Saturday, August 10, 2013

Andhra Junta

తెలుగు జాతి - ఆంధ్రుల అహంకారం 
ఇది ఆంధ్రోళ్ళ పట్టుదల అనుకోవాలా?  లేక వాళ్ళ దురహంకార
దౌర్జన్యమనుకోవాలా?  తెలుగు జాతి మీద ప్రేమ మాత్రం
అస్సలే కాదు.  తెలుగుజాతి అని జాతి మీద ప్రేమ వుంటె ఆంధ్ర
రాష్ట్రమును తెలంగాణతో కలిపినప్పుడు జరిగిన ఒప్పందాలకు
కట్టుబడి వుండేవారు.  అట్లా వుండుంటే `69 లో తెలంగాణ ఉద్య
మము వచ్చేది కాదు.  ఆ తరువాతైనా తెలంగాణ వాళ్ళకు అన్యా
యము జరుగుతుందని నిర్ద్దారించి పట్టుకొచ్చిన పథకాలు కాని,
సూత్రాలు కాని సక్రమంగా అమలుపరచినా మళ్ళి తెలంగాణ
ఉద్యమము వచ్చేది కాదు.  ఆంధ్రా నుండి ఈ ప్రాంతానికి వచ్చిన
వారు తమను తాము 'సెట్లర్స్' గా పిలుచుకుంటు ఇక్కడి ప్రజలు
‘తెలుగుజాతి’ భావముతో వారితో కలవడము జరిగిందని మరిచి
పోయి, ఇక్కడి వారి భాషను, వేషాన్ని వెక్కిరించటము, అక్కడి రాజకీయ
నాయకులు అక్కడ ఎన్నికై ఇక్కడ వుంటు, ఇక్కడి నిధులు, వనరులు
అక్కడకు తరలిస్తు అక్కడి అభివృద్ధికి పెద్ద పీట వేసి, తెలంగాణను
ఎడారిని చేస్తు, తెలంగాణ ప్రజలను అన్ని రకాలుగా అణగదొక్కటముతో
తెలంగాణ ప్రజలు ఉద్యమించక తప్పలేదు.
 తెలంగాణ ప్రజలను వారు ఏ విధంగా అణిచివేసినరో తెలుసుకోవాడానికి
ప్రత్యక్ష్యంగా కనిపిస్తున్న పరిస్థితులే సాక్ష్యం.  తెలంగాణ ఉద్యమమప్పుడు
తెలంగాణ ప్రజల శాంతియుతంగా నిరసన తెలుపుదామన్నా, సామరస్యంగా
సభలు పెట్టుకుందామన్నా ఆంధ్రా పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినరు!
ఎన్ని విధాల అడ్డుకున్నరు!  ఎన్ని కేసులు పెట్టినరు!  ఎంత నిర్బంధము!
ఎంత దమనకాండా!   ఒక్క రోజు బందు పెడితె ఆంధ్ర చానల్లు రోడ్ల మీద
ఆంధ్రోళ్లను పట్టుకొని వాళ్లకు బంద్ వల్ల కలిగి ఇబ్బందుల గురించి ఏమి
సానుభూతి చూపినరు! చర్చలు పెట్టి నష్టాల గురించి, పేద, కూలి ప్రజల
కష్టాల గురించి జనాన్ని ఊదర గొట్టినరు!  ఇప్పుడు ఆంధ్రాలో తొమ్మిది
రోజులబట్టి బందని ఘనంగా చెప్పుతున్నరు.  ఇప్పుడు అక్కడ ఉద్యమాలు
పోలీసుల సంరక్షణలో నిరాఘాటంగా తొమ్మిది రోజులనుండి జరుగుతున్నాయి.
