Thursday, October 31, 2013

News - Views

అలజడి
మళ్ళీ అఖిల పక్షమీటింగ్ అనగానే అందరిలో రకరకాల
అనుమానాలు మొదలయ్యాయి.  తెలంగాణ వాదులు
ఇదేమన్న తెలంగాణ పక్కన పెట్టే విషయమా అని
ఆందోళన చెందారు.  తరువాత అది విభజన ప్రక్రియలో
భాగంగ జరుగుతుందని తెల్సి చల్లబడ్డారు.  ఇప్పటి దాక
కేంద్రము ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని విభజిస్తుందని గొంతు
చించుకున్న చంద్రబాబుకు ఇప్పుడు గొంతు పెగలటము
లేదు.  ఇప్పటికైనా చంద్రబాబు సీమాంధ్ర కేమికావాలో
కేంద్రము ముందు పెట్టి అక్కడ ముందు ముందు ఎన్నికల్లో
గెలుపుకు, కొత్త ఆంధ్రప్రదేశ్‍లో మళ్ళి ముఖ్యమంత్రి అయ్యెందుకు
ప్రయత్నించవచ్చు.  అన్ని పార్టీల వారు విభజన వల్ల కలిగె
వాళ్ల సమస్యలను, వాటి పరిష్కారలను కేంద్రానికి తెలియజేసి
విభజన సామరస్యంగా జరిగేటట్టు చూస్తె అందరికి మంచిది.

                 ******************

నిన్న జరిగిన ఘోరం తలచుకుంటే గుండె బరువెక్కుతుంది.
వొల్వో బస్ ప్రమాదము, ఆ బస్ శకలాలు, మాడిన మాంసము
ముద్దల్ల వున్న ఆ దేహాలు చూసిన వారెవరైనా ఆ బస్ యజమానిని,
డ్రైవరును, ప్రయాణానికి అనుమతిని ఇచ్చిన RTA ఆఫీసర్ను
శాపనార్థాలు పెట్టకుండ వుండగలరా?  అయినా ఎన్ని శాపనార్థాలు
పెడితే మాత్రము పోయిన ప్రాణాలు తిరిగివస్తాయా?  ఒక్క ప్ర్రాణంతో
ఎన్నెన్ని జీవితాలు ముడిపడి వున్నాయో?  ఆ జీవితలకు ఎవరు
రక్షణ ఇవ్వగలరు?  కాసులకి కక్కుర్తి పడి నమ్మిన వారి ప్రాణాలను
ఫణంగ పెట్టి సంపాదించుకునేవారు మనుష్యులేనా.  ఎన్ని కోట్లు
సంపాదించినా, బంగారు పళ్లాలున్నా అందులో రెండు ముద్ద
లన్నమే తింటారు కదా.  బంగారు ముద్దలు తినరు కదా.
జీతము ఇవ్వాల్సి వస్తుందని కక్కుర్తి పడి రెండో డ్రైవరును పెట్టుకో
నందుకు ఎన్ని ప్రాణాలు బలి కావల్సి వచ్చింది.
ప్రభుత్వము రెండురోజులు ఏవో కంటి తుడుపు చర్యలుగా అరెస్టులు
చేయడము, నాలుగు బస్సులు పట్టుకోవడము కాదు, ప్రైవేట్ బసులు
నడపటానికి నియమ నిబంధనలు అందరు, ఎప్పుడు పాటించెలా
చర్యలు తీసుకోవాలి.  ముందు కాస్త కష్టమనిపించినా నియమ
నిబంధనలు అమలు పరిస్తె కలిగె లాభాలు అర్థమైతె అందరు తప్పక
అవి పాటిస్తారు.  అప్పుడు ఇలాంటి ప్రమాదాలు వుండవు.

