Friday, September 27, 2013

News - Views

ముసుగు
అదో పెద్ద ఊరు.  ఆ హాస్పటల్ ఆ వూళ్ళో తొలి హాస్పటల్,  పెద్ద
హాస్పటల్. ఈశ్వరయ్య ఆర్.ఎం.పిగా చిన్న క్లినిక్‍గా మొదలు పెట్టి
తర్వాత నర్సింగ్ హోమ్‍గా మార్చిన ఆ ఆసుపత్రిలోనె
కొడుకు కోడలు (స్పేషలిస్టులు) కూడ వచ్చి ప్రాక్టీసు చేస్తున్నారు.
ఆరోజు తండ్రి లేక పోవటముతో రాజ్‍కుమారే ఓ.పిలో మగ
పేషంట్లందరిని ఒక్కడే చూస్తున్నాడు.  ఓ పేషంట్ నీరసంగా
నడుస్తు వచ్చి డాక్టర్ పక్కనున్న స్టూల్ మీద కూలబడ్డడు.
వెంట ఓ ఆడమనిషి లోపలికి వచ్చింది.  చేతిలో ఓ ప్లాస్టిక్
సంచి, సంచిలో మందులు.  ఆ మందులన్ని డాక్ట్రర్ ముందున్న
టెబుల్ మీద గుమ్మరించింది.
"ఇంగొ సారు.  కడుపుల నొప్పంటే నిన్న గీ మందులు రాసిచ్చిండ్రు.
నొప్పింక ఎక్కువైందిగని తగ్గలే.  పొద్దుగాల నుండి ఏం తినలే.
కడుపుల మండుతుంది, ఒకారమని అంటుండు.  అస్సలే
లేస్తలేడు.  బల్మీటికి పట్టుకొచ్చిన".  ఆ ఆడామే మందులు
గుమ్మరిస్తు చెప్పింది.
వాళ్ళు పాత పేషంట్లేనని రాజ్‍కుమార్‍కు తెలుసు.  కుప్ప పోసిన
మందులు చూస్తు, "గీ మందులు వాడితె కడుపుల మంట రాదా?
ఓకారము కూడ వస్తది.  మందుల చిట్టేది?  ఎక్కడికి పోయినవ్?
ఎవ్వరాశిండ్రీ మందులు?  పోశాలుకు ముందె దమ్ముంది. గివన్ని
ఎట్ల రాశిండ్రు?" అడిగాడు.
ఈ మధ్య కాలంలో వీళ్లు ఒకసారి పక్క కొత్త డాక్టర్ దగ్గరకు వెళ్ళి
జబ్బు నయంగాక పోయేసరికి మళ్లి తన దగ్గర చూపించుకోవటము
గుర్తుంది.
"గప్పుడొక్కసారి మీరు లేకపోతె ఆపతికి రామారావ్ డాక్టర్ కాడికి
పోయినం.  ఎప్పుడు మీ కాడికే వస్తం.  నిన్న నాయనే మందులు
రాశిండు.  ఇయ్యాల నాయన లేడు కదా.  ఎప్పుడు మంచిగనే రాస్తడు.
నిన్న కూడ బరబర మండుతుంది, కడుపుల అవస్తుందనే వస్తిమి.
గిట్ల నొప్పి ఎక్కువయ్యె మందులు రాశిండేంది?"  ఏమి తెలియనట్టన్నా
కాస్త నిలదీసినట్టె అడిగింది రాజమ్మ.
రాజ్‍కుమార్ వెంటనే సర్దుకున్నడు. పోశాలును పరీక్ష చేస్తు
"మరి మందుల చిట్టేది? ఎక్కడ తీసుకున్నవ్ మందులు?"
మందులు చూస్తే వాళ్ళ షాప్‍వని అర్థమైనా అడిగాడు.
"మన షాపులనే సారు.  మనిషి నిన్నటి నుండి తినుడు లేదు.
మొస పోస్తున్నడు.  ఏటంటే అటె పడుతున్నడు.  ఇప్పుడైనా
సరిగ చూసి కరెస్ట్ మందులు రాయుండ్రి."   ముందు రాజ్‍కుమార్
అన్నమాటలతో నిన్న డాక్టర్ కరెక్ట్ మందులు రాయలేదని అనుమాన
పడ్డది రాజమ్మ.
డాక్ట్రర్ రాజ్‍కుమార్ తన తప్పు, ఆమె శ్లేష వెంటనే అర్థం చేసుకున్నడు.
"నిన్న అవస్థకు నాన్న ఈ మందులు బాగనే రాశినరు.  పోశాలుకే సరిగ
పడలేదు.  నేను ఇప్పుడు వేరే మందులు రాస్తా.  ఈ మందులు వాపసిచ్చి
కొత్తవి తీసుకో."  మందులు రాస్తు అన్నాడు
"ఏమో సారు.  ఎప్పుడు మీ కాడికే వస్తము.  గిన్ని ఏండ్ల బట్టి చూస్తున్నరు
మా గురించి మీకు బాగా తెలుసుని గీడికొస్తము.  మూడ్రోజుల బట్టి పనికి పోక
పాయె.  చేసుకుంటే బతికేటోళ్ళం.  మాకేట్లెళ్లాలే.  రానువోను ఆటో చార్జీలు
డబలాయె."   రాజమ్మ సాగదీసింది.
"ఇగో. నా దగ్గరున్నయని ఈ మందులుస్తున్నా.  కొత్త చిట్టిల మందులు రాస్తున్న.
రెండు రోజులు పెరుగన్నం పెట్టు.  మూడో నాడు తీస్కొని రా.  రవి, ఇక్కడ్రా.  ఈ
ఇంజెక్షన్ ఇచ్చి పంపు."  బైటె వున్న కంపౌండర్ను పిలిచి వెంటనే పోశాలును
రాజమ్మను బైటకు తీసుకెళ్లమని సైగ చేశాడు.  ఒక్క నిమిషము లేటైనా
రాజమ్మ అమాయకంగ అన్నట్టె అన్పించినా మరింత నిలదీసినట్టు
మాట్లాడుతుందని తెలుసు.
"రామ్మా, రా.  సూది ఇస్తను రా.  తొందరగ నొప్పి తగ్గుతది", పోశాలును చేయి
పట్టుకొని బైటకు నడిపిస్తు తీసుకెళ్ళాడు రవి.  మందుల చిట్టి డాక్టర్ దగ్గరి నుండి
తీసుకొని వెనకె నడిచింది రాజమ్మ గొనుక్కుంటు, "ఏం మందులో, ఏం రోగాలో".

