Thursday, September 26, 2013

APNGO - Leader

గారడి
అశోక్ బాబు ఎం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదనుకుంటా.
ఆయన ఎట్లా ఉద్యమము తెర మీదికొచ్చిండో మర్చిపోయినట్టుండు.
వాపు చూసి బలుపనుకుంటుండు.  జనం అంతా తన మాటా వినే
వస్తున్నడునుకుంటుండు.  అదివరకున్న జేఏసీ చైర్మెన్ ప్రోఫెసర్
సామ్యూల్‍ను ఎవరు ఎందుకు కనుమరుగు చేసినరో?  కొత్తగా  వచ్చిన
ఈ ఆశోక్ బాబును కూడా రాజకీయనాయకులు తలచుకుంటె అతాపతా
లేకుండా చేయగలరు.  ఆశోక్ బాబు తెలంగాణలో ఉద్యోగం చేస్తుండు,
రిటైర్ అయి హైద్రబాదులోనే సెటెల్ కావాలనుకుంటే కాస్త ఒళ్ళు దగ్గర
పెట్టుకొని మాట్లాడాలి.  తెలంగాణ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి.  కొత్త
బిచ్చగాడు పొద్దేరుగడన్నట్టు, కొత్తగా వచ్చిన మాస్ ఫాలోయింగ్ చూసి
అది రాజకీయనాయకుల గారడని మరిచిపోయి, నిజమనుకొని, జోష్‍లో
హోష్ లేకుండా మాట్లాడుతున్నడు.
తెలంగాణ ప్రజలు అసలు ఎప్పటినుండో ఆంధ్రావాళ్ల బిజినెస్‍లు నడవకుండా
సహాయనిరాకరణ చేయలనుకున్నరు.  ఏఏ బిజినెస్‍లు ఎవరివొ, వారి ఉత్పత్తులు
ఏంటివో వాటి లిస్ట్ కూడ చేయదల్చుకుంటే కేసిఆర్ వద్దన్నరని అది ఆగి
పోయింది.  లేకపోతె  చాలా మంది ఆంధ్రోల్ల బిజినెస్‍లు మూత పడేవి.  ఇప్పుడు
ఈ ఆశోక్ బాబు అన్న మాటలకు తెలంగాణ వాళ్ళు పట్టించుకొని అది ఆచరణలో
పెట్టి చూపిస్తరు.  తెలంగాణ వాళ్లకు ఆ భావము ముందే వుంది.  ఇప్పుడు
అది ఆచరణలోకి వస్తుంది.  ఆంధ్రోళ్ళు బిజినెస్‍లు మూసుకొని పోయె రోజులు
దగ్గర్లోనే వుంది.

No comments:

Post a Comment