Saturday, October 26, 2013

News - Views

అడగదలుచుకున్నాను
-ఆంధ్రప్రదేశ్ భారతదేశములో ఒక రాష్ట్రమా లేక
మరో దేశమా?
-భారతదేశములో హింది (?జాతి) తరువాత ఎక్కువగా
వున్నది తెలుగు (?జాతి) వారె.  మరి హింది మాట్లాడె
వారికి నాలుగైదు రాష్ట్రాలుంటే మరి తెలుగు వారికి రెండు
లేదా మూడు రాష్ట్రాలుంటే చిన్నతనము, జాతి విఛ్చినం
ఎట్లా అయితుంది?
-సమైక్యాంధ్ర వుండాలంటే కోస్తా కావాలి, సీమ కావాలి,
తెలంగాణ కావాలంటున్నారు.  కోస్తా సీమ ఎలాగు
సొంతమే, ఇక తెలంగాణ కూడ కావాలనటము మాది
మాకే, మీది మాకె అనడము కాదా?
-ఓట్ల కోసం సీట్ల కోసం విభజన అంటున్న జగన్ తను
సమైక్యమనేది ఓట్ల కోసం, సీట్ల కోసం కాదా?
-సోనియాగాంధి కొడుకుని  ప్రధాని చేయాలని విభజన
చేస్తుందని అంటున్న జగను తండ్రి శవము వాకిట్లో
వున్నప్పుడె తను ముఖ్యమంత్రి కావలని ఆం.ప్ర ఎమ్మెల్యెల
సంతకాలు తీసుకున్నది నిజము కాదా?
-నీటి యుద్ధాలు అంటున్న జగన్‍కు భారతదేశము పాకిస్తాను,
చైనా,బాంగ్లాదేశ్‍తో నీళ్ళు పంచుకుంటున్న సంగతి తెలియదా?
-తెలంగాణ ఏర్పడితె హైదరాబాదులో భూముల విలువ పడిపోతె
ఆ బాధ తెలంగాణ వారికి ఉండాలి కాని ఆంధ్రోల్లకు ఏం కష్టం?
అన్యాయంగా, అక్రమంగా కబ్జాచేసుకున్న నీ వేల ఎకరాలి
గురించి రంధే కద.  చిన్నపనులు చేసుకుని, చిన్న చిన్న ప్లాట్లు
కొనిక్కొని, చిన్నచిన్న ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు ఆ ఇళ్ళలో వుంటారు,
దాని విలువ ఎక్కువైనా తక్కువైనా వారికి ఏం నష్టం, కష్టం.
-ఆంధ్రలో చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం ఇప్పుడు కేవలము
హైదరాబాదుకే వెళ్తున్నారా, అమెరికా వెళ్లట్లేదా?  వివిధ రాష్ట్రాలకు,
వేరు వేరు దేశాలకు పోవట్లేదా.  తెలుగు వాళ్ళంత ఒక దగ్గరె వుండాలని
ఆంధ్రప్రదేశ్‍లోనె వుంటున్నారా?  మరోక మాట, వాళ్ళు హైదరాబాదులోనే
ఉద్యోగాలు చూసుకుంటున్నారంటె తెలంగాణ విద్యావంతుల అవకాశాలు
కొల్లగొడుతున్నారని ఒప్పుకుంటున్నట్టెనా.  ఆంధ్రాలో విద్యావంతులుకు
ఉపాధి అవకాశాలు పెంచే తెలివి లేదా?
-ఆర్టికల్ మూడు ప్రకారము రాష్ట్రాని ఇచ్చే హక్కు కేంద్రానికి ఉందని, కేంద్ర
నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అఖిల పక్షములో మీ పార్టీ చెప్పింది
నిజము కాదని బైబల్ మీద ప్రమాణము చేసి విజయమ్మగారు చెప్పుతారా?
-చివరాఖరకు, ముప్పై ఎంపి సీట్లు గెలవాలనటములో మీకు తెలంగణ
రాష్ట్రము ఏర్పడుతుందని,అక్కడ ఇక ఆంధ్ర పార్టీలకు స్థానం లేదని
ఖచ్చితంగా అర్థమైందనే  కదా.  అంతే కాదు. ప్రధానమంత్రిని నిర్ణయించె
స్థాయిలో వుండాలనటములో మీరె ప్రధాని కావలనే ఆశ  దాగి వున్న
విషయము నిజము కాదా?
                     ****************************
నాకో డౌటు.  ఈ ఆంధ్రోళ్ళు భారతీయులమని అనుకోరా?  వాళ్ళకు
భారత జాతీయ గీతము రాదా, లేకపోతె ఆ గీతము పట్ల గౌరవము
లేదా? ఆనాడు ఏపి ఎన్జీవోల సభలో గిన్నిస్ రికార్డు గాయకుడు
జాతీయ గీతము పాడలేకపోయాడు. ఇవాళ పరిస్థితి మరీ ఘోరం.
ముఖ్యమంత్రి, ప్రధాని కావాలనుకునేవారికే కాదు, ఆ పార్టీ
ఎమ్మెల్యెలకు, కార్యకర్తలెవరికి కూడ జాతీయ గీతం కరెక్టుగా,
పూర్తిగా రాదు.
                    *************************
ఢిల్లిలో భూమి అదిరిందో లేదో తెలుసుకోవాలి.  సోనియా గాంధి
గారి చెవులు ఎలా వున్నయో, కర్ణభెరి వుందొ చిట్లిపోయిందో
తెలుసుకోవాలనుకుంటున్నాను.
   

Friday, October 25, 2013

News - Views

చంద్రబాబు - బెదిరింపులు
చంద్రబాబు మతిస్థిమితము తప్పినట్టే వుంది.  లేకపోతె ఆ
మాటలేంది?  పంజాబీల సెంట్‍మెంట్ దెబ్బతిన్నందుకు
ఇందిర గాంధి హత్యకు గురైందని. తమిళుల సెంట్‍మెంట్
గాయపడ్డందుకు రాజీవ్ గాంధి హత్య చేయబడ్దడని,
కాంగ్రెసోల్లు తెలివి తక్కువగా వ్యవహరిస్తరని అంటున్న
చంద్రబాబు తను మామను వెన్నుపోటు పొడిచి ముఖ్య
మంత్రి అయిండని మర్చిపోయిండు.  ఏ కుటుంబ సభ్యుల
సహకారముతో అధికారము చేజిక్కించుకున్నాడో ఆ
కుటుంబ సభ్యులను ఏ మాత్రము అధికారములో చోటు
దక్కనీయకుండా ముందు దూరంగ నెట్టేసి ఆ తరువాత
అవసరాన్ని బట్టి మళ్లి చుట్టరికాన్ని కలుపుకున్నడు.
గాంధిలలో ఎవరిలోను ఇంత కుళ్ళు మాత్రము లేదు.  వాళ్ళు
దేశ ప్రయోజనాల దృష్ట్యా రాజకీయలు చేసినరె కాని కేవలము
అధికారము కోసము ఎవరికి వెన్నుపోటు పొడవలేదు.  మరి
చంద్రబాబు తిరుపతిలో తనపై జరిగిన హత్యాయత్నాన్ని ఎలా
సమర్థించుకుంటడు.  అది సరైనదనే చంద్రబాబు భావిస్తున్నాడా?
ఇక తెలుగు జాతి అని మొత్తుకునే వాళ్లు ఒకటి గుర్తించుకోవాలి.
తెలంగాణ వాళ్ళు తెలుగు మాట్లాడినా వాళ్ళు ఆంధ్రావాళ్ళు ఒక్కటని
ఎప్పుడు అనుకోలేదు.  ఇక ముందు కూడా అనుకోరు.  భారతదేశములో
ఎన్నో భాషలు, తెగలు, జాతులు వున్నాయి.  తెలంగాణ, ఆంధ్ర భాషలు
ఒకటిగా అనిపించినా వారు ఒక జాతిగా ఎప్పుడు భావించుకోలేదు.  ఈ
నేల మీద పుట్టిన వారి గుణాలు, అక్కడ పుట్టిన వారి గుణాల్లో ఎంత తేడా
వుందో ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాల ద్వార బైట పడింది.
భారతీయులుగా అందరము కల్సివుండాలి, పోరుగు రాష్ట్రాలవారిగా
కల్సివుండాలే కాని వాళ్ళు అంటున్న ‘తెలుగు జాతి’గా మాత్రము
కాదు.  తెలంగాణ వాళ్ళకు వారితో కలసివుండాలనే సెంట్‍మెంట్
ఆవగింజంత కూడా లేదు.  కాబట్టి వాళ్ళు తెలుగుజాతి సెంట్‍మెంట్
తెలంగాణ వాళ్ల మీద రుద్దాలని చూస్తె ఒప్పుకోరు. దోపిడి ఇక
ముందు సాగదని, దానిని సాగించేకోసం తెలుగుజాతి అనె సెంట్
మెంట్ ముందు పెడితె ఎవ్వరు నమ్మెస్థితి లేదు.  ఇకనైనా ఆంధ్రోల్లు
తెలుగుజాతి సెంట్‍మెంటు పక్కన పెట్టి వాస్తవాలు గుర్తించి, జిమ్మిక్కులు
మాని వాళ్ళ రాష్ట్రము గురించి ప్రణాళికలు మొదలు పెట్టాలి.  ఇక
ముందైనా వాళ్ళ కొత్త రాష్ట్రములో ప్రాంతీయ భేదాలు చూపకుండా
అందరికి న్యాయము జరిగేట్టు చూడాలి.