                 **************************************

సుప్రీమ్ కోర్ట్ రెండెళ్ళ కంటె ఎక్కువ శిక్ష పడ్డ రాజకీయనాయకులు, జైల్లో
వున్న వాళ్ళను చట్ట సభలకు అనర్హులుగా చే్యాలని తీర్పునిచ్చింది.  దీనిని
అటకెక్కించడానికి కేంద్రప్రభుత్వము ఆర్డినెన్స్ జారి చేయబోతుంది.  ఉమ్మడిగా
పార్టీల పరంగా అందరు లోపాయకారిగ ఒప్పుకున్నా, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు
అభ్యంతరాలు తెలుపుతున్నారు.  కాంగ్రేసు పార్టీ తరఫునా కాబోయె ప్రధానిగ
ప్రచారములో వున్న రాహుల్ గాంధి వ్యక్తిగతంగా తను వ్యతిరేకమని, ఆ ఆర్డినెన్స్
కాగితాలు చింపేయాలని అన్నాడు.  ఈ రోజుల్లో ఎవరు ప్రభుత్వమో ఎవరు
ప్రతిపక్షమో అర్థమ్ కావటము చాలానే కష్టము.
ఓ పాత కాలం సామేత వుంది. "చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి సాని కొంపలు"
ప్రజలు వెంటనే ఏమనకున్నా ఎడ్దోళ్ళు, గుడ్డోళ్ళు కాదు.  సరైన సమయములో
సరైన నిర్ణయం తీసుకుంటరు.

Thursday, September 26, 2013

Andhra Polytricks

సీమాంధ్ర రాజకీయాలు
పాపం చంద్రబాబు.  వోటనుకుంటే వోటైంది.  రెండు కళ్ళన్నడు.
తెలంగాణకు వ్యతిరేకం కాదన్నడు.  తెలంగాణ ఇవ్వటములో
కాంగ్రేసు వెనుకాడుతుందని, దమ్ములేని కాంగ్రేసని అన్నడు.
ఏండ్లకొద్ది చర్చలు జరిగినా, తెలంగాణ ఇస్తె నాకేం అభ్యంతరం
లేదని చెప్పి, ఇప్పుడు కాంగ్రేసు తెలంగాణ ఇస్తామని ప్రకటించే
సరికి, సడెన్‍గా నిర్ణయిస్తె ఎట్లా, అందరిని - విద్యార్థులని, ఉద్యోగులను,
పిల్లలను, పెద్దలను, అయినోళ్ళను, కానోళ్లను అందరిని కూర్చో
బెట్టి మళ్ళి, మళ్ళి, మళ్ళి, మళ్ళి డిస్కషన్ల మీద డిస్కషన్లు ఎప్పటకి
పెట్టుకుంట వుండాలని విషయాన్ని సాగదీసుకుంట వుండాలని
చంద్రబాబు కోరిక.  అరవై ఏండ్ల తెలంగాణ ఉద్యమము ఏ మాత్రము
పట్టించుకోని బాబు, అసెంబ్లిలో తెలంగాణ పదము వాడొద్దన్న బాబు,
వేయిమంది కంటే ఎక్కువ మంది యువకులు ఆత్మహత్యలు  చేసుకున్నా,
చేసుకుంటున్నఐస్ కోల్డ్ గా వున్న నాయుడుబాబు ఆంధ్రాలో జరుగుతున్న
ఉద్యమానికి రోజులు, గంటలు లెక్కపెడుతు గుండెలు బాదుకుంటుండు.
అరవై ఏళ్ళ ప్రజా ఉద్యమానికి కేంద్రము దిగివచ్చి తెలంగాణా ఇస్తె, రోజుల
ఉద్యమానికి కేంద్రము స్పందించకపోవటము దారుణమని రెండు కళ్ళనిండ
నిప్పులు కురుస్తున్నడు.  ఆత్మగౌరవ యాత్రా అంటు బైలుదేరిండు.  ఆంధ్రోల్లు
తెలుగోళ్ళు, తెలంగానోళ్ళు తెలుగోళ్ళు కాదా?  వారికి గౌరవముండదా?  వారి
ఆకాంక్షలకు, ఆశలకు, హక్కులకు, ఉద్యమానికి, పోయిన/పోతున్న ప్రాణాలకు
విలువుండదా?
ఎంతో తెలివైనవాడివనుకుంటున్న ఓ నారా చంద్రబాబు నాయుడు ఎన్నిసార్ల్లు
ఎందరిని ఎన్నుపోటు పొడుస్తవు?  ఇకనైనా ఒక మాటకు కట్టుబడి వుండటము
నేర్చుకో.  జగన్ బెయిలు తీసుకొని జైలు బైటకు వచ్చినందుకు అప్సెట్ కాకు.
బెయిలేవచ్చింది.  కేసు ఇంక కొట్టేయ్యలేదు కదా.  కేసు నడుస్తునే వుంది కదా.
తెలివుంటే నీ చతురత ఉపయోగించు.  ఇప్పుడు ఆంధ్రాకు ఏం కావాలో, ఆంధ్రా
ప్రజలకు రావల్సిన కేంద్ర పాకేజిల గురించి ప్రజలను చైతన్యపరుస్తు, జై ఆంధ్ర
ఉద్యమమోళ్ళ్త్తతో కలిసి ముందుకు సాగితే కాస్తైనా లాభముంటుందేమో ఆలోచించు.

