేకాడినట్టు కాదులే
మాజిక్కులో
ఓ ట్రిక్కు నేర్చుకునేందుకులే

తాటి చెట్టుకిందా కూచున్నా
ముంతలో తెల్లని ద్రవమున్నా
అది కల్లు కాదులే
పాపాయి తాగే పాలైనా కావచ్చులే

సాని కొంపకెళ్ళినా
సరసాలకు కాదులే
సత్సంగము అక్కడైన
కుదురుతుందని ఆశలే.

Telangaana Fights

ఎన్నికలలు

మండె ఎండలు ఇప్పుడిప్పుడె తగ్గు ఓ దిక్కు తగ్గు ముఖం
 పడుతుంటె ఎన్నికల వేడి మెల్లమెల్లగా ఎక్కువైతుంది.
 ఆంధ్రప్రదేశ్‍లో పార్లమెంటు,అసెంబ్లి ఎన్నికలకు ఎక్కువలో
 ఎక్కువగ ఒక యేడాది వుంటె, తక్కువలోతక్కువగా అర్నెల్లు
 వుంటుంది.  ఈ మధ్యలో బలాబలాలు తెలుసు(తేల్చు)
కోవడానికి పంచాయతి, స్థానిక సమరము షురు కానున్నది.  పార్టిలన్ని
ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాలకి సిద్ధమౌతున్నాయి.
ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్ల్లో, తెలంగాణ రాష్ట్రము
 అతి ముఖ్యఎన్నికల అంశము కానున్నది.
తెరాస, తెలంగాణ రాష్ట్ర ఎర్పాటే ఎకైక లక్ష్యంగా ఉద్యమము/పని చేస్తున్న
 పార్టిగాతెలంగాణ ప్రజల గుర్తింపు పొందిన తెలంగాణ పార్టి.
 ఈ పార్టి తెలంగాణ ప్రజాసమస్యల  గురించి ఎక్కువగా ఉద్యమించక
 పోయినా, తెలంగాణ వనరుల గురించి, హక్కుల గురించి
అసెంబ్లిలో మాట్లాడె  ఎకైక పార్టి.  తెలంగాణా ప్రజలకు కెసిఆర్, తెరాస
 పట్ల ఎంతఅసంతృప్తి ఉన్నా, తెలంగాణా ఏర్పాటుకు దానిని నమ్మక
 తప్పట్లేదు.  సమస్య సాధనకు యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి
ఎదగటము తప్పనిసరె.  అందుకని అయిష్టంగానైన ఎన్నికల్లో తెరాసకు
 ఇతర పార్టీల కంటె ఎక్కువ శాతం ఓట్లు వస్తాయి.  కాని నిలబడ్డ
అభ్యర్థిని బట్టి గెలవటము వుంటుంది.  ఇది ఎమ్మెల్సి ఎన్నికల్లో
 అనుభవమైన విషయమే.ఇక బిజెపి, కాంగ్రెస్ - దొందొ దొందె.