చూస్తుంటే పోలీసులే అక్కడ విధ్వంసానికి, దమనకాండకు సహకారమందిస్తు
న్నట్టుంది.  అక్కడ ప్రతి రోజు జరుగుతున్న విధ్వంసము 12ఏళ్ళ తెలంగాణ
ఉద్యమములో కూడ జరగలేదు.  అక్కడ పేదలు, కూలీలు లేరా?  విద్యార్థుల
చదువు చెడిపోవట్లేదా?  ఉద్యోగస్తులకు, ఇతర ప్రయాణికులకు రవాణా సౌకర్యము
లేక కష్టము అయితలేదా?  వివిధ రంగాల్లో ఎలాంటీ నష్టము రావట్లేదా?  పైగా
DGP ప్రజాస్వామ్యములో ప్రజలు శాంతియుతంగా నిరసనలు తెలుపె హక్కు
వుందని అంటారు.  తెలంగాణలో తెలంగాణ వారికి ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతి
యుతంగా నిరసనలు తెలుపుకునె హక్కుకాని, సభలు నిర్వహించుకునె అధికా
కారము కాని లేదు.  సీమాంధ్ర వారికి మాత్రం వుంటుంది.  దానికి పోలీసు అధిపతే
వత్తాసు పలుకుతాడు.  తెలంగాణ వారికి సీమాంధ్ర ఏలుబడిలో వున్న ఏపిలో
ఎంత అణచివేతకు గురౌతున్నారో ఇప్పటికిప్పుడు కనబడుతున్న ఈ దృష్తాంతము
చాలదా.  తెలివి, మానవత్వము వుండి, తెలుగు జాతిగా కలిసివుండాలనుకునె
సీమాంధ్ర సోదరులకు తెలంగాణ ప్రజలు ఎందుకు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారో
ఇప్పటికైనా అర్థం కావాలి.
ఇప్పుడు జరిగే గొడవంతా ఏపి అలాగే కొనసాగలనా అంటె కాదనే అనాలి.  వాళ్ళ
బాధంతా తెలంగాణ ఏర్పడితె తెలంగాణ వాళ్ళు వాళ్ళ హక్కు నీళ్ళను, నిధులను
వాళ్ళు అధికారంగా వాళ్ళే వాడుకుంటారని, సీమాంధ్రా ఆ దోపిడి ఇక ముందు
సాగించలేరని. హైదరాబాదులో ఇక ముందు అక్కడి వారు వచ్చి అధికారికంగ
తెలంగాణవారి ఉద్యోగాలను దొడ్దిదారిన చేపట్టలేరని వారి బాధ.  తెలంగాణ పోతె
పోని, మాకు హైదరాబాదు కావాలంటరు.  మాకు ఇవ్వకపోతే వాళ్లకు కూడ
హైదరాబాదుపై హక్కు వుండొద్దని అంటరు. అన్నదమ్ములంటరు, తెలుగుజాతి
ఒక్కటంటరు.  మరి ఇదేమి కుళ్ళు?  ఇంత కుళ్ళు బుద్ద్ది, పక్షపాతము చూసి
నంక వాళ్ళతో తెలంగాణ వాళ్ళు ఎట్లా కల్సుండెది?
తెలంగాణ రాష్టంఏర్పడుతుంది కాని దేశము కాదు కదా.  ఈ భారత దేశములో
ఎవరైనా ఎక్కడైనా వుండవచ్చు కదా,  వ్యాపారాలు, చిన్నచితక పనులు చేసు
కునే వాళ్ళను వదిలేస్తె, విద్యావంతుల్లో 10% కు మించి ప్రభుత్వ ఉద్యోగాలు
వున్నాయా?  విద్యావంతులు ఉద్యోగాలుఎక్కువగా చేసుకునేది ప్రైవేటు రంగములోనే.
ఆ ఉద్యోగాలకు అర్హతలే ముఖ్యంగా చూస్తారు కాని ప్రాంతము కాదు కదా.
అయినా ఎందుకింత అలజడి? అంటె అది రాజధాని కదా అని అనొచ్చు.