                            ****************************

పొమ్మనలేక పొగబెట్టిండ్రంటరు.  నల్లారి కిరణ్ కుమార రెడ్డి అట్లాగె చేస్తుండు.
ఆంధ్రాలో హీరో కావాలని నల్లారి వారి కోరికనుకుంట.  ఇష్టమోచ్చినట్టు
మాట్లాడి, కాంగ్రేసు అధిష్టానానికి కోపానికి తెప్పించి కాంగ్రేసు నుండి
బహిష్కరించ బడాలని కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టుంది.  అట్లా అయితె
"సమైక్యాంధ్ర కోసము నేను సి.ఎం. పదవి వదులుకున్నాను, నన్ను సి.ఎం.
చేసిన పార్టీనే వదులుకున్నాను" అని చెప్పుకోవాలని, అట్లా తను ఓ కొత్త
పార్టీ పెట్టి మళ్ళి సీమాంధ్ర సి.ఎం కావాలని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
ప్లాననుకుంటా. గుడ్‍లక్.

                     ************************************

జగన్‍కు బెయిలు రావటముతో రాజకీయ పార్టీలన్ని తమ స్ట్రాటజిని పున
రాలోచించుకోవల్సిన అవసరమేర్పడింది.  జగన్ బెయిలతో వారి కుటుంబ
సభ్యులు ఆనందపడటము, పార్టీ వారు గంతులెయ్యటము సహజమే. జగన్‍కు
బెయిల్ వచ్చింది కాని కేసునుండి అక్విట్ కాలేదు కదా.  వేరే పార్టీలు జగన్
బెయిల్ గురించి పట్టించుకోవల్సిన పని లేదనుకుంటా.  కేసు పూర్తి కావడానికి
ఎన్ని దశాబ్దాలు పడుతుందో! కాబట్టి చార్జిషీట్ ఫైల్ కావడము పూర్తి కాగానే
బెయిల్ రావటము తప్పదు కదా.  జగన్ పట్టుదలను మెచ్చుకోవాలి.  బెయిలు
కోసం ఎన్నిసార్ల్లు ప్రయత్నించాడో! మొత్తానికి సాధంచాడు.  అందుకే అంటారు
"Try, try, try again, never say die"

                   *****************************************

లోకసత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ తాను ఓ మేధావని, చాలా తెలివిగా
మాట్లాడుతానని, రాజకీయాలకు విలువలు తాను మాత్రమే నేర్పిస్తున్నాని తెగ
చెప్పుకుంటాడు.  పరిపాలన వికేంద్రికరణ గురించి ఒకప్పుడు తెగ లెక్చర్లు కూడ
దంచిండు.  తెలంగాణ విషయమోచ్చెసరికి విలువలన్ని మూటకట్టి మూసీలో పడె
సిండు.  ఆంధ్ర బుద్ధి, పక్షపాత బుద్ధి, స్వార్థ ప్రయోజనాలకే పెద్ద పీట వేసి తాను
కూడ నేటి తరం రాజకీయనాయకుడని నిరూపించుకున్నడు.  మాటలేన్ని మాట్లా
డిన చేతలు మనిషి అసలు గుణాన్ని బైటపెడుతయి.  