 ఆ రెండిటి ధ్యేయం కేంద్రములో అధికారాన్ని కైవసముచేసుకోవటమే.
  ఆ రెండు పార్టిల స్టాండ్ వాటికున్న మెజారటి బట్టి వుంటుంది.
ప్రస్తుత పరిస్థితిలోఏ ఒక్క పార్టికి ప్రభుత్వాన్ని ఒంటరిగ ఏర్పర్చ
గలిగినంత మెజార్టి రావటము సాధ్యపడని కలే.ఇప్పుడు యుపియె
 ఉన్న స్థితి మళ్ళి యుపియె వచ్చినా ఎన్డెయె వచ్చినా వుంటె కథ మళ్లి
మొదటికి వస్తుంది.  ఈ పరిస్థితిలో తెరాసకు అత్యధిక ఎమ్మ్లెలె, ఎమ్పి
 సీట్లు వుంటె, కింగ్మేకర్‍గా కెసిఆర్, టి.అర్.ఎస్‍కు బేరసారాలకు అవకాశము
 వుంటుంది.  ముల్లెల సంగతి పక్కనపెడితె, తెలంగాణ అంశము తేల్చేటట్లు
 (రాష్ట్ర ఏర్పాటుకు) కట్టుబడి వుంటే, కెసెఆర్ స్థానంతెలంగాణ ప్రజల గుండెల్లో
 ఓ ప్రజా నాయకుడుగా, తెలంగాణ సాధకుడిగా స్థిరపడుతుంది.
కేవలం ముల్లెలు మూటకట్టుకోవటములో తెలంగాణా సాధన పక్కన పెడితే
 ప్రజలు అతను మరో చెన్నారెడ్డిగా గుర్తుపెట్టుకొని రాజకీయ జీవితానికి,
 తెరాసకు సమాధి కడతారు.కమ్యూనిస్ట్ పార్టిల గురించి ప్రస్తుతము
 ఎవరు పట్టించుకోరనె అనిపిస్తుంది.  తెలుగుదేశంపార్టి - చంద్రబాబు,
 తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిపోయింది.  తాను గెలిస్తె ముఖ్యమంత్రిగా
తాను మొదట చేసె పని అసెంబ్లిలో తెలంగాణ బిల్లు పెడ్తానని స్వయంగా
 చెప్పినా బాబును ఎవరునమ్మరు.  ఎన్టిఆర్ పెట్టిన పథకాల పేరు చెప్పి
అధికారములోకి వచ్చి, ఆ పథకాల పేరుతో పన్నులు కూడా పెంచి,
 ఆ తరువాత కూ‌‍ల్‍గా అన్ని పథకాలకు తిలోదకాలు ఇచ్చాడు.
తెలంగాణ విషయములో కూడా పూటకో మాట మార్చేవాడిని ప్రజలు
 ఎట్లా నమ్ముతారు?  చివరాఖరకు తెలంగాణ వాదము వినిపించాలన్నా,
 తెలంగాణ సాధనలో ఓ అడుగు ముందుకు పడాలన్న తెరాసను
 గెలిపించాల్సిన అవసరము, బాధ్యత తెలంగాణ ప్రజల పైన వుంది.