రాజధాని అయినా అక్కడ రెండు మూడు రోజులకొకసారి ఎదో సమయములో
మంచినీళ్ళు వస్తాయి.  భార్యా భర్తలిద్దరు ఉద్యోగస్త్లులైతె నీళ్లు పట్టుకునే కోసం
ఒకరు సెలవు పెట్టివుండటమో, ఇంట్లో ఒక మనిషిని ప్రత్యేకంగా ఆ పనికి వుంచుకోవ
టము చేయాల్సి వస్తుంది.  రోడ్ల పరిస్థితి ఎంత తక్కువ చెప్పుకుంటె అంత
మంచిది.  ఎవరు ఎప్పుడు ఏ గుంతల్లో పడి, ఆక్సిడెంట్ అయి కాళ్ళు చేతులు
విరగ్గోట్టుకుంటారో, ప్రాణాలు పోగొట్టుకుంటారో తెలియదు.  వర్షాకాలమోస్తె
పడవల్లో ప్రయాణము చేయాల్సిన పరిస్థితి.  ట్రాఫీక్ సమస్య ఎంతంటె 10కిమి
వెళ్ళ్డాడానికి వాహనమైతె గంటా, నడిచె వెళితె ముప్పవు గంట పడుతుంది.
కాలుష్యం సంగతి చెప్పక్కర్లేదు.  ఎక్కువవుతున్న ఊపిరితిత్తుల వ్యాధులు
వాయు కాలుష్యానికి సాక్ష్యమ్.  రాజధాని నగరములో కలరా రావటము
ఆ రాజధాని నగరము అభివృద్ధి ఏపాటిదో తెలుస్తుంది.  అరవై ఏళ్ల పాలనలో
రాజధాని్ని ఆస్థితిలో వుంచిన సీమాంధ్రులకు రాజధాని అంటే ఎంత ప్రేమో,
ఎందుకు ప్రేమో తెలివైన సీమాంధ్ర యువకులు అర్థం చేసుకోవాలి.  ఉపాధి
కోసము వున్న వూరిని కన్నతల్లిని విడిచిన వాళ్ళకు బతకటానికి ఏ వుళ్ళొ
వుంటె, ఏ వూరు ఆదరిస్తె అది సొంతూరు కాదా?  50 ఏళ్ళగా హైదరాబాదులో
వుంటున్న ఆంధ్రోళ్ళు తెలంగాణ - హైదరాబాదు వాళ్ల సోంతూరని నిజాయితిగా
గుండెల మీద చెయ్యి వెసుకొని చెప్పారంటే, వాళ్ళు తెలంగాణ వాళ్ళే.  వాళ్ళకు
తెలంగాణ రావటము సంతోషమే, వాళ్ళు ఇక్కడ వుండటానికి ఎలాంటి భయము
వుండదు.  తెలంగాణ వనరులు దోచుకోవాలనే ఆలోచన వున్న వలసవాదులకే
తెలంగాణ ఏర్పడటము ఇష్టముండదు.  అందుకని రకరకాల అభ్యంతరాలు చెప్పుతారు.
ప్రస్తుత కాలములో రాజకీయనాయకులు వారికి, వారి అశ్రితులకు లాభాలే
పరమావధిగా పనిచెస్తున్నారు.  రాష్ట్రాన్ని ఇవ్వమని, విడదియొద్దని ఏ
ఎం.పి గాని, ఎం.ఎల్.ఏ రాజీనామాలు ఇచ్చినట్టు నటిస్తారు కాని అసలు
సిసలు రాజీనామాలు ఇవ్వరు.  మంత్రులు సంగతిని చెప్పనే అక్కర్లేదు.  బడుగు
బలహీన పేద ప్రజలు విషయాలను అవగాహన చేసుకొని రాజకీయనాయకుల
చేతిలో పావై జీవతాలను పాడు చేసుకోవద్దు.
జై తెలంగాణ!  జయహో తెలంగాణ!!

No comments:

Post a Comment