Ganesh Immersion

వినాయక నిమజ్జనము
వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.  ఈ సారి దీనికి ఓ
కొత్త పదం వాడినరు.  ‘విసర్జన్’ అని అన్నారు.  విసర్జనమంటె
నాకు నచ్చలేదు.  నిమజ్జనమంటేనే బాగుంది.  పరిస్థితి అదే
అయినా, అర్థము దాదాపు అదే అయినా అన్ని రోజులు పూజలు
చేసిన వినాయకుడిని విసర్జించినమనే కంటే నీటిలో నిమజ్జనం
చేసినమనుడె గౌరవప్రదంగా అనిపిస్తుంది.
దాదుపు 60,000 వినాయకులను జంటనగారల్లో పెట్టారట.  అవే
కాక ఇండ్లల్ల పెట్టిన చిట్టి పొట్టి వినాయకులు ఎన్నిలక్షలో. ఇన్ని
వినాయకులను హుస్సేన్‍సాగర్‍లో వేస్తె ఆ చెరువేం కావాలి.  ఇప్పటికే
అది చెత్తచెదారము, మురికినీళ్లు పనికిరాని నీటిమొక్కలతో సగం
కూడుక పోయింది.  నా చిన్నప్పుడు ఆ చెరువు ఆవలి గట్టు కనిపించేది
కాదు.  ఇప్పుడైతె ఆమడ దూరములో బిల్డింగులే బిల్డింగులు. ఆ
మురికి వాసన పీలుస్తు ఆ బిల్డింగ్గుల్లో జనాలుంటున్నారంటే నాకైతె
ఆశ్చర్యమే.  వాళ్లకు దమ్ము బీమారులేమి రావా?
అప్పుడెప్పుడో చాలా ఏండ్ల కింద బాల గంగాధర్ తిలక్ బిటిష్ వారికి
వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటము చేస్తు, దేశ ప్రజలో జాతీయత భావాన్ని
పెంచేందుకు ఈ వినాయక ఉత్సవాలు మొదలు పెట్టాడు. ఆ వారసత్వము
అట్లనే నడుస్తుంది.  అది ఇప్పుడు పర్యావరణానికే మోసం తెస్తుంది.  ఇప్పుడు
గల్లి గల్లికో విగ్రహాన్ని పెట్టి, మైకులు పట్టి జనాలను అదరగొడుతున్నారు. పెద్ద
పెద్ద పందిళ్ళు, వాటికి లైట్లతో అలంకరణలు,  వాడ పొడుగుతా బోలెడు వరసల్లో
సీరియల్ లైట్లు, అమ్మో రాను రాను, అన్ని పెరిగి దానితో పాటు చందాల దందా
విపరీతంగా పెరుగుతుంది.  వినాయకుని లడ్డు కూడ వో పెద్ద బిజినెస్ అయితుందని
పిస్తుంది.  మొన్న 12లక్షల లడ్డు చెరువులో పడెశారంటే చాలానే బాధనిపించింది.
మన దెశములో సగానికి సగమంది పిల్లలు పౌష్టికాహారలోపంతో అనారోగ్యం పాలౌతు
న్నరు.  తిండి లేక చనిపోయెవాళ్ళు వున్నరు.  అంత డబ్బుతో కొన్ని అనాధ శరణా
లయాల్లో ఎంతో మందికి కొద్ది రోజులు తిండి పెట్టొచ్చు కదా.
ప్రతి ఏడు ఇన్నిన్ని విగ్రహాలు చేసి వాటిని నిమజ్జనం చేసి ప్రకృతిని నాశనము చేసేకంటే
గుడిలో వుండె వినాయకుడికి పూజలు చేసి, అక్కడె ఆ తొమ్మిది రోజులు
జాతీయత,పర్యావరణపై అవగాహన పెంపొందించె రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు
చేస్తె బాగుండదా?  వినాయకుడిని పూజించె అన్ని రకాల ఫలము, పత్రి, పుష్పము,
వాటి ఉపయోగాలు, ఆరోగ్యవిలువల గురించి అందరికి అవగాహన కలిగించవచ్చు.
ప్రతి ఊళ్ళొ గుడి వుంటుంది.  ప్రతి బస్తీలో, వాడలో గుడి వుంటుంది.
ప్రతి ఇంట్లో వినాయక విగ్రహము కాని పటము కాని ఉంటుంది.  ఇంట్లో పూజలు ఎట్లాగు
చేస్తరు.  ఆ తరువాత పండగ నాడు చాలా మందె గుడికి వెళ్తారు.  గుడిలో కార్యక్రమాలలో
విజేతలకు బహుమతులివ్వటము, తరువాత మండల స్థాయి, రాష్ట్రస్థాయి పోటీలు పెట్టి
అఖరు నాడు వారికి బహుమతులివ్వటము జాతి భావము కలిగిస్తుంది కద.
పెద్దలంతా కూర్చొని ఏదొ ఆలోచించి పర్యావరణ పాడవకుండా, సంస్కృతిని కాపాడుకుంటు
ముందుకు పోయే విధానము ఆలోచించాలి.  ఛాందస భావలతో భావితరాల భవితకు
విఘాతము కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

APNGO - Leader

గారడి
అశోక్ బాబు ఎం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదనుకుంటా.
ఆయన ఎట్లా ఉద్యమము తెర మీదికొచ్చిండో మర్చిపోయినట్టుండు.
వాపు చూసి బలుపనుకుంటుండు.  జనం అంతా తన మాటా వినే
వస్తున్నడునుకుంటుండు.  అదివరకున్న జేఏసీ చైర్మెన్ ప్రోఫెసర్
సామ్యూల్‍ను ఎవరు ఎందుకు కనుమరుగు చేసినరో?  కొత్తగా  వచ్చిన
ఈ ఆశోక్ బాబును కూడా రాజకీయనాయకులు తలచుకుంటె అతాపతా
లేకుండా చేయగలరు.  ఆశోక్ బాబు తెలంగాణలో ఉద్యోగం చేస్తుండు,
రిటైర్ అయి హైద్రబాదులోనే సెటెల్ కావాలనుకుంటే కాస్త ఒళ్ళు దగ్గర
పెట్టుకొని మాట్లాడాలి.  తెలంగాణ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి.  కొత్త
బిచ్చగాడు పొద్దేరుగడన్నట్టు, కొత్తగా వచ్చిన మాస్ ఫాలోయింగ్ చూసి
అది రాజకీయనాయకుల గారడని మరిచిపోయి, నిజమనుకొని, జోష్‍లో
హోష్ లేకుండా మాట్లాడుతున్నడు.
తెలంగాణ ప్రజలు అసలు ఎప్పటినుండో ఆంధ్రావాళ్ల బిజినెస్‍లు నడవకుండా
సహాయనిరాకరణ చేయలనుకున్నరు.  ఏఏ బిజినెస్‍లు ఎవరివొ, వారి ఉత్పత్తులు
ఏంటివో వాటి లిస్ట్ కూడ చేయదల్చుకుంటే కేసిఆర్ వద్దన్నరని అది ఆగి
పోయింది.  లేకపోతె  చాలా మంది ఆంధ్రోల్ల బిజినెస్‍లు మూత పడేవి.  ఇప్పుడు
ఈ ఆశోక్ బాబు అన్న మాటలకు తెలంగాణ వాళ్ళు పట్టించుకొని అది ఆచరణలో
పెట్టి చూపిస్తరు.  తెలంగాణ వాళ్లకు ఆ భావము ముందే వుంది.  ఇప్పుడు
అది ఆచరణలోకి వస్తుంది.  ఆంధ్రోళ్ళు బిజినెస్‍లు మూసుకొని పోయె రోజులు
దగ్గర్లోనే వుంది.