                      *************************************

కెసిఆర్‍కు ఉద్యమము పట్ల నిబద్ధత లేదు, కేవలము రాజకీయ లాభం,
 కుటుంబ స్వార్థం కోసమేప్ర్జజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని, లేని
ఉద్యమము పేరుతో వసూళ్ళకు పాలుపడుతున్నాడని
ఇతర రాజకీయ పార్టిలు, కొన్ని ప్ర్జజా సంఘాలు కెసిఆర్‍ను విమర్శిస్తున్నాయి.
 కాని తెలంగాణకు సంబంధించిన ఆయా పార్టినేతలు, ప్రజాసంఘాల నేతలు
 ఎప్పుడైన తెలంగాణ కోసం స్వంతంగా ఉద్యమము చేసాయా?  కెసిఆర్/తెరాస
 ఉద్యమము చేస్తుంటె మమ్మల్ని కలుపుకోవట్లేదని అంటాయి.
వాళ్ళకై వాళ్ళు స్వంత ఉద్యమ కార్యాచరణ చేసి విజయవంతము
ఎందుకు చేయలేక పోతున్నరు?  ఒక ఆశయముతో పార్టి పెట్టి, దానిని
 నడిపిస్తు, తన వ్యూహా శక్తితో ముందుకు తీసుకొని వెళ్ళుతున్న
వ్యక్తి తనకు నచ్చిన వాళ్ళనే కలుపుకుంటాడు కద!  అతని పంథా నచ్చి
 అతనివల్ల  వాళ్ళకు లబ్ధి చేకూరుతుందని ఆశ పడె వాళ్ళు అతనితో
 కల్సి నడుస్తారు.  నచ్చని వాళ్ళు, వాళ్ళ అనుకున్న ఫలితము రాకపోతె
 బైటకు వచ్చెస్తారు.  అన్ని పార్టీల్లో జరిగేది అదె కాదా?  అన్ని పార్టీలు
 కూడా ఖుల్లంఖుల్ల్లాగా ఎమ్మెల్యె సీటుకు ఎంత కావాలో, ఎమ్పికి ఎంత
 డబ్బు కావాలో ముందే చెప్పట్లేదా?డబ్బువున్నవాళ్ళకు, పారిశ్రామిక
 ధనసామ్యవాదులకు రాజ్యసభ సీట్లు కట్టబెట్టడము,  పార్టి నడిపించా
లంటే డబ్బు కావాలి కాబట్టి ఇది తప్పదని ఒక పార్టి అధినేత స్పష్టంగా
 చెప్పాడు.  ఆ పార్టీలకు అవసరమైనట్టు తెరాసాకు కూడ అవసరమె కదా.
 మళ్ళి మాట్లాడితే తెరాసకు డబ్బు అవసరము
ఎక్కువె.  ఎందుకంటె, ఉద్యమము చేయడానికి, పార్టి శ్రేణులను
 కదిలించటానికి, ఉద్యమములో అరెస్ట్ అయితె విడిపించటానికి
 డబ్బు చాలానె కావాలి.
 ఏ రాజకీయ పార్టి అయినా ఎన్నికల్లో
నిలుచున్నపుడు గెలవాలని, అధికారంలోకి రావాలనె కోరుకుంటుంది.
ఇందుకు తెరాస మినహాయింపు కాదు.  దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టిలు,
 మతమె పునాదిగ, ఒక వర్గానికుప్రతినిధిగా పార్ట్టీలు వున్నాయి.
 తెలంగాణా ప్రజలకు ఒకటి వుంటె తప్పేంటి?  ఏ పార్టీలో వున్నా పేదలు
బడుగలు జెండా మోసుడె.  ఆ స్థితి పోవాలంటె మరో ఉద్యమము తప్పదు.
  అంబేద్కర్, పూలే, కాన్షిరాంలాంటి నేతలు మళ్ళి రావలసిందె.
తెలంగాణ ఉద్యమములో బడుగుల రాజ్యధాకారము ఒక కోణమైన,
 అది విభిన్నమైనది. దానికి తెలంగాణలోనె కాదు, దేశ వ్యాప్తతంగా
 ఉద్యమించాల్సి వుంది.  అది ప్రస్తుతము నిశబ్దంగా వుంది.
  ఊపందుకునే సమయము దగ్గరలోనె వుంటుందని భావిస్తున్నాను.
తెలంగాణకు స్వంత రాజకీయ అస్తిత్వము, తెలంగాణలో ప్రజాస్వామిక
 హక్కుల పరిరక్షణకు కట్టుబడి వుండె స్వతంత్ర రాజకీయనాయకుల
 అవసరము ఎంతో వుంది.  అది తెలంగాణ ప్రాంతీయ పార్టీ వల్లనే
సాధ్యపడుతుంది.  జాతీయ పార్టీల అవసరాలు ప్రాంత ప్రజల అవసరలకు,
 ప్రజాస్వామ్యబద్ధమైన విలువలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నప్పుడు, ప్రాంతం
 కోసమ్ ప్రాంతీయ పార్టీలు ముందు నిలిచి ప్రజాభిష్టాలకు అనుగుణంగా
 నడవాల్సి వస్తుంది.  ప్రస్తుతము తెలంగాణలో తెలంగాణ కోసం
తెలంగాణ కొరకు పనిచేస్తున్నపార్టీ తెలంగాణా రాష్ట్ర సమితి.
 అన్ని ఎన్నికల్లో ఈ పార్టీని గెలిపించి తెలంగాణ అస్తిత్వము చాటుకోవలసిన
 అవసరము తెలంగాణ ప్రజలకు వుంది.
 ఇది ‘ఇజ్జత్ కా సవాల్’.

