హరికృష్ణ - హరే క్రిష్ణ!
తెలంగాన ఉద్యమము పుణ్యమాని ప్రజల్లో రాజకీయ చైతన్యము,
రాజ్యాంగము గురించి ఓ పిసరంత ఙ్ఞానము పెరిగింది. అలాగె నాక్కుడ.
హరిక్రిష్నరాజ్యసభ మెంబర్షిప్కు రిజైన్ చేస్తానని తండ్రి సమాధి దగ్గర ఓ
పెద్ద ఉత్తరము పెట్టి, అది మీడియాకంతా చూపెట్టి మరీ సంతకము
పెట్టాడు. అది చూసి నేను ఇది చెల్లని కాగితములె అనుకున్నా. ఆ
తరువాత ఆయన రిజిగ్నేషను అక్సెప్ట్ చేసిండ్రని న్యూస్ విని ఆశ్చర్యమని
పించింది. మళ్లి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా ఇచ్చిండని చెప్పిండ్రు.
ఎంతో మంది కాంగ్రేసోల్లు కూడా స్పీకర్ ఫర్మాట్లో రాజీనామా ఇచ్చినా అవి
పెండింగ్లో పెట్టి హరిక్రిష్నది మాత్రమే అంత అర్జెంట్గా ఎందుకు ఆక్సేప్ట్
చేశారా అని ఆలోచించాను. కాస్తా బుర్రకు పనిబెడితె అర్థమైపోయింది.
హరిక్రిష్నవాగ్ధాటికి స్పీకర్ కురియని బెదిరిపోయిండని నా కనిపించింది.
హరిక్రిష్నా రాజ్యసభలో మాట్లాడింది తప్పక చూడాల్సిన ఘటన. అమ్మో!
ఎట్ల మాట్లాడిండని! తెలుగు జాతిగౌరవాన్ని రాజ్యసభలో తన హావభావలతో
ఎంత బాగా చూపెట్టిండని! తెలుగులో మాట్లాడ్డం మొదలు పెట్టాడు. "నువు
మాట్లాడెదేమిటి అది నీ సీటేనా" అని స్పీకర్ సార్ అడిగారు.
"అవును. నాదే. నేను తెలుగువాడిని. తెలుగులోనే మాట్లాడుతా" అని గంభీరంగా
అన్నాడు.
"మరి ముందే చెప్పాలి కద. నాకు తెలుగు రాదు. ఇప్పుడు ఇట్లా అంటే ఎట్లా"
"నాకు నా భాషలో మాట్లాడె హక్కులేదా" ఉరిమాడు హరిక్రిష్న.
అతని తీరుకు పక్కన కూర్చున్న తెదేపా సభ్యులు కంగారు పడి హరిక్రిష్నకు
ఏదో సర్ది చెప్పబోయిండ్రు. ఆ పక్కన కూర్చున్న వెంకయ్య నాయుడెమో హరిక్రిష్నకే
వత్తాసుగ ఏదో అన్నడు.
అప్పుడు హరిక్రిష్న "హమ్ హిందుస్తాని, మేర భారత్ మహాన్" అంటుంటె స్పీకర్ తన
కుర్చీలో సర్దుకొని, "అయితె ఫర్వాలేదు, హిందిలో మాట్లాడ"న్నాడు.
"లేదు, లేదు నేను తెలుగులోనే మాట్లాడుతాను. నా జాతిని...." అంటు ఓ రెండు నిమిషాలు
సీమాంధ్రకు సపోర్టగా అద్భుత హావభావ ప్రదర్శనలతో ఒకసారి అందరికి తన నటనా
చాతుర్యాన్ని ప్రదర్శించాడు. ( రాష్ట్రము విడిపోయాక ఈ సీను ఎదైనా సీమాంధ్ర ఉద్యమ
సీనిమా తీసినప్పుడు అందులో పెడ్తె ‘వాహ్ క్యా సీన్ హై’ అని మళ్లి మళ్ళి చూస్తరు).
పాపం కురియన్ ఏం చేయలేక అయోమయం మొకమ్ పెట్టుకొని కుర్చిలో కూర్చున్నడు.
అందుకేనేమో హరిక్రిష్న స్పీకర్ ఫర్మాట్లో రాజీనామా ఇయ్యంగనే వెంటనే తన ఆమోద ముద్ర
వేసినట్టున్నడు. ఇంకోసారి హరిక్రిష్న రాజ్యసభలో మాట్లాడితె ఎదురు కూర్చునే ధైర్యము
ఆయనకు లేదనుకుంటా!
