Thursday, August 29, 2013

News - Views

వికారాంధ్ర సభ
విశాలాంధ్ర మహాసభ వాళ్ళు హైదరాబాదులో ప్రెస్ మీటింగ్ పెడితె
అది కాస్తా రసాభాసగా ముగిసిందట.  వాళ్ళేమో లెక్చర్లు ఇస్తారట.
విలేఖరులు నోర్మూసుకొని చెప్పిందంతా రాసుకొని ప్రసారము/ప్రచారము
చేయలట.  ప్రశ్నలు అడిగితే మర్యాద వుండదట.  మీడయావాళ్ళను
నోర్మూసుకోమంటే వురుకుంటారా?  ఇల్లెక్కి  మరీ కూస్తరు.  దాంతో
పోలీసుల రక్షణ వలయంలో ఆ పెద్ద మనుషులు బైట పడ్డారు.  విశాలాంధ్ర
సభ కాస్త వికారంధ్ర సభగా మిగిలింది.
విశాలాంధ్ర సభ పెద్దమనుషులు కనబడితె నాక్కూడ కొన్ని ప్రశ్నలు అడగాలని
వుంది.
- విశాలాంధ్రా అంటె ఏమిటి? అది ఎవరి గురించి పనిచేస్తుంది?
-అది తెలుగు వారికోసమైతె, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు తెలంగాణలో
తెలుగు మాట్లాడె ప్రాంతాలను కొన్నిటిని కర్ణాటకా, తమిళనాడు, మహా
రాష్ట్రా, ఒరిస్సలో కలిపినప్పుడు ఎందుకు ఊరుకున్నరు?  ఆ కలిపేసిన
జిల్లాల్లన్ని కూడా తెలంగాణలో వుంటే తెలంగాణ సీమాంధ్ర కన్నా పెద్ద
ప్రాంతము అయ్యెది కాదా?  అప్పుడు ఆంధ్ర, తెలంగాణ సమంగా వుండేవి
కదా.  అట్లావుంటే మీ అధిపత్యము చెల్లదని, తెలంగాణను చిన్న రాష్ట్రము/
ప్రాంతము చేసి ఉపాయముతో ఆధిపత్యపు దురాలోచనతో కలసినది నిజము
కాదా?
-రజాకర్లతో విసిగి, ఇండియన్ యూనియన్లో కలిసిన తెలంగాణ ప్రజలు ఇష్టము
లేకున్నా, ఆంధ్రోళ్ళు ఇచ్చిన హామీలే కాక కొన్నాళ్ళు కలిసివున్నా కష్టమనిపిస్తె
విడిపోవచ్చని కేంద్రము అన్నది నిజము కాదా?
-ఆంధ్రోల్లు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ ఆరక్షణలు అన్ని అటకేక్కించుడో, చెత్తబుట్టలో
వేసి తెలంగాణ ప్రజలను అన్యాయము చేసినప్పుడు విశాలాంధ్ర పెద్దమనుషులు
ఏమి చేసిండ్రు?
-తెలంగాణ ఉద్యమములో మొదటిసారి 400 మంది తుపాకి గుళ్ళకు బలి అయినప్పుడు,
వారి చదువులు దెబ్బతిని, కేసులువలన ఉద్యోగావకాశాలు కోల్పోయి నక్స్లలైట్లుగా మారి
తల్లిదండ్రులకు, కుటుంబానికి, సమాజానికి దూరమైనప్పుడు వీరంతా ఎక్కడున్నరు,
ఏంజేసిండ్రు?
-తెలుగుజాతి ఒకటిగా వుండాలని ఇప్పుడు గొంతు చించుకునేవాళ్ళు,
జై ఆంధ్ర ఉద్యమము చేసి, ముల్కిరూల్స్ తెలంగాణలో
లేకుండా రాజ్యాంగ సవరణ పట్టుకొచ్చి యదేఛ్చగ తెలంగాణ వారి ఉద్యోగాలన్నీ
శాశ్వత ప్రాతిపదికన కొల్లగొట్టడము మొదలైనప్పుడు తెలుగువారి పట్ల వుండాల్సిన
అభిమానము గౌరవము యాడికి పొయింది?  తెలుగుజాతి ఒక్కటి వుండాలనుకునే
వాళ్ళు అప్పుడు జై ఆంధ్రా ఉద్యమము ఎట్ల చేసిండ్రు?
-తెలంగాణ మలిదశ ఉద్యమము ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నపుడు, ఎంతో మంది యువకులు
యువతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీరు ఒక్కసారైన ఒక్క ఓదార్పుమాట మాట్లాడిండ్రా?
తెలంగాణలో తెలుగు యువత నిరాశ నిస్పృహలకు పోయి అత్మహత్య చేసుకోకుండ
ఏ కార్యక్రమము చేసిండ్రు?
-ఉస్మానియాలో యుద్ధవాతవరణము సృష్టించి, విద్యార్థులను కొట్టి కొట్టి కాళ్ళు చేతులు విరగొట్టి
చంపినప్పుడు, హాస్టల్ రూముల్లో వున్న విద్యార్థినలను చీకట్లో బైటకులాగి అసభ్యంగా, అమానుషంగా
ప్రవర్తించినప్పుడు ఆ తెలుగు జాతి పిల్లల గురించి ఏ మాత్రము స్పందించకుండా విశాలంధ్ర పెద్దలు ఏ
కలుగులో దాక్కున్నరు?
-ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్త్రమైనా రాజ్యాంగము ప్రకారము భారత పౌరలకు వుండె హక్కులన్ని
హైదరాబాదులో వుంటాయన్నా ఉద్యమము చేసేది కేవలము మీరు ఇన్నాళ్ళు చేస్తున్న దోపిడి ఇక
ముందు సాధ్యము కాదన్న దుగ్ధతోనే కాదా?
-ఇప్పుడు మీరు చేసేది సమైక్యాంధ్ర ఉద్యమమా లేక సమైక్యాంధ్రప్రదేశ్ ఉద్యమమా? సమైక్యాంధ్ర
ప్రదేశ్ ఉద్యమములో తెలంగాణ వారు లేకుండా అది ఆంధ్ర ఉద్యమమేకాని సమైక్యాంధ్రప్రదేశ్
ఉద్యమమెట్లైతది?  ఒకవేళ సమైక్యాంధ్ర ఉద్యమమంటె, మీ ఆంధ్రోళ్ళంతా ఒక్కటి, ఇక ముందు
తెలంగాణ వాళ్ళని పూర్తిగా తుడిచిపెట్టే కుట్రవున్న మాట నిజము కాదా?

No comments:

Post a Comment