                           **************************************************



రాజకీయనాయకుళ్ళలో అధికార కాంక్ష ఎక్కువె.  అసలు రాజకీయల్లోకి
 వచ్చేది అందుకు.  ఒకప్పుడు ప్రతి పార్టికి కొన్ని ప్రాథమిక నియమ
నిబంధనలు,  రాజ్యముకు సంబంధించిన వివిధ విషయాల గురించి
స్పష్టమైన విధానాలు వుండి దానికి కట్టుబడి సభ్యులందరు ప్రవర్తించెవారు.
  ఇప్పుడు అన్ని పార్టీల విధానము అధికారానికి రావటమే.  ఎన్నికల్లో
గెలవటము ప్రధానము.  అధికారాన్ని చేజిక్కించుకోవటమే ఆశయము.
అందుకోసం గుండాలకు, రౌడి షీటర్లకు, ఒట్లు కొనగలిగిన ధనవంతులకు,
 ఇతర పార్టిలనుండి బహిష్కృతులై వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారు.
  ఆయా వ్యక్తుల వ్యక్తత్వానికి, వ్యక్తిగత చరిత్రకి ఎలాంటి ప్ర్రాధాన్యము
 వుండట్లేదు.  పార్టీలన్ని కూడ ఇప్పుడు వ్యక్త్లులవి.  మళ్ళి మాట్లాడితె
 ఒక వర్గానికి చెందినవిగా ఉంటున్నాయి.  భాజపాను, కమ్యూనిస్ట్ పార్టిలను
 పక్కన పెడితె ఇప్పుడు దేశములో వున్న పార్టీలన్ని, నాకు తెలిసినంత
 వరకు, ఒక వ్యక్తికి లేదా కుటుంబానికి చెంది, ఆ వ్యక్తి లేదా కుటుంబ
అజమాయిషిలో నడుస్తున్నవె.  గొప్పగా చెప్పుకునె నేటి కాంగ్రేసు
ముఫ్ఫై ఏళ్ళ క్రితం అసలు కాంగ్రేసు నుండి చీలి ఇందిర కాంగ్రెసుగా ఏర్పడిందె.
  ఇప్పుడున్నది ఇందిరా గాంధి కుటుంబ కాంగ్రేసె కాని అసలు సిసలు
జాతీయ కాంగ్రె సు కాదు.  దానిపై ఆ కుటుంబ పెత్తనము ఎలాగు వుంటుంది.
  మన రాష్ట్రములో వున్న పార్టీలు, దేశములో ఇతర రాష్టాల్లో వున్న
 పార్టీలన్ని కూడా వ్యక్తులకు, కుటుంబాలకు చెందినవనికాస్తా ఆలోచిస్తె
అందరికి అర్థమౌతుంది.  ఆయా పార్టీల్లో చేరిన వాళ్ళు ఆ వ్యక్తులకు,
 కుటుంబాలకు అనుకూలంగా పనిచేయల్సిందే.  లేదంటే బైటకు
 వచ్చేయాలి.  ధనము, దమ్ము వుంటె కొత్త పార్టి పెట్టి నడిపించాలి.
 బడుగులెవ్వరు పార్టి పెట్టి నిలదొక్కుకోలేక పోవటము విచారకరము.
  దీనికి కారణాలేంటో వారు విశ్లేషించుకొని ముందడగు వేయాలి.

                                ********************************************


ఈ మధ్యే కొంతమంది జాతీయ పార్టీ గా గుర్తింపు వున్న కాంగ్రెసు నుండి
 ప్రాంతీయ పార్టి అయిన తెరాసలో చేరారు.తెలంగాణా మీద ప్రేమతో
 కాదు, వారి రాజకీయ భవిష్యత్తు కోసమేనని ప్రజలకు తెలుసు.
 అందులోను ఒకరిద్దరు ‘తెలంగాణా తొలి ముఖ్యమంత్రి’ (అది
ఎన్నాళ్ళుంటుందో) పదవి కోసమే చేరారన్నది బహిరంగ రహస్యము.
 (ఇంతకుతెలంగాణా వచ్చుడు ఖాయమా?).  వాళ్ళలో ఒకరు చురుకుగ
తెరాస శిక్షణ శిబిరాల్లో పాల్గొంటున్నారు.  కెసిఆర్‍ను మించి మాట్లాడాలనే
 అత్యుత్సాహామేమో!  తెలంగాణా ఇస్తె మెడ కోసుకుంటాడట!
 నాయకులు ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడటము మానెయ్యాలి.
  వాళ్లు ఏదో గొప్పగా మాట్లాడుతున్నామని దాని ప్రభావము మానసిక
 పరిపక్వత లేని వారి మీద ఎలా వుంటుందో ఆలోచించకుండా
మాట్లాడుతారు.  చివరకు వారిని నమ్మిన అమాయక యువకులు
 ప్రాణాలు తీసుకుంటారు.  ఇప్పటికె తెలంగాణా ఎంతోమంది అమాయక
 యువకులను కోల్పోయింది.  ఇక దీనికి ఫుల్ స్టాప్  పెట్టలి.
 నాయకులెవ్వరు, ఎట్టి సందర్భములో కూడా ‘తలకాయ తీసుకుంటా,
 మెడకాయ కోసుకుంటా’ మరే విధంగా `ప్రాణ త్యాగము' అన్న మాటే
 తీసుకురావద్దు.  జీవితములో ఏదైనా సాధించాలంటే కృషి,
 పోరాటమే మార్గమని చెప్పాలి.
ప్రాణత్యాగముతో సమస్య పరిష్కారము కాదు. 
 కృషి, పోరాటాముతోనె జీవితములో ఏదైన సాధ్యము.