Fogsi -Figo 2013 - Hyderabad

మాతృత్వ పరిరక్షణ
ఈ మధ్యే హైద్రబాదు - హైటెక్ సిటీలో ఫాగ్సి-ఫిగో కాన్ఫరెన్స్
జరిగింది.  స్త్రీల ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు, కాన్పు, మాతృ
శిశుమరణాల గురించి, వాటిని ఎట్లా తగ్గించటము గురించి దేశవిదేశాల
నుండి ప్రముఖ వైద్యనిపుణులు మాట్లాడినరు.  అభివృద్ధి పొందిన
దేశాలతో పోలిస్తె అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాతృ మరణాలు
శిశు మరణాలు చాల ఎక్కువ.  ప్రపంచ వ్యాప్తంగా నిముషానికి
ఒక స్త్రీ గర్భధారణ, కాన్పు కారణంగా మరణిస్తుంటె, అందులో
90% అభివృద్ది చెందుతున్న దేశాల్లో జరుగుతున్నాయి.  ఈ
మరణాలు శ్రీలంక, బంగ్లాదేశ్‍తో పోలిస్తే మన దేశములో ఎక్కువ
అంటె మన మంతా సిగ్గు పడాల్సిన విషయం.
ఈ మరణాలు తగ్గించటానికి కొన్ని జాగ్రత్తలు అందరు పాటిస్తె చాలు.
ముఖ్యమైనవి
-యుక్త వయస్సు వచ్చాకె పెళ్లి
-20 ఏళ్ళ తరువాతే తొలి కాన్పు
-గర్భవతి కాకముందే ఆరోగ్య పరీక్షలు చేసుకొని తగు జాగ్రత్తలు
తీసుకోవటము
-గర్భవతి అయ్యాక కనీసంగా నాలుగు సార్ల్లు నెల పరీక్షలు చేసుకోవటం
-కనీసంగా వంద రోజులు ఇనుము (ఐరన్) మాత్రలు వాడటం
-రెండు నెలసూదులు (టి.టి ఇన్‍జెక్షన్) వేసుకోవటం
-కాన్పు తప్పనిసరిగ ఆసుపత్రిలోనే కావటము
-కన్న మరుక్షణమునుండి ఆరు నెలల వరకు తల్లిపాలే ఇవ్వటం
-కన్నాక మూడో నెలనుండి మళ్లి మూడునాలుగేళ్ల వరకు గర్భము 
రాకుండా గర్భనిరోధక పద్ధతులు వాడటం
-పిల్లలకు అన్నిటీకాలు తప్పనిసరిగా వేయించటం
ఇవన్ని పాటిస్తు పరిశుభ్రత, పౌష్టికాహారము తీసుకుంటే మాతా శిశు
మరణాలు చాలాచాలా తగ్గిపోతాయి.  కాన్పు పునర్జన్మ కాదు, కోరుకున్నా
మహత్తర ఘట్టంగా సంతోషాన్ని ఇస్తుంది.