Thursday, October 24, 2013

News - Views

సమైక్య శంఖారావం
ఎల్లుండె సమైక్య శంఖారావం.  అది ఎందుకోసమో, దాని
లాభమేంటో ఆ సభ పెడ్తున్న వాళ్ళకైన ఖచ్చితమైన అవ
గాహన వుందా?  కేవలము పక్కవాళ్ళను, పార్టీలను రెచ్చ
గొట్టడానికి, తన పలకుబడి చూపెట్టుకోవడము కోసమే బోలెడు
డబ్బు ఖర్చు పెట్టడమే కాకుండ స్థానిక ప్రజలను కష్టపెట్టడము
ఏమి రాజకీయము, ఏమి విఙ్ఞత?  రాష్ట్రమంతా వర్షాలతో తడిసి
ముద్దైతుంది.  సామాన్య ప్రజలు, రైతన్న కష్టాలు చెప్పనలవి
కాకుండా వుంది. పలుచోట్ల రవాణ సౌకర్యాలు నిలిచిపోయాయి.
రాజధాని నగరములో పరిస్థితి కూడ అధ్వాన్నంగా వున్నది.
అయినా సమైక్య శంఖారావన్ని అలగే సాగించటము ఏ ప్రజలను
ఉద్ధరించేకోసం?  ప్రజలు కష్టాల్లో వుంటె వారి దగ్గరకే పోయి వారికి
చేతనైన సహాయము చేసె బదులు శంఖారావాలు, ఘీంకారాలు,
ఓండ్ర పెట్టడాలని ఊర్లల్ల నుండి తరలించుకు రావడము కష్టాల
పాలు చేయడము ఎంతవరకు సమంజసం .  బోలేడంత డబ్బు
వుండి ఏమి చేయాలో తేలికపోతె ‘రాబిన్ హుడ్’ కావచ్చు కద.
అది కూడ ముందుముందు ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగ
పడుతుంది కదా.
చూద్దాం. సమైక్య శంకారావములో ఎన్ని శంకలుంటయో, హాహా
కారాలుంటయో వెచి చూడాలి.

