Tuesday, October 8, 2013

News - Views

నడుస్తున్న కథ
తెలంగాణకు వ్యతిరేకము కాదంటే, తెలంగాణలో మాయ మాటల్తో
ఓట్లు కొల్లగోట్టి అధికారం పోందడానికి మాత్రమే.  తెలంగాణ ఇవ్వమని
కాదు!
కోట్లు కొల్లగొట్టి కోట్లు తొడుక్కోని అధికారమ చెలాయించే వాళ్ళకు,
వాళ్ళ ప్రజల మనోభావాలు ముఖ్యము కాని, మట్టి మనుషులు
ఓట్లు వెయ్యడానికే, వాళ్లకు మనోభావాలేంటి?
సమన్యాయమంటె దొంగకు తాళమియ్యాలే, దోపిడి చేసేవాడికి
అధికారమియ్యాలే.  అంతే కాని అమాయకుడికి జీవించే హక్కు
అధికారమియ్యమని కాదు.
ఇంట్లో తండ్రి శవాన్ని పెట్టుకొని ముఖ్యమంత్రి పదవికోసం సంతకాలు
సేకరించడము అత్యున్నత నీతివంతమైన పని! ఎన్నికలప్పుడు
ఒకటికి రెండుసార్లు మాటిచ్చి అది నెరవేరిస్తె దుర్మార్గమైన, అనైతికమైన
దిగజారుడు చర్య!
తెలంగాణ ఇవ్వమన్నామని ఒకటికి రెండుసార్లు అఖిల పక్షములో
చెప్పినా, కేంద్రానికి ఉత్తరాలిచ్చినా, అది నమ్మెయ్యటమేనా?  వెన్నుపోటు
తోనే రాజకీయాల్లో చక్రము తిప్పేవాళ్లుంటారని తెలుసుకోక పోతె ఎట్లా?
మాటలతో మోసపుచ్చి, ఎన్నికల్లో చంద్రున్ని ఇస్తామని చెప్పి ఇస్తామా.
అద్దంలో చూపించి ఇదిగో చందమామ అని జోకొట్టాలె.
"ఉద్యమాన్ని చక్కగ అదుపు చేయగలను.  తెలంగాణ ఉద్యమాన్ని ఎంత చక్కగా
అణిచేసాను, లాఠిలతో, తూటాలతో, అరెస్టులతో.  కాని సీమాంధ్రలో మాత్రం నేనేం
చేయలేను.  వాళ్ళను మరింత ప్రోత్సహిస్తాను.  వాళ్ళు నా వాళ్ళు.  నేను ఆంద్ర
ప్రదేశ్ ముఖ్యమంత్రినే.  ఆంధ్రుల ముఖ్యమంత్రినె.  కాని తెలంగాణ ముఖ్యమంత్రిని
కాదు.  చరిత్రలో నేను మిగిలిపోతాను, సొంత పార్టీని, పార్టీ నిర్ణయాన్ని, నా ప్రభుత్వాన్ని
కూల్చిన వ్యక్తిగా, చిత్తూరి జిల్ల  రక్తము  నాలోకూడ వున్నదని, దానికి వెన్నుపోటు
వెన్నతో పెట్టిన విద్య అని నిరూపించుకుంటున్న.  చంద్రబాబు ఇంటి మనిషిని వెన్ను
పోటు పెడిస్తె, నేను రాష్ట్రప్రజలను, కేంద్ర ప్రభుత్వాన్ని వెన్ను పొడిచిన మొనగాడిని". 

No comments:

Post a Comment