Monday, June 3, 2013

Teens-Health care


కౌమారము - లైంగికారోగ్యము
ఈ మధ్యె ఒకమ్మాయి నా దగ్గరకు వచ్చింది, నెల మీద వారం
రోజులు దాటింది, ముట్టు రాలేదని.  "సరే.  మూత్ర పరీక్ష చేసుకో",
మన్నాను.  అది కాస్త పాజిటివ్ వచ్చింది.  గర్భవతివని చెప్పాను.
"పీరియడ్ వచ్చెట్టు మందులివ్వండి", వెంట వచ్చిన మగవాడడిగాడు.
ఆమెను పరీక్ష చేసాక చెపుతానన్నాను.  అతన్ని బైటకు పంపి
అమ్మాయిని పరీక్ష చేస్తు మరిన్ని ప్రశ్నలడిగాను.
అమ్మాయి వయస్సు పదిహేడు, ఇంటర్ రెండో సంవత్సరంలోకి
వచ్చింది, తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు, ఆ వచ్చినతను
 ఆమెకు బావ(?) కావాలి, అతను వడ్రంగి పని చేస్తుంటడు, పెళ్ళి
మరో రెండెళ్ళకని తెలుసుకున్నాను.  ఆమెకు రక్తం తక్కువ వుందని,
 నెల తప్పిన లక్షణాలు వున్నట్లు నిర్ధారించుకున్నాను.
అతన్ని పిలిచి, "అమ్మాయి గర్భవతి, గర్భస్రావము చేసుకోవడానికి మందులు
వాడడానికి ముందు రక్త పరీక్షలు చేసుకోవాల", ని చెప్పాను.
ఇంకా రెండెళ్ళవరకు పెళ్ళి చేసుకోనప్పుడు కొద్ది జాగ్రత్త తీసుకోవాలి కదా",
ఓ మాట అన్నాను.  "అందుకే తీసుకొచ్చాను",  ఒక క్షణం ఆగి, "నా భార్యకు
టి బి వుంది, అమెతో కల్సివుంటే నాక్కుడ వస్తుందా?" అడిగాడు.  ఒక
లిప్త కాలం నాకు చాలా కోపం వచ్చింది.  ఆ అమ్మాయికి ఈ విషయం తెలుసా
అన్నట్టు చూసాను.  "నీకు  ముందు జీవతము చాలా వుంది.  జాగ్రత్తగా వుండాలని"
నేనన్నాను.  వాళ్ళు వెళ్ళి పోయి మరునాడు రక్త పరీక్ష రిపోర్టులతో వచ్చారు.
ఆమె రక్తములో హిమోగ్లోబిన్ శాతము 7గ్రా%.  వుండాల్సిందానికి 50%
కంటే తక్కువె.  అంటె అమే ఆరోగ్యమ్ కాస్తైన బాగుండాలంటె వెంటనె రక్తము
ఎక్కించుకోవల్సిన పరిస్థితి.  ఇలాంటి పరిస్థితిలొ అబార్షన్ చేయటము
ప్రాణాపాయమె.  ఆమెను నేను బోధనాసుపత్రికి వెళ్లమని చెప్పాను.
ఈ సందర్భములో సమస్యలు ఎన్నివున్నా ఆరోగ్య విషయము గురించి
ప్రస్తుతము చెప్పుకుందాము.  ఓ ఇరవై ఏళ్ళ కింద పెళ్ళి కాని అమ్మాయి
గర్భవతని వస్తె వైద్యంతోపాటు నీతి పాఠాలు చెప్పటము కూడ జరిగెది.
అబార్షను చేసెటప్పుడు తల్లిదండ్రులు తప్పనిసారిగ వుండలని నిక్కచ్చిగ
చెప్పేదానిని.  కాని ఇప్పుడు కాలానుగుణంగా మారాల్సి వచ్చింది.  ఇప్పుడు
18 సం. లోపు వాళ్ళైతేనె తల్లిదండ్రులు వుండాలని అడుగుతున్నాము.  అలాగే
ఇదివరకు పెళ్లికాని పిల్లలకు గర్భనిరొధక పద్ధతుల గురించి చెప్పటము అన్నది
నీతిమాలిన పని.  ఇప్పుడు అమ్మాయిలు వచ్చి అడిగితె గర్భనిరోధక పద్ధతులు