Tuesday, October 22, 2013

News - views

ఊసరవెల్లులు
తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఎప్పుడు పాసౌతుందో, తెలంగాణ
రాష్ట్రము ఏర్పాటైనట్లు గెజిట్లో ఎప్పుడొస్తుందో కాని, ప్రతి రోజు
ఈ ఆంధ్రోల్ల అడ్డదిడ్డ మాటలు వినలేక చెవులు గడలువడుతున్నయ్.
అసలు వాళ్ళు ఏమి మాట్లాడుతున్నరో వాళ్లకైనా అర్థమయితుందా?
ఓ గొప్ప మేధావినని, అంతా రాజ్యాంగ బద్ధంగా, నీతిగా, నిజాయితిగా
మెదలాలని, అధికారవికేంద్రికరణ జరిగితేనె ప్రజలకు మేలని, రాజకీయ
నాయకులు మాటకు కట్టుబడి వుండాలని, మానిఫెస్టోలో వట్టి మాటలు
కట్టి పెట్టి, ప్రజల ప్రజాస్వామిక హక్కులను నెరవేర్చె విధంగా చెప్పినవి
చేయాలని నీతులు పలికిన జయప్రకాశ్ నారాయణ తెలంగాణ
తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కని, అది అధికార వికేంద్రికరణలో
భాగమేనని, రెండు జాతీయ పార్టీల ఎన్నికల ప్రమాణమని, CPM
మినహా లోక్‍సత్తతో సహ ఇతర పార్టీలు అన్నికూడ తెలంగాణ
ఏర్ఫాటుకు వ్యతిరేకము కాదని చెప్పాయని, కేంద్రప్రభుత్వానికే తెలంగాణ
పై నిర్ణయము తీసుకొని అమలు చేయాల్సిన బాధ్యత వున్నదని,
ఆ నిర్ణయము నానుస్తు ఆంధ్రప్రదేశ్‍ను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టిందని
పలుసార్లు విమర్శించి, పరోక్షంగా నిర్ణయము తీసుకునే విధంగ వత్తిడి
చేసిన సంగతి మరిచిపోయడు.  ఇప్పుడు ప్రజాభిష్ట వ్యతిరేక నిర్ణయము
తీసుకుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అనడములో ఆయన మేధ
ఏందో, మెదడేందో, రాజనేతేందో, నిజాయితేందో, మాట నిబద్ధతేందో
తెల్సిపోతుంది.  పేద్ద ప్రజాస్వామిక వాదినని డబ్బా కొట్టుకున్నాయన
ప్రజాస్వామ్యాన్నిపాతరేసి ప్రాంతీయతకే పట్టము కడుతున్నడు.
తెలంగాణలో ఎమ్మెల్యే అయిన సంగతి కూడ మర్చిపోయి, తెలంగాణ
ఏర్పడితే ఆయన, ఆయన పార్టీ అస్తిత్వము కృష్ణాగోదావరిలని
దాటుకొని పోయి బంగాళఖాతంలో కల్సిపోతుందని స్వార్థ
పూరితంగా వ్యవహరిస్తున్నడు.  నిజమైన మేధావైతె మాటకు,
రాజ్యాంగానికి కట్టుబడి, విభజనకు కేంద్రానికి సహాయకారిగ
వుంటే దేశములోనే కాస్త మంచి పేరు తెచ్చుకొని రాజకీయ
భవిష్యత్తును సుస్థిరము చేసుకునేవాడు.  రాజకీయాలలో ప్రలోభాలకు
లొంగకుండ నిజాయితిగ పనిచేయడము సాధ్యముకాదా?
చంద్రబాబు గోస చెప్పలేనిది.  ఆయనో గొప్ప రాజకీయ వ్యూహకర్త.
మామను వెన్నుపోటు పొడిచి నిలదొక్కుకోవటముతో తనంత
అపర చాణక్యుడు ఈ కాలంలో ఎవరు లేరనే అనుకున్నడు.
ఎంతో ఆలోచించి, చించి, చించి, తేదేపాలో కమిటీ వేసి,సర్వే చేసి,
తెలంగాణ పైన నిర్ణయము తీసుకొని కేంద్రానికో లేఖాస్త్రాన్ని
సమర్పించాడు.  అంత సుధీర్ఘ మంతనాల తర్వాత తీసుకున్న
నిర్ణయానికి కట్టుబడి వుండక భావోద్వేగాలకులోనై, ఎదుటి
వారి రాజకీయ ఎత్తులలో పావై మతిస్థిమితము లేనివాడిగా ప్రవర్తించి
ఆతని మీద ప్రజలు పూర్తి నమ్మకము కోల్పోయెట్టు చేసుకున్నడు.
వెన్నుపోటుపొడిచి, ఆనాడు హోటల్ వైస్రాయ్ ముందు తన మీద
అల్లుడు చెప్పులు విసిరేయించినప్పుడు నందమూరి తారక
రామారావ్ ఎంత మానసిక క్షోభ అనుభవించాడో!  ఆ పాపం
వూర్కె పోతుందా.
భాజపా తెలంగాణకు మద్దతివ్వటము వెంకయ్యనాయుడికి ఎంత
కష్టంగా వుందో. తప్పని పరిస్థితిలో ఎంత గొప్ప వాళ్ళైనా, ఏ పదవిలో
వున్న అంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి వుంటమని కచర మొఖం
 పెట్టుకొని చెప్పిండు.  ఈ మొఖాన్ని చూసి తెలంగాణ జనం భాజపా
ఏం చేస్తుందోనని లొలోపల కాస్తా అనుమానపడుతుండ్రు. భాజపా
ఆంధ్రాలో ఎట్లాగు రాదు.  ఈ నాయుడు మరో చంద్రుడితో కల్సి కంత్రి
వేషాలేస్తె ఆయింత తెలంగాణలో భాజపా ఒక్క సీటు కూడ
దక్కించుకోలేదు.
కాంగ్రేసు, గాంధీల పేర్లు చెప్పుకొని ఎన్నికల్లో ఓట్లడుగుతాము అని
ఒప్పుకునే సీమాంధ్ర కాంగ్రేసు నాయకులు తమకు టికెట్లుచ్చి
పదవులిచ్చిన అధిష్టానాన్ని లెక్కచేయమంటరు.  ఆ పార్టీ లేకపోతే
రాజకీయ బతుకులేదు, ఆ అధిష్టానం టికెట్లివ్వకపోతె భవిష్యత్తు
వుండదు, గాంధీలు మాట్లాడకపోతె ఓట్లు రాలవు, ఆధిష్టానం
కనికరించకపోతె అధికారము, పదవులు వుండవు అయినా
విభజన విషయము వచ్చేసరికి ‘ఎవరి మాటవినేది లేదు,
ఎంతకైనా తెగిస్తామ’ని అంటారు.  వీళ్ళకు ప్రజలు, అధిష్టానం
కంటె వాళ్ల సొంత ఆస్తులు పెంచుకోవటమే ముఖ్యమనుకుంట.
తెలంగాణ ఏర్పాటు ఎన్నికల వాగ్దానమని, ఎన్నికల వాగ్దానాలు
నెరవేర్చె పార్టీగా తమ పార్టీ గురించి ప్రచారము చేసుకుంటే ప్రజలు
రాజకీయ నాయకులను కాస్తైనా నమ్మేవాళ్లు కాదా. వాళ్ళు
తలచుకుంటె తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సుహృద్భావ
వాతావరణములో ఎంతో సామరస్యంగా సంతోషంగా సాగెది కద.
ప్రజల మధ్య వైషమ్యాలు పెరుగవు కాదు కద.  ఆ ప్రాంత
రాజకీయనాయకుల పట్ల తెలంగాణ ప్రజలకు గౌరవముండెది
కదా. ఈ రాజకీయనాయకులు ఎంత వంచకులో రెండు ప్రాంతల
ప్రజలకు అర్థమైంది.  ప్రజలు ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా
తెలంగాణలో కాని, ఆంధ్రాలోకాని నాయకులు రకరకాల
నాటకాలు ఆడారు కాని తమ పదవులను మాత్రమువదులుకు
కోలేదు (తెరాస తప్ప).  మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు
వస్తాయంటె మాత్రము రాజీనామాలు చేసి ఓట్ల వేటకు వస్తారను
కుంట.  అంత వరకు పదవులను అంటి పెట్టుకొని తమ కార్యాలన్ని
చక్కదిద్దుకుంటారు.  వీరి నాటకాలు ప్రజలకు అర్థం కావను
కుంటున్నరు.  ప్రజలు తెల్లివి తక్కువ వాళ్ళైతె మన
ప్రజాస్వామ్యము ఇలా పరిడవిల్లేదా?

