Monday, August 26, 2013

News - Views

అమరణ నిరాహార దీక్ష
గాంధి పుట్టిన దేశములో సత్యాగ్రహానికి, ధర్మాగ్రహానికి అర్థాలు మారిపోతున్నాయా?
స్వార్థాగ్రహాలు, స్వలాభేక్ష దీక్షలు ఎక్కువుతున్నాయా?  నిరాహార దీక్షలు
బరువు తగ్గే ప్లాన్ లో భాగమవుతున్నాయా?  ఆమరణ దీక్షలు
రాజకీయ ప్రచార మార్గాలవుతున్నాయా?  అవుననే నాకనిపిస్తుంది.
మహాత్మాగాంధి,  ఆమరణ దీక్షతో ఎవరైనా
చెప్పుకోదగ్గ ఫలితాన్ని సాధించారంటే అది కల్వకుంట్ల చంద్రశేఖరావు
మాత్రమే.  రాజకీయ అవసరాల కోసము దీక్ష చేసినవాళ్ళను
ఎంతమందిని చూస్తున్నాము? అందులోఎంత మంది పట్టుదలగా
దీక్షకొనసాగిస్తున్నారు? దీక్ష మొదలు పెట్టిన రెండో నాటి నుండె దీక్ష
చేసెవాళ్ల ఛానల్లు గంటలు లెక్క పెడుతు ఆరోగ్యము విషమిస్తుంది,
ఎప్పుడైనా కోమాలోకు వెళ్ళొచ్చని బ్రేకింగ్ న్యూస్లు ఇస్తుంటారు.
ప్రభుత్వము కూడ ఓ రెండు రోజులు తమాషా చూసి, అరెస్ట్ చేసి
డెక్సట్రోస్, సలైన్ మొదలు పెట్టెస్తారు.  బతుకు జీవుడాని ఆ దీక్ష
చేసెవాళ్ళు "నా దీక్ష ప్రభుత్వము భగ్నం చేసింది, త్వరలోనే మరో
ఉద్యమము చేపడ్తామ"ని  చెప్పి, అందుకు శక్తి కావాలి కాబట్టి వెంటెనే ఆహారము
తీసేసుకుంటారు.  అట్లా తీసుకోని వాళ్ళకు కొన్ని తప్పని పరిస్థితిలో
ముక్కులో గొట్టమేసి దాని ద్వారా పోషకాహార మిస్తు ఏండ్లు గడెపేస్తారు -
ఇరోమ్ షర్మిలాను అరెస్ట్ చేసి వుంచినట్టు.  రాజకీయ నాయకులకు అంత
నిబద్ధత వుండటము కష్టమే.  ఒక వేళ వుంటె ఆ నాయకుడికి వున్న
అనుయాయులు చేసె రకరకాల ఆందోళనలు తగ్గించటానికి ప్రభుత్వము
తాత్కాలికంగా ఏదో ఒక హామీ ఇచ్చి గండము గట్టెకుతుంది. అలాగే కేసిఆర్
బతికి బట్ట కట్టాడు.
నాకు తెలిసినంత వరకు మన దేశ చరిత్రలో నిరాహార దీక్షలో చనిపోయిన
నాయకుడు పొట్టి శ్రీరాములే.  ఆయనను కూడ కొంత మంది స్వార్థపరులు
ఆంధ్ర రాష్ట్రము ఏర్పడ్డా, మద్రాసు కావాలనే దురుద్దేశముతో దీక్షలో కూర్చో
బెట్టారు.  అప్పట్లో బ్రిటిష్ వాళ్ళే గాంధి నిరాఆహార దీక్షలో చనిపోకుండా
జాగ్రత్త పడ్డారు.  ఆ తరువాత నెహ్రూ ప్రభుత్వము కూడా ఆ జాగ్రత్త తీసుకుంది.
మరి పొట్టి శ్రీ రాములుని ఎందుకు చనిపోనిచ్చారు?  అసలు కారణము వేరే ఏమైనా
వుందా?  ఇప్పుడు ఆంధ్రా వాళ్లు చేస్తున్న విధ్వంసము, అరాచకము చూస్తుంటె
మొదటి సారిగా నా కనుమానము వస్తుంది.  పొట్టి శ్రీరాములు అమాయకంగా
ఎవరి కుట్రలకైనా బలి అయ్యాడా?

No comments:

Post a Comment