Tuesday, September 10, 2013

News - Views

షేవ్ ఆంధ్ర ప్రదేశ్ 
తెలంగాణలో తెలంగాణ వాళ్ళు సభ పెట్టుకున్నా, ఆంధ్రోళ్ళు
సభ పెట్టుకున్నాలాఠీలు విరగటము, భాష్ప వాయుగోలాలు
పేలటము తెలంగాణ పిల్లల మీదనే.  ఇది ఆంధ్రోళ్ళ ప్రభుత్వం.
సీమాంధ్రులు ఏం జేసినా, మీ పీకలు తెగ్గోస్తామని తెలంగాణ
పిల్లలను బెదిరించిన, వారికే ఫుల్లు రక్షణ.
‘సేవ్ ఆంధ్ర ప్రదేశ్’ సభలో తెలంగాణ వారికి చోటు లేదు.  ‘కలసి
వుంటే కలదు సుఖమ’నేవాళ్ళ సభలో వున్న ఒక్క తెలంగాణ
వ్యక్తిని కుర్చీలతో కొట్టి తరిమేశిండ్రు.  వాళ్లకు బందొబస్తుకు వచ్చిన
పోలీసు కానస్టేబుల్ శ్రీనివాస్ గౌడును తోటి ఆంధ్ర పోలీసులు,
అన్నదమ్ముల్లా కలిసుందామనేటోళ్ళు, గుమ్ముగూడి ఒక్కడిని
ఇష్టమోచిన్నట్టు కొట్టిండ్రు.  మాయం జెద్దామ్నుకున్నరేమోని డౌటు.
కాని ప్రపంచమంతా ఆ దృశ్యము చూసింది కాబట్టి ఆ బిడ్డను వదిలేసినరు.
విద్యార్థి బదులు టీచరె పరీక్ష రాసినంక ఫర్స్ట్ క్లాసు వస్తె ఎంత గొప్పగ
చెప్పుకుంటారో అట్ల ఏపి ఎన్జివో నేత ఖుషి ఖుషిగా సభ సక్సెస్ అయిందని
చెప్పుకుంటుండు.  ‘నియమాలు వున్నదే ఉల్లంఘించటాని్కే’ అన్న ఆశోక్
బాబు అది మొన్నటి సభలో చేతల్లో నిరూపించిండు.  మహామహా మేధావులు
కూడా మాకు మద్దతు ఇస్తున్నారని చెప్పడానికేమో, చలసాని శ్రీనివాస్‍ను
వేదిక మీద దిష్టి బొమ్మలా వుండటానికి కూర్చోబెట్టిండు.  చలసానికి కాస్తైన
సిగ్గు శరముంటే ఇంకోసారి ఏపి ఎన్జివోల ఇలాంటి సభలకు దూరముంటాడను
కుంటా.
సభలో అంతా ఎప్పటిలాగె తెలంగాణ వేరైతె మా బతుకులు బండలే అని,
తెలంగాణ మీద వాళ్ళు ఇన్నాళ్ళు ఎంత ఆధారపడి వున్నారో తెలపటము,
వాళ్ళు ఇన్నాళ్ళు తెలంగాణను అన్ని విధాలా దోపిడి చేస్తున్నారని చెప్పకనే
చెప్పినరు.  ఈ సభలో ప్రత్యెక ఆకర్షణ కైకాశుర్పణఖే.  ఎప్పడిదో ఓ మాట పట్టుకొని,
చెప్పుడు మాటలకు, భరతుడుని రాజు చేయమనుడె కాక రాముడు పదునాలుగేండ్లు
వనవాసానికి వెళ్లాలని కోరింది కైకేయి .  రామలక్షమణులు వివాహితులని
తెలిసికూడ వారి పై కోరికను పెంచుకొని కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది
శూర్పనఖ.  ఇప్పటి  ఈ కైకాశూర్పనఖకు తెలంగాణ చరిత్ర, ఆ ప్రజల ఆవేదన అవసరము
లేదు.  ఆమే ప్రాంతం బిడ్డల కడుపు నిండుతే చాలు.  వెయ్యిమంది కంటె ఎక్కువ
తెలంగాణ బిడ్డలు చనిపోతె ఆ తల్లికి అవసరము లేదు.  తల్లికి  దుర్మార్గుడైనా
సొంత కొడుకు ఒక పూట ఆకలిగా వుంటే గుండె తల్లడిల్లుతుంది కాని సవతి కొడుకు
ధర్మాత్ముడై తన కుటుంబాన్ని పోషిస్తు తాను మాత్రము ఆకలితో అలమంటించి
చనిపోతె అదివాడి ‘ఖర్మ’ అని మూతివిరుస్తుంది.  ఈ కైకాశుర్పనఖకు బతుకు విలువ,
బతుకమ్మ విలువ తెలుసా?  తెలంగాణ ప్రజలు నెత్తిన పెట్టుకొని పూజించే బతుకమ్మని
తాన్నెన్నడైనా చేతిలో పట్టుకుందా? మాటల గారడి కాదు, సత్యము పలుకు తల్లి.
ఆ పాటగాడు మహా గ్రేటట!  గిన్నిస్ రికార్డూ వుందటా!  ఈ దేశములోనే పుట్టి పెరిగాడు.
కాని జాతీయగీతము మాత్రము పాడటం చేతకాదట.  ఇది ఆంధ్రోళ్ళ   గొప్పతనం!

Monday, September 9, 2013

Ganesh Chaviti

జై గణేశా
శ్రీ గణేశ, జయ గణేశ
జయ జయ విఘ్నేశ
మా  విఘ్నాలే తొలగించి
విజయాన్నే అందించు 
వరసిద్ధి వినాయక!

Friday, September 6, 2013

News - Views

ఏపి సభ - కుతంత్రాల రభస 
"రేపటి గురించి అందరు ఒకటె టెన్షన్ పడుతున్నారు కదా."
"అవును.  ఏమైతది?  ఆంధ్ర గౌర్నమెంట్, ఆంధ్రో్ల్లకే సపోర్ట్
ఇస్తారు కద.  తెలంగాన లీడర్స్ అందరిని అరెస్ట్ చేసో, మరేదో
చేసి ఆ సభ గ్రాండ్ సక్సేస్ చెస్తర్లే."
"అది సక్సెస్ అయినంత మాత్రాన తెలంగాన అగుతదా. ఏండ్ల
తరబడి నాన్చి, నాన్చి ఇప్పుడేదో ఓ నిర్ణయం ప్రకటిస్తె ఎంత
గొడవ చేస్తున్నరు.  వాళ్లే అక్కడకు వెళ్లిన వాళ్ల మీద దాడులు
చెస్తున్నరు, ఇక్కడేమో ప్రభుత్వమండ చూసుకొని మేము ఏం
చేసినా నోర్మూసుకోండి. లేకపోతే తెలంగాన రాకుండ అడ్డుకుంటం,
ఇంక ఇరవై ఐదేండ్లైనా తెలంగాన రానివ్వమి బెదిరిస్తున్నరు.
ఇసుంటోల్లు వుంటరనే రాజ్యాంగంలో అర్టికల్ 3 పెట్టిండ్రు కదా."
"కాని మన నేల మీద మనకు వ్యతిరేకంగా కార్యక్రమము బాధ
అనిపిస్తది కదా. "
"ఇంకా ఏపిగానే వుంది కద.  అందుకే వాళ్ల ఆధిపత్యం.  అరవై
ఏండ్ల కొట్లాట ముంది ఈ ముప్పై రోజల అల్లరి ఏం పనికొస్తది?
పిల్లలు అసలే నిరాశ పడొద్దు.  మనకు దమ్ముంది, ధైర్యముంది,
సహనముంది.  న్యాయం, ధర్మం మనతో వుంది.  ఎప్పటికైన
గెలుపు ధర్మము, న్యాయానిదే కద!"
"వాళ్ల అల్లరి, దౌర్జన్యము, దానికి ప్రభుత్వం సపోర్ట్ చూస్తుంటే
టెన్షెన్తొ నాకైతె హార్ట్ అట్టాక్ వస్తదేమో అనిపిస్తుంది."
"చాల్లే.  అట్లా మాట్లాడకు.  మన కోదండరామ్ గారిలా  
కూల్‍గా వుండి పని సాధించుకోవాల.
తెలంగాన ఎట్లాగన్న వస్తుంది.  కాని ఈ గొడవల వల్ల విడిపోయినంక
మనము కలిసి వుండేట్లు లేదు.  ఇన్నాల్లు ఆంధ్ర - తెలంగాన వాళ్ళు
చుట్టారికాలు కల్పుకునేటోనేళ్ళు.  నేతల వల్లనో, దోపిడి దారులవల్లనో
ప్రస్తుతము అల్లరులు అయితున్నా దీని ప్రభావము సామాన్య ప్రజల
మీద పడుతుంది.  ముందే తెలంగాన వాల్లకు ఆంధ్రోల్లంటే అనుమానము,
బాగా ఉషారోల్లని, మోసగాల్లని.  ఇప్పుడు జరిగేది చూస్తున్న వాళ్ళు లౌ
మారెజి అయితె తప్ప మాములుగ పిల్లలను ఇచ్చి పుచ్చుకోవడము చాలా
చాల తగ్గిపోతది."
"ఈ నాయకులు కాస్త తెలివిదెచ్చుకొని ప్రజలను రెచ్చగొట్టుడు మానేస్తె బాగుండు.
ఈ అల్లరులు చల్లారాలంటే కేంద్రము తొందరగ తెలంగాన బిల్లు పార్లమెంటులో
పెట్టెస్తె పనైపొతది.  పనిలోపని రాష్ట్రపతి పాలన విధిస్తె అంత సక్కగైతరు."
"చూద్దాం ఎం జరుగుతుందో?"