తెలంగాన ఉద్యమము పుణ్యమాని ప్రజల్లో రాజకీయ చైతన్యము,
రాజ్యాంగము గురించి ఓ పిసరంత ఙ్ఞానము పెరిగింది. అలాగె నాక్కుడ.
హరిక్రిష్నరాజ్యసభ మెంబర్షిప్కు రిజైన్ చేస్తానని తండ్రి సమాధి దగ్గర ఓ
పెద్ద ఉత్తరము పెట్టి, అది మీడియాకంతా చూపెట్టి మరీ సంతకము
పెట్టాడు. అది చూసి నేను ఇది చెల్లని కాగితములె అనుకున్నా. ఆ
తరువాత ఆయన రిజిగ్నేషను అక్సెప్ట్ చేసిండ్రని న్యూస్ విని ఆశ్చర్యమని
పించింది. మళ్లి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా ఇచ్చిండని చెప్పిండ్రు.
ఎంతో మంది కాంగ్రేసోల్లు కూడా స్పీకర్ ఫర్మాట్లో రాజీనామా ఇచ్చినా అవి
పెండింగ్లో పెట్టి హరిక్రిష్నది మాత్రమే అంత అర్జెంట్గా ఎందుకు ఆక్సేప్ట్
చేశారా అని ఆలోచించాను. కాస్తా బుర్రకు పనిబెడితె అర్థమైపోయింది.
హరిక్రిష్నవాగ్ధాటికి స్పీకర్ కురియని బెదిరిపోయిండని నా కనిపించింది.
హరిక్రిష్నా రాజ్యసభలో మాట్లాడింది తప్పక చూడాల్సిన ఘటన. అమ్మో!
ఎట్ల మాట్లాడిండని! తెలుగు జాతిగౌరవాన్ని రాజ్యసభలో తన హావభావలతో
ఎంత బాగా చూపెట్టిండని! తెలుగులో మాట్లాడ్డం మొదలు పెట్టాడు. "నువు
మాట్లాడెదేమిటి అది నీ సీటేనా" అని స్పీకర్ సార్ అడిగారు.
"అవును. నాదే. నేను తెలుగువాడిని. తెలుగులోనే మాట్లాడుతా" అని గంభీరంగా
అన్నాడు.
"మరి ముందే చెప్పాలి కద. నాకు తెలుగు రాదు. ఇప్పుడు ఇట్లా అంటే ఎట్లా"
"నాకు నా భాషలో మాట్లాడె హక్కులేదా" ఉరిమాడు హరిక్రిష్న.
అతని తీరుకు పక్కన కూర్చున్న తెదేపా సభ్యులు కంగారు పడి హరిక్రిష్నకు
ఏదో సర్ది చెప్పబోయిండ్రు. ఆ పక్కన కూర్చున్న వెంకయ్య నాయుడెమో హరిక్రిష్నకే
వత్తాసుగ ఏదో అన్నడు.
అప్పుడు హరిక్రిష్న "హమ్ హిందుస్తాని, మేర భారత్ మహాన్" అంటుంటె స్పీకర్ తన
కుర్చీలో సర్దుకొని, "అయితె ఫర్వాలేదు, హిందిలో మాట్లాడ"న్నాడు.
"లేదు, లేదు నేను తెలుగులోనే మాట్లాడుతాను. నా జాతిని...." అంటు ఓ రెండు నిమిషాలు
సీమాంధ్రకు సపోర్టగా అద్భుత హావభావ ప్రదర్శనలతో ఒకసారి అందరికి తన నటనా
చాతుర్యాన్ని ప్రదర్శించాడు. ( రాష్ట్రము విడిపోయాక ఈ సీను ఎదైనా సీమాంధ్ర ఉద్యమ
సీనిమా తీసినప్పుడు అందులో పెడ్తె ‘వాహ్ క్యా సీన్ హై’ అని మళ్లి మళ్ళి చూస్తరు).
పాపం కురియన్ ఏం చేయలేక అయోమయం మొకమ్ పెట్టుకొని కుర్చిలో కూర్చున్నడు.
అందుకేనేమో హరిక్రిష్న స్పీకర్ ఫర్