చెప్పి అలాగె లైంగిక ఆరోగ్యము గురించి కూడా వివరించి చెప్పటము జరుగుతుంది.
కౌమారదశలో అమ్మాయిలు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.  ఈ దశలో పున
రుత్పత్తి అంగాలు పరిపక్వత చెందనందువలన ఇన్ఫెక్షన్ వచ్చె అవకాశాలు ఎక్కువ
వుంటాయి.  దాని ప్రభావము ముందు జీవతములో వుండొచ్చు.  మరో ముఖ్యమైన
అంశము - గర్భము రావటము.  అబార్షన్ కొన్నిసార్లు విపత్కర పరిస్థితులకు దారి తీసి
మున్ముందు పునరుత్పత్తిపై ప్రభావము చూపిస్తుంది.  అంతే కాకుండ అబార్షన్ చేసెటప్పుడు
ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడవచ్చు.  ఈ సమస్యలన్ని రక్తహీనత, అనారోగ్యంగా వుండె
అమ్మాయిల్లో ఎక్కువ.
విశృంఖల శృంగార/సెక్స్ జీవితము గడిపినందువల్ల స్త్రీలకు వచ్చె సమస్యలు ఎక్కువ.
సామాజిక పరమైన విషయాలు పక్కన పెట్టెద్దాం.  ఆరోగ్యసంబంధ సమస్యల గురించె
నేను చెప్పేది.
- సుఖవ్యాధులు స్త్రీలకు తొందరగ అంటుకుంటాయి.  వాటి తీవ్రత కూడ ఎక్కువె.
  గర్భాశయము పైన ప్రభావము పడితె ముందుముందు సంతానము కావడములో
  ఇబ్బందులు వస్తాయి.  కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కాన్సెర్ ప్రేరకాలు కావచ్చు.
- గర్భము వస్తె గర్భస్రావము, దాని వలన కలిగె దుష్పలితాలు.
అమ్మాయిలు/స్త్రీలు లైంగిక/శృంగార జీవితము ప్రారంభించెముందు వారి ఆరోగ్య స్థితి
తెలుసుకోవాలి.  గర్భము, సుఖవ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  నేను పైన
చెప్పినలాంటి కేసులు డాక్టర్ లందరికి అనుభవమే.  ఆ స్థితిలో అమ్మాయి జీవితము
అద్రగానమే.  ఆరోగ్యము బాగుంటె ఆ సారికి అబార్షను చేసుకొని పరిస్థితి గట్టెక్కవచ్చు.
ఆమ్మాయిలందరు వారు పెద్దమనిషి/రజస్వల తరువాత ఒకసారి రక్త పరీక్ష చేసుకొని
వారి రక్తము గ్రూప్, హిమోగ్లోబిన్ శాతము తెలుసుకోవాలి.  హిమోగ్లోబిన్ శాతము
 తప్పనిసరిగ 12 గ్రా% వుండెటట్లు చూసుకోవాలి.  అందుకు అవసరమైన పౌష్టికాహారము,
మందులు తీసుకోవాలి.
అబ్బాయిలు కూడా వారు జత గూడె అమ్మాయి పట్ల ప్రేమాభిమానాలు వుంటె, వారి
బాంధవ్యములో నిజాయితి వుండాలి.  అమ్మాయి ఏ రకంగా అనారోగ్యము పాలు
కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రస్తుత వాస్తవ పరిస్థితులను అవగాహన చేసుకున్న సామాజిక బాధ్యతగల వ్యక్తిగా
ఇది రాసాను.  ఇది వైవహికేతర శృంగారానికి మద్ద్తతు కాదు.  దానిలో వుండె ఆరోగ్య
ప్రమాదాలు స్త్రీలకు తెలియచేయటమే నా ఉద్దేశము.