Wednesday, October 9, 2013

News - Views

సీమాంధ్ర విధ్వంసం
సీమాంధ్రాలో ఉద్యమము పేరిట జరుగుతున్న విధ్వంసము
ఎంతో బాధాకరము.  ఉద్యమము పేరుతో జరుగుతున్న
వికృత కిరాతక చేష్టలకు ప్రభుత్వము అండగా వుండటము,
కేంద్రము ఎలాంటి చర్యలు తీసుకోక పోవటము దేనికి సంకేతము?
పేద ప్రజలకోసమే మా ప్రభుత్వమని చెప్పె ఏ ఒక్క పార్టీ కూడా
సీమాంధ్రలో విధ్వంసము సృష్టించేది ఎవరో తెలిసినా దానిని అట్లాగే
కొనసాగనివ్వటము ఎంత దారుణం.  కాపాడాల్సిన ప్రభుత్వము
కక్ష పూరితంగా వ్యవహరిస్తే ప్రజలు ఎక్కడికి పోవాలి, ఎవరికి
చెప్పుకోవాలి?
న్యాయాన్యాయాలు మర్చిపోయి, ధర్మాధర్మాలు పక్కన పెట్టి
కేవలము ఆధిపత్యం కోసం, కొందరి వ్యక్తుల అక్రమార్జనలు
రక్షించటం కోసం తమ స్వంత ప్రాంతము, తమ స్వంత ప్రజలని
కూడ చూడకుండా వాళ్ళను నానా ఇబ్బందులకు గురి చేయటము -
ఇదేమి రాజకీయము? ఇదేమి రాక్షసత్వము?  స్వప్రయోజనాలకోసం
పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవతము అధోగతి పాలుజేసి
అదంతా వారికోసమే అని నమ్మించి అధికారములోకి రావలనుకోవటము
ఏ కౌటిల్యుని రాజనీతి పాఠము?
సామాన్యప్రజలు - బహుజనులు పెదలే.  ఎక్కువ శాతం రెక్కాడితేనె
డొక్కాడని వారే.  ఆకలి మంటలు చల్లార్చుకోవడానికి కొన్నిసార్లు
కొందరు అమ్ముడుపోయెవారే.  అమ్ముడుపోయి దారి తప్పినప్పుడు
కఠిన శిక్షల జ్వాలల్లో బతుకులు బూడిదయ్యెది వారివే.  అట్లాంటి వారు
ఒక్క క్షణం ఆలోచించి, అమ్ముడుపోయి కాలిపోయెకంటే, ఆత్మగౌరవముతో
నిప్పుల చెండై మాయల మరాఠిలను నుసి చేయాలి.  అలాంటి వారున్నారు.
మార్గదర్శకులైన వారున్నారు.  ప్రజాస్వామ్యములో ఓటు హక్కు అందరికి
కల్పించిన మహానుభావులు, ప్రజలే ప్రభువులు కావాలన్నారు కాని, రాజులై
రాచరికము చేయాలనలేదు.  రాజకీయాల పేరుతో రాక్షసీయం చేసేవారిని
పాతాళానికి తొక్కేయడానికి ఓటె వజ్రాయుధము.
పేదలు, అమాయకులు, చాతకాని వాళ్ళు, చేవలెని వాళ్ళుగా కనిపించే
సామాన్యప్రజలకు ఉన్న శక్తివంతమైన ఆయుధము ఓటు.  దీనిని సద్విని
యోగము చేసుకొని గొప్పగొప్ప వారిని, వ్యక్తులను, ప్రభుత్వాలను
మట్టి కరిపించారు.  ఈ సామాన్యులు పైకి ఏమి మాట్లాడక పోవచ్చు, నిర్బలులు,
నిస్సహాయులుగా కనిపించ వచ్చు.  వాళ్ళు రాజకీయాలు మాట్లాడక పోవచ్చు,
వాటి గురించి అవగాహన లేనట్టు కనిపించవచ్చు.  కాని ఓటు వేసినప్పడి నుండి
మళ్ళి ఓటు వేసె వరకు ప్రతిరోజు వారు ఎన్నుకున్న, ఎన్నుకొబడ్డ నాయకులను,
ప్రభుత్వాన్ని గమనిస్తునే వుంటరు.  ఇది ఒక ఇంటర్నల్ అస్సెస్‍మెంట్ లాంటిదె.
దాని మీద అధారపడె మళ్లి ఓటు వేస్తారు.  ఎంత బ్రహ్మాండమైన స్లోగన్‍లు ఇచ్చిన
మోసపోరు.  మైమరచి పోరు.  నమ్మకము అనిపించి నిజాయితి కాస్తైనా వుందను
కుంటేనె ఓటు వేస్తారు.  అధికారాన్ని ఇస్తారు.  మహామహులనే ఓడించారు.
మట్టి మనుషులనీ గెలిపించారు.  తస్మాత్ జాగ్రత్త.