Wednesday, September 4, 2013

News - Views

వరకట్నాగ్నికి గంటకు ఒక స్త్రీ బలవుంతుదని నివేదికలు
చెపుతున్నాయి.  ఎన్నాళ్ళు స్త్రీలు ఇలా బలికావాలి?  ఉన్న
చట్టాలను సక్రమంగా అమలు పరిస్తె, న్యాయము సకాలములో
అందితె ఇవి ఆగిపోక తప్పదు.  కావలిసింది ప్రభుత్వానికి చిత్తశుద్ధి,
ప్రజలలో చైతన్యము, స్త్రీ పురుషుల్లో మానవులనె సమభావము.
స్త్రీలు విద్యావంతులై, అర్థిక స్వావలంబన, ఆత్మస్థైర్యము పెంపొందించు
కుంటే వారి జీవతములో కష్టాలను ఎదుర్కొని నిబ్బరంగా బతకగలరు.
ఎవరి జీవతములో వారె నాయకులు, ఇతరులు వస్తారు, పోతారు.  ఈ
జీవతము ఏ ఒక్కరి కోసము కాదు.  తన కోసం.  తన కలలు తీర్చుకునే
కోసం.  అందుకు తానే కష్టించి సాధించాలని తెలుసుకొని, ధైర్యముతో,
స్థైర్యముతో అఖరి ఊపిరి వరకు ముందుకు సాగె కోసం.
వరకట్న చావుల గురించి విన్నప్పుడు 1994, అక్టోబర్‍లో రాసినదానిని
ఇప్పుడు ఈ బ్లాగ్‍లో పెడుతున్నాను.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బాధలు లేని బతుకు ఉయ్యాలో /బతుకమ్మ/

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
కన్నవారింట బతుకు ఉయ్యాలో
ఆనందాల విరిజల్లులె ఉయ్యాలో /బతుకమ్మ/

కన్నెపిల్ల కనె కలలు ఉయ్యాలో
కమ్మని కలలే ఉయ్యాలో
కన్నవారు కడుమురిపెంగా ఉయ్యాలో
కోరుకున్నవాడితో ముడి పెట్టిరి ఉయ్యాలో /బతుకమ్మ/

కట్టుకున్న వాడు ఉయ్యాలో
కఠినాత్ముడాయె ఉయ్యాలో
కట్నాల కాంక్షలో ఉయ్యాలో
కాంతనే కష్టపెట్టే ఉయ్యాలో /బతుకమ్మ/

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకే ఉయ్యాలో
భారమై పోయె ఉయ్యాలో /బతుకమ్మ/

కాసులు తెమ్మని ఉయ్యాలో
కన్నవారింటికి తరిమె ఉయ్యాలో
తేలెని ఆ తల్లిని ఉయ్యాలో
చేతులార తగులబెట్టే ఉయ్యాలో /బతుకమ్మ/

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకె ఉయ్యాలో
బుగ్గిపాలాయె ఉయ్యాలో /బతుకమ్మ/

కలలు కనే ఈడులో ఉయ్యాలో
కాటికే తరలి వెళ్ళే ఉయ్యాలో
కల్సి బతక వచ్చిన పడతిని ఉయ్యాలో
మట్టుబెట్టి మన్నులో కలిపారె ఉయ్యాలో /బతుకమ్మ/

ఈ కథ మారెదెప్పుడె ఉయ్యాలో
తరుణుల తలరాత మారెదెప్పుడు ఉయ్యాలో
అతివలు చదువునేర్చి ఉయ్యాలో
ఆత్మస్థైర్యముతొ మెదలాలె ఉయ్యాలో /బతుకమ్మ/

బతుకమ్మబతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
ఆర్థిక స్వావలంబన ఉయ్యాలో
అబలను సబల చేయును ఉయ్యాలో /బతుకమ్మ/

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బంగారు భవిష్యత్తుకు ఉయ్యాలో
ఆలోచనతో అడుగువెయ్యాలె ఉయ్యాలో /బతుకమ్మ/

