Wednesday, August 28, 2013

News - Views

కార్యదీక్ష 
మొన్న సాయంత్రము ఆహారభద్రత బిల్లు గురించి లోక్ సభలో
ఏం జరుగుతుందో చూద్దామని టివీ పెట్టాను.  పెట్టిన కాసేపటికే
శ్రీమతి సోనియా గాంధి మాట్లాడటము మొదలైంది.  అమెను లోక్
సభలో మాట్లాడుతుండగా చూడటము అదే మొదటి సారి.  హిందీలో
మొదలు పెట్టారు.  చక్కగ స్థిరంగా, గంభీరంగా మాట్లాడుతున్నారు.
కాని నాకు వింతగా అనిపించిందో విషయము.  ఆమె చేతిలో కాగితాలు
రెపరెపలాడటం.  చేతులు వణుకుతున్నాయా అనిపించింది.  ప్రపంచములో
వున్న శక్తిమంతుల జాబితాలో ఒకరు , ప్రస్తుతం ఈ దేశన్ని నడిపించేది
ఆమెనే, మాట్లాడుతుంటె కంఠంలో స్థిరత్వముంది, నిలబడటములో ఠీవి,
నిబ్బరముంది, మరి చేతుల్లో ఆ వణుకెందకు అనిపిస్తుంది? నా చూపులో
లోపమా, లేక ప్రసారములో లోపమా, లేక ఆమెకేదైనా జబ్బు వుందాని
నాకు ఒకటే డౌటు.  ఆమె మాట్లాడటము చెవుల్లో పడుతున్నా నా చూపు
లన్ని ఆమె చేతులు, చేతిలో వున్న పేపర్ల మీదే.  ఆమె ప్రసంగము పూర్తి కాక
ముందే నాకు పని వుంటే టీవి బంద్ చేసి వెళ్ళిపోయాను.
మళ్ళి రాత్రి తొమ్మిదికి టీవి పెడితె కింద స్క్రోల్ వస్తుంది.  ఆహారభద్రత
బిల్ ఓటింగ్‍కు మేడం గారు గైర్హాజరని, ఒంట్లో బాగాలేనందు వలన ఆమెను
ఆసుపత్రికి తీసుకెళ్ళ్లారని.  అప్పుడు నాకర్థమైంది, అమె చేతులో పెపర్లు
ఎందుకంత రెపరెపలాడాయో.  ఆమె పట్టుదల, ఆమె శక్తి నాకర్థమైంది.
ఆమె అనారోగ్యంగ వున్నా పార్లమెంట్‍కు వచ్చిందని, బాగా జ్వరతీవ్రత వున్న
ఒప్పిగ్గా చర్చల్లన్ని విని బిల్లు పెట్టెవరకు కూర్చుందని.  జ్వరతీవ్రత వున్న
కారణంగా నిలబడి మాట్లాడెసరికి బహుశ కళ్ళకు చీకట్లు వచ్చేసరికి తప్పని
సరై సభను విడిచి వెళ్ళవలసి వచ్చిందనుకుంటా.  గ్రేటే.  అంత అనారోగ్యంగా
వున్నా తన బాధ్యతగా బిల్లు ప్రవేశ పెట్టేకోసం గంటల కొద్ది ఒపిగ్గా కూర్చోవటం.
ఆమె అనుకుంటే సరిగ్గా సమయానికి కూడా రావచ్చు.  కాని ఒప్పిగ్గా ఇక
కూర్చోలేని స్టెజి వరకు కూర్చోవటం గొప్ప విషయమే.  మన రాజకీయ
నాయకుల్లో ఎంత మంది అట్లా వుంటారు?
ఆహారభద్రత బిల్లుకు ఇచ్చినంత ప్రాముఖ్యత మరి తెలంగాణ బిల్లుకిస్తె ఈ
తెలంగాణ ప్రజలు ఆమె తెలంగాణ ప్రదాతగ గుర్తుంచుకుంటారు.

No comments:

Post a Comment