Thursday, September 26, 2013

Fogsi -Figo 2013 - Hyderabad

మాతృత్వ పరిరక్షణ
ఈ మధ్యే హైద్రబాదు - హైటెక్ సిటీలో ఫాగ్సి-ఫిగో కాన్ఫరెన్స్
జరిగింది.  స్త్రీల ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు, కాన్పు, మాతృ
శిశుమరణాల గురించి, వాటిని ఎట్లా తగ్గించటము గురించి దేశవిదేశాల
నుండి ప్రముఖ వైద్యనిపుణులు మాట్లాడినరు.  అభివృద్ధి పొందిన
దేశాలతో పోలిస్తె అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాతృ మరణాలు
శిశు మరణాలు చాల ఎక్కువ.  ప్రపంచ వ్యాప్తంగా నిముషానికి
ఒక స్త్రీ గర్భధారణ, కాన్పు కారణంగా మరణిస్తుంటె, అందులో
90% అభివృద్ది చెందుతున్న దేశాల్లో జరుగుతున్నాయి.  ఈ
మరణాలు శ్రీలంక, బంగ్లాదేశ్‍తో పోలిస్తే మన దేశములో ఎక్కువ
అంటె మన మంతా సిగ్గు పడాల్సిన విషయం.
ఈ మరణాలు తగ్గించటానికి కొన్ని జాగ్రత్తలు అందరు పాటిస్తె చాలు.
ముఖ్యమైనవి
-యుక్త వయస్సు వచ్చాకె పెళ్లి
-20 ఏళ్ళ తరువాతే తొలి కాన్పు
-గర్భవతి కాకముందే ఆరోగ్య పరీక్షలు చేసుకొని తగు జాగ్రత్తలు
తీసుకోవటము
-గర్భవతి అయ్యాక కనీసంగా నాలుగు సార్ల్లు నెల పరీక్షలు చేసుకోవటం
-కనీసంగా వంద రోజులు ఇనుము (ఐరన్) మాత్రలు వాడటం
-రెండు నెలసూదులు (టి.టి ఇన్‍జెక్షన్) వేసుకోవటం
-కాన్పు తప్పనిసరిగ ఆసుపత్రిలోనే కావటము
-కన్న మరుక్షణమునుండి ఆరు నెలల వరకు తల్లిపాలే ఇవ్వటం
-కన్నాక మూడో నెలనుండి మళ్లి మూడునాలుగేళ్ల వరకు గర్భము 
రాకుండా గర్భనిరోధక పద్ధతులు వాడటం
-పిల్లలకు అన్నిటీకాలు తప్పనిసరిగా వేయించటం
ఇవన్ని పాటిస్తు పరిశుభ్రత, పౌష్టికాహారము తీసుకుంటే మాతా శిశు
మరణాలు చాలాచాలా తగ్గిపోతాయి.  కాన్పు పునర్జన్మ కాదు, కోరుకున్నా
మహత్తర ఘట్టంగా సంతోషాన్ని ఇస్తుంది.

No comments:

Post a Comment