Tuesday, October 8, 2013

News - Views

నడుస్తున్న కథ
తెలంగాణకు వ్యతిరేకము కాదంటే, తెలంగాణలో మాయ మాటల్తో
ఓట్లు కొల్లగోట్టి అధికారం పోందడానికి మాత్రమే.  తెలంగాణ ఇవ్వమని
కాదు!
కోట్లు కొల్లగొట్టి కోట్లు తొడుక్కోని అధికారమ చెలాయించే వాళ్ళకు,
వాళ్ళ ప్రజల మనోభావాలు ముఖ్యము కాని, మట్టి మనుషులు
ఓట్లు వెయ్యడానికే, వాళ్లకు మనోభావాలేంటి?
సమన్యాయమంటె దొంగకు తాళమియ్యాలే, దోపిడి చేసేవాడికి
అధికారమియ్యాలే.  అంతే కాని అమాయకుడికి జీవించే హక్కు
అధికారమియ్యమని కాదు.
ఇంట్లో తండ్రి శవాన్ని పెట్టుకొని ముఖ్యమంత్రి పదవికోసం సంతకాలు
సేకరించడము అత్యున్నత నీతివంతమైన పని! ఎన్నికలప్పుడు
ఒకటికి రెండుసార్లు మాటిచ్చి అది నెరవేరిస్తె దుర్మార్గమైన, అనైతికమైన
దిగజారుడు చర్య!
తెలంగాణ ఇవ్వమన్నామని ఒకటికి రెండుసార్లు అఖిల పక్షములో
చెప్పినా, కేంద్రానికి ఉత్తరాలిచ్చినా, అది నమ్మెయ్యటమేనా?  వెన్నుపోటు
తోనే రాజకీయాల్లో చక్రము తిప్పేవాళ్లుంటారని తెలుసుకోక పోతె ఎట్లా?
మాటలతో మోసపుచ్చి, ఎన్నికల్లో చంద్రున్ని ఇస్తామని చెప్పి ఇస్తామా.
అద్దంలో చూపించి ఇదిగో చందమామ అని జోకొట్టాలె.
"ఉద్యమాన్ని చక్కగ అదుపు చేయగలను.  తెలంగాణ ఉద్యమాన్ని ఎంత చక్కగా
అణిచేసాను, లాఠిలతో, తూటాలతో, అరెస్టులతో.  కాని సీమాంధ్రలో మాత్రం నేనేం
చేయలేను.  వాళ్ళను మరింత ప్రోత్సహిస్తాను.  వాళ్ళు నా వాళ్ళు.  నేను ఆంద్ర
ప్రదేశ్ ముఖ్యమంత్రినే.  ఆంధ్రుల ముఖ్యమంత్రినె.  కాని తెలంగాణ ముఖ్యమంత్రిని
కాదు.  చరిత్రలో నేను మిగిలిపోతాను, సొంత పార్టీని, పార్టీ నిర్ణయాన్ని, నా ప్రభుత్వాన్ని
కూల్చిన వ్యక్తిగా, చిత్తూరి జిల్ల  రక్తము  నాలోకూడ వున్నదని, దానికి వెన్నుపోటు
వెన్నతో పెట్టిన విద్య అని నిరూపించుకుంటున్న.  చంద్రబాబు ఇంటి మనిషిని వెన్ను
పోటు పెడిస్తె, నేను రాష్ట్రప్రజలను, కేంద్ర ప్రభుత్వాన్ని వెన్ను పొడిచిన మొనగాడిని". 

Thursday, October 3, 2013

Jai Telangaana


మరో అడుగు ముందుకు. గమ్యము అడుగు దగ్గరలోనే.
ప్రజల విజయం.  ప్రజాస్వామ్య విజయం.
జై తెలంగాణ!  జయహో తెలంగాణ!