స్త్రీ పురుషులు కల్సి ఉయ్యాలో
సమైక్యతతో మెదిలితె ఉయ్యాలో
సుఖశాంతులతో బతుకు ఉయ్యాలో
తీయని పాటగా సాగును ఉయ్యాలో/బతుకమ్మ/

Sunday, September 1, 2013

News - Views

ఆంధ్ర బాబూ - అవకాశ యాత్ర
పాపం, ఎర్రబెల్లి దయాకర్‍రావ్! చంద్రబాబు తెలంగాణకు
అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చాడు కాబట్టి తెదేపా
తెలంగాణలో గెలుస్తుందని, తానే తెలంగాణలో చెప్పుకోదగ్గ
నాయకుడనని, దేవుడు దయదలిస్తె చీఫ్ మినిస్టర్‍ కావచ్చని
ఆశ పెట్టుకున్నాడు.  ఇప్పుడు చంద్రబాబు యాత్రతో అది కాస్తా
తుస్సుమన్నది.  టిటిడీపి నాయకులంతా ప్రస్తుతానికి అండర్
గ్రౌండ్ పోయినా రెపో, ఎళ్లుండో ఏమి చెప్పుతారో చూడాలి.
చంద్రబాబు ‘తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర’ అని పేరు బదులు
‘ఆంధ్రుల ఆత్మగౌరావ యాత్ర’ అని పెట్టుకొని వుంటె బాగుండేది.
తెలంగాణ ప్రజలంతా రోడ్ల మీదికి వచ్చి ఏండ్ల కొద్ది ఉద్యమము
చేసినా, నెలల తరబడి విద్యాసంస్థలు బందువున్నా, ఉద్యోగస్తులు
ఆరువారాలు విధులు బంద్ చేసి ఉద్యమము చేస్తున్నా, పొలీసులు
తెలంగాణ ఉద్యమకారులపై దౌర్జన్యము చేస్తున్నా, అరెస్టులు చేసి
హింసిస్తున్నా, తెలంగాణ యువకులు భావోద్వేగాలకు లోనై ఆత్మహత్యలు
చేసుకున్నాచంద్రబాబు ఏ మాత్రము స్పందించలేదు.  ప్రతిపక్ష నేతగా
శాసనసభలోరాష్ట్ర పరిస్థితుల గురించి, తెలంగాణలో జరుగుతున్న ప్రజా
ఉద్యమము గురించి ప్రభుత్వాన్ని ఒక్కనాడు నిలదీయలేదు.  అంతేకాదు
ప్రతి పక్షాలు అవిశ్వాస తీర్మానము పెడితె ప్రభుత్వము పడకుండా పూర్తి
మద్దతు కూడ ఇచ్చాడు.  సీమాంధ్ర, తెలంగాణ రెండు కళ్ళన్నా ఆయన
తెలంగాణ కన్ను పూర్తిగా గుడ్డిదైంది.  ఉన్న ఒక కన్నుమెల్లేమో, దానికి
సెలెక్టివగా సీమాంధ్రమాత్రమే కనబడ్తది.  తెలంగాణ ఉద్యమము తీవ్రముగా
ఉన్నన్ని రోజులు విదేశాలలో టూర్లు కొట్టుకుంటు వుండటమో,  మరేదొ
వంకన సీమాంధ్రలోకాలం గడిపేటోడు.  ఎలాంటి స్పందన లేకుండా కూల్‍గా
ఏ ఫ్రీజర్‍లో వుండేవాడో!  తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్లని అస్సలే గుర్తుకు
రాదు.
కాని, సీమాంధ్రలో ఎమైనా అయితుంటె ఈ రెండు కళ్ళ ఓ గుడ్డి కన్ను, ఓ
మెల్లకన్ను ఆంధ్రబాబు హృదయము దడ,దడ కొట్టుకుంటుంది.  ఉరికి పోయి
అక్కడవాళ్లకు అండగా నిలబడుతాడు.  కేంద్రానికి రాష్ట్ర పరిస్థ్తితుల గురించి
అత్యంత అవేదనతో ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తాడు.  ఆంధ్రోల్ల బాధ ప్రపంచ
బాధగ ఫీలౌతాడు.  ఇంట్లో కాలు నిలవదు.  మేధావులతోటి, మీడియోల్లతోటి,
వాళ్ళతోటి, వీళ్ళతోటి మీటింగుల మీద మీటింగులు పెట్ట్టి మేధోమథనము చేస్తాడు.
ప్రజలే నా జీవతము, మీరు లేకపోతే నేను లేనని మీమధ్యలోనే నా జీవతమని
యాత్రలు మొదలు పెడ్తాడు.  తెలుగుజాతని దానికొ కలరిస్తాడు.  అంతకంటే
ఆంధ్ర జాతంటె కరెక్ట్ గా సరిపోతుంది.  తెలంగాణలో ప్రజలు తెలుగువారైతె
ఆయన అప్పుడెందుకు స్పందించలేదు?  తెలుగు భాష ఒక్కటనుకున్న
ఆంధ్ర తెలుగు వేరు, తెలంగాణ తెలుగు వేరు - అమెరికన ఇంగ్లషు, బ్రిటన్
ఇంగ్లీష్ వేరైనట్టు.
ఈ యాత్రకు తెలుగు ఆత్మగౌరవయాత్రంటె ఎవరు నమ్మరు కాని, ఆంధ్ర ఆత్మ
గౌరవయాత్రా అని పెట్టుకుంటే బాబు గారికి కనీసము ఆంధ్రలో అతనిపట్ల
అభిమానము ఎక్కువై అది ఓట్లై అధికారాన్ని పొందొచ్చు.