Thursday, October 24, 2013

News - Views

సమైక్య శంఖారావం
ఎల్లుండె సమైక్య శంఖారావం.  అది ఎందుకోసమో, దాని
లాభమేంటో ఆ సభ పెడ్తున్న వాళ్ళకైన ఖచ్చితమైన అవ
గాహన వుందా?  కేవలము పక్కవాళ్ళను, పార్టీలను రెచ్చ
గొట్టడానికి, తన పలకుబడి చూపెట్టుకోవడము కోసమే బోలెడు
డబ్బు ఖర్చు పెట్టడమే కాకుండ స్థానిక ప్రజలను కష్టపెట్టడము
ఏమి రాజకీయము, ఏమి విఙ్ఞత?  రాష్ట్రమంతా వర్షాలతో తడిసి
ముద్దైతుంది.  సామాన్య ప్రజలు, రైతన్న కష్టాలు చెప్పనలవి
కాకుండా వుంది. పలుచోట్ల రవాణ సౌకర్యాలు నిలిచిపోయాయి.
రాజధాని నగరములో పరిస్థితి కూడ అధ్వాన్నంగా వున్నది.
అయినా సమైక్య శంఖారావన్ని అలగే సాగించటము ఏ ప్రజలను
ఉద్ధరించేకోసం?  ప్రజలు కష్టాల్లో వుంటె వారి దగ్గరకే పోయి వారికి
చేతనైన సహాయము చేసె బదులు శంఖారావాలు, ఘీంకారాలు,
ఓండ్ర పెట్టడాలని ఊర్లల్ల నుండి తరలించుకు రావడము కష్టాల
పాలు చేయడము ఎంతవరకు సమంజసం .  బోలేడంత డబ్బు
వుండి ఏమి చేయాలో తేలికపోతె ‘రాబిన్ హుడ్’ కావచ్చు కద.
అది కూడ ముందుముందు ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగ
పడుతుంది కదా.
చూద్దాం. సమైక్య శంకారావములో ఎన్ని శంకలుంటయో, హాహా
కారాలుంటయో వెచి చూడాలి.

No comments:

Post a Comment