Wednesday, October 2, 2013

News - Views

రాష్ట్ర రాజకీయాలు - ప్రజాస్వామ్య పాతర

రాష్ట్రములో కాని దేశములో కాని ఏమైతుందో ఎవ్వర్కి
అర్థం అయితలేదు.  ఎవరిపైన ఎవరో, ఎవరి మాటకు
ఎవరు కట్టుబడి వుంటారో తెలుస్తలేదు.  ఎవరెప్పుడు
ఎట్ల మాటమారుస్తరో, అన్న దానికి అర్థాలు వేరని, మీడియా
వక్రీకరించిందని ఉల్టా అంటరో చెప్పేటట్టు లేదు.  పార్టీలకు
కూడ ఒక సిద్ధాంతం లేదు.  అంతా రాద్ధాంతమే.  అంతా ప్రజా
సేవకులమంటరు, ప్రజల మనోభావాలే ముఖ్యమంటరు, కాని
ఒక ప్రాంతం ప్రజలే ప్రజలుగా వారికి అనుకూలంగనే నిర్ణయాలు
జరుగాలని అల్లర్ల్లు చేస్తరు, చేయిస్తరు.  మరో ప్రాంతం వాళ్లని
దోపిడి చేసినా నోర్మూసుకొని పడుండాలని, లేకపోతె మెడకాయలు
తెగ్గోస్తమి బెదిరిస్తరు. ఇది సీమాంధ్రుల నైజం. ఇంత జరుగుతున్న
దోపిడికి, దౌర్జన్యానికి గురైతున్నాఆ ప్రజలకు అండగా ఉండాల్సిన  తెలంగాణ
నాయకులు అధిష్టానం భజన చేస్తు, "అదిగో అమ్మ ఇచ్చె, ఇదిగో
తెలంగాణ వచ్చె"నంటు తెలంగాణ నేతలు వాళ్ళకు వాళ్ళె మీటింగులు
పెట్టుకొని అమ్మను పొగుడుకుంట సంబురాలు చేసుకుంటున్నరు.
కాళ్ళు సాపుకొని పడుకుంటున్రు.  లేదా కొత్త రాష్ట్రానికి ముఖ్యమంతెవరని
డిస్కషన్లు పెట్టుకుంటున్రు.
అటు సీమాంధ్ర ప్రజాపతినిధులంతా రకరకాల ఎత్తులు వేస్తున్నరు, జిత్తులు
జేస్తున్నరు.  ఉద్యోగులను ఉసిగొలుపుతున్నరు.  గవర్నమెంట్ ఇన్సిటిట్యూట్స్
బంద్జేసి ప్రైవెట్లొ వ్యాపారాల్లో లాభాలు దండుకుంటున్రు.  పేదలు, బడుగులు
ఎటుబోతె మాకేమి, మాదోపిడి కలకాలం సాగడానికి ఎంతవరకైనా పోతమని
నిసుగ్గుగ చెప్తున్రు.  తెలంగాణ ఆపడానికి, సీమాంధ్ర ప్రతినిధులు వారి ఇంటి ఆడవారిని
 ఏ.పి. గవర్నరు దగ్గరకు,  కాంగ్రేసు ప్రతినిధి దిగ్విజయ్ సింగ్ దగ్గరకు,
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి దగ్గరకు పంపినరు.
పార్టీలు కూడ రకరకాల పొత్తులు ఆలోచిస్తున్నయి.  ఎటుబడి తెలంగాణ
రాకుండ చెయ్యలే.  వాళ్ళ నీళ్ళు, ఉద్యోగాల దోపిడి కలకాలం సాగాలని
సర్వ ప్రయత్నాలు చేస్తున్నరు.  భాజప మతత్వపార్టి అని దానికి దూరంగా
వుండాలని అన్న చంద్రబాబు ఇప్పుడు ఆ పార్టీతో వియ్యానికి ఉరికురికి
పోతుండు.  ముస్లిం ఓట్లు పోతే పోని, మోది వెలుగుల్లో తన పార్టీని ముందు
కురికించి సెంటర్లో చక్రం తిప్పాలని ప్లానేస్తున్నడు.  ఈ నాయుడు బాబుకు ఆ
వెంకయ్య నాయుడు తోడు.  పార్టీల కతీతంగ కులపోల్లంత కల్సి తెలంగాణ
రాకుండా చెయ్యడమేకాదు, ముందు ముందు ఢిల్లి పీఠము మీద కూడ
కన్నేసిండ్రేమో అని నా అనుమానము.  మోది తెలివైన నాయకుడైనా
కుతంత్రములో చంద్రబాబును మించిన వాళ్ళెవరైనా వుంటారా? చూడాలి మరి.
రెండుకళ్ళ బాబును తెలంగాణలో ఎవరు నమ్మే పరిస్థితి లేదు.  కిషన్ రెడ్డి
తెలంగాణ ఐకాసలో వుండి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిండు.
కేంద్రములో తెలంగాణ బిల్లుకు మా మద్దతన్న భాజపా అంటె తెలంగాణ ప్రజలకు
కాస్తా అభిమానముంది.  తెలంగాణలో లోకల్‍గ తెరాస వున్నా, జాతీయ స్థాయిలో
భాజపాకు చాలామందె సపోర్ట్ ఇస్తరు.  తెదేపా లింక్ పెట్టుకుంటె తెలంగాణలో
భాజపా మునుగుడు ఖాయం.  ఆంధ్రలో ఎట్లాగు భాజపా రాదు.  తెలంగాణ వస్తె
అక్కడ జై ఆంధ్ర వాళ్లెమైనా భాజపాకు ఓటెయొచ్చు.  తెలంగాణలో తెలంగాణ
వస్తె భాజపాకు కొన్ని ఎమ్మెల్యె, ఒకటొ రెండో ఎమ్పి సీట్లు రావచ్చు.
ఈ విభజన నేపధ్యంలో భాజపాకు వచ్చే క్రెడిట్‍ను చంద్రబాబు తన
ఖాతలో వేసుకునే యత్నం జేస్తున్నడు.  గోద్రా అల్లర్ల తరువాత మోది
రాష్ట్రానికి రావడానికి కూడ ఇష్టపడని బాబు ఇప్పుడు మోదిని నెత్తి
కెక్కించుకుంటున్నడు.  ఈయన జగన్ బాబును పట్టుకొని ‘యు’ టర్న్
అని మాట్లాడుతుండు!
వైయెస్సార్ జగన్మోహన్ రెడ్ది ఎం తక్కువా?  మాటలు మార్చటములో చంద్రబాబును
మించినోడు.  బైబిల్ పట్టుకొని విజయమ్మ ఆర్టికల్ మూడు ప్రకారము కేంద్రము తెలంగాణ
ఇవ్వాలని, తెలంగాణలో పరిస్థితులు చక్కదిద్దాలని అంటుంది.  మళ్ళి అదే బైబిల్
పట్టుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని దీక్షలు చేస్తుంది.  ఆ అమ్మ కొడుకు "నేను
సెక్యులర్ పార్టీలతోనె కల్సి పని చేస్త"నని అంటడు.  అదే ఊపులో మోది కార్య దక్షతను
మెచ్చుకొని, సెక్యులర్ పార్టీలన్నిటిని ఆయన ఒక వేదిక మీదకు తీసుకొని రావలంటడు.
దీని అర్థమేమి దేవా?  జగన్ తమకు సపోర్ట్ అంటె తీర టైముకు భాజపా తెదేపాను
ఏ సముద్రములో కల్పుతుందో.
కిరణ్‍కుమార్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఏంటో ఆయనకైన అర్థంమైతుందా అని నా
డౌట్.  తెలంగాణ వచ్చుడు ఇష్టం లేదు.  అది అందరి సీమాంధ్రుల కున్నదే.  రాష్ట్రాన్ని
విడదీస్తె వచ్చె ఇబ్బందులు వాస్తవంగా ఏంటో చెప్పితె వాటి పరిష్కారముంటుంది.
అబద్ధాలు, కలిపిత విషయాలు రెచ్చగొట్టెట్టు చెప్తె ఎట్లా?  "ఆంధ్రా బుష్" అయిండు.
అప్పుడు నెహ్రు చేసిన శాసనాలు నీటి మూటలంటడు.  అప్పుడు ఆంధ్ర తెలంగాణను
కలిపెటప్పుడె నెహ్రు, కలిసి వుండలేకపోతె ఎప్పుడైనా విడిపోవచ్చని చెప్పిండు కద.  మరి
ఆ మాటకు విలువ లేదా? ప్రజలంతా తెలివి తక్కువోల్లనుకుంటరు.  ఆ ప్రజలే ఎలేక్షన్లలో
ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు బుద్ది చెపుతున్నరు.  కాని రాజకీయ నాయకులంతా కోడి
ముక్కు నేలకు రాసినట్లుంటరు.
కాంగ్రేసు అధిష్టానం టికెట్లిస్తెనె, కాంగ్రేసు పేరు, గాంధీల పేరు చెప్పుకొని ఓట్లడుక్కునే
నాయకులు "అధిష్టానం జాన్తనై, సోనియా ఎవరు, ఆమెకీ దేశము, ప్రజల గురించి  ఏం
తెలుస"ని ధిక్కార స్వరాలు వినిపిస్తున్నరు.  ఇన్నాళ్ళు ఈ సీమాంధ్ర ప్రతినిధులు
నోట్ల సంచులతో తెలంగాణ ఆపిండ్రని తెలంగాణ ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నరు.
కాంగ్రేసు కోర్ కమిటీ నాన్చి నాన్చి తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయము
తీసుకుంటే వచ్చె ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని, ఒక్క తెలంగాణ ఏర్పాటు అనే ఒక్క
బాణముతో భాజపా, తెదేపాలను మట్టి కరిపించాలని  చేసిందని అందరు అనుకున్నదే.
ఎట్లాగైతెనేం, మనకు తెలంగాణ వస్తుందని తెలంగాణ ప్రజలు సంతోషపడ్డరు.  రెన్నెళ్ళు
దాటినా విషయము ఎక్కడ వేసిన గొంగళి అక్కడె వున్నట్టు వుండటంతో తెలంగాణ ప్రజల్లో
మళ్ళీ అనుమానాలే.  ఆంటోని కమిటీలో వీరప్ప మొయిల వున్నాడంటేనే నాకనుమాన
మొచ్చింది.  షిండేగారు రోజుకో మాట్లాడుతుంటే ఆయన మీద కూడ అనుమానమే.  నిర్దిష్ట
కాల పరిమితి లేని ఓ కమీటి పెట్టి విషయాన్ని కాంగ్రేసు ప్రజలను ఎంత కాలం మోసము
చేయదల్చుకుంది?  ప్రజాస్వామ్యదేశంలో ప్రజాస్వామ్యహక్కుల పరిరక్షణ ప్రభుత్వానికి
పట్టదా?  డబ్బు మూటలకు అమ్ముడుపోయి ఒక ప్రాంత ప్రజలను మిలిటిరీతో
కాల్చివేయటము, లేదా పోలీసు కేసుల్లో ఇరికించి జైల్లో బంధించటమే ప్రభుత్వ
పాలనా విధానమా?  ఇదేం ప్రజాస్వామ్యం?
ఇప్పటి రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్ర, కేంద్రప్రభుత్వతీరుకు, కాంగ్రేసు మార్కు రాజకీయాలకు,
ఇతర పార్టీల ఎత్తులు పొత్తులు చూస్తున్న తెలంగాణ ప్రజలు ఎంతో ఆందోళన పడుతున్నరు.
ఈ మానసిక హింస తెలంగాణ ప్రజలు ఎంత కాలం తట్టుకోగలరు?  వారు సహనం కోల్పోతే
ఏర్పడె పరిస్థితులు దేశానికే తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చు.
రాహులుగాంధి కాంగ్రేసు పార్టీ ఉపాధ్యక్షుడు.  కోర్ కమిటీ సభ్యుడు.  అతనికి తెలియకుండానే
నేరచరితుల రక్షణ ఆర్డినెన్స్ తయారైందా?  అతను పబ్లిక్‍గా దానిని చించేయలనడము ఏ
వ్యూహముతోటి?  అతని మాటకు విలువ ఇచ్చి ఆ ఆర్డినెన్స్ వెనిక్కి తీసుకున్నరు.
ఆర్డినెన్స్ ఉపసంహరణ ప్రజాస్వామ్య విలువలను కొంతైనా కాపడుతుంది.  ఈ వ్యవహారం నడిచిన
తీరు దాని ప్రభావము తెలంగాణ బిల్లుపై పడదా?  ఇదివరకే సీమాంధ్ర ప్రతినిధులు పార్లమెంట్లో
తెలంగాణ బిల్లు పెడితె చించడానికి వెనకాడమని అన్నరు.  ఇప్పుడు వాళ్ళు అది చేసి చూపె
ట్టొచ్చు.  అంతే కాదు.  కాంగ్రేసు పార్టీ, కేంద్ర కేబినేట్ ఒప్పుకొని రాష్ట్రపతి సంతకానికి వెళ్ళిన
ఆర్డినెన్సునే వెనిక్కి తీసుకున్నట్టే తెలంగాణ నిర్ణయాన్ని వెనిక్కి తీసుకోమని ఆందోళన చేస్తరు
ఈ ఆంధ్రోల్లు.  రాహులు గాంధిని ఒప్పిస్తె పనులైతయని తెలిసిన సీమాంధ్రోల్లు ఇప్పుడు ఆయన
దగ్గరకు వాళ్ల బిడ్డలను పంపిస్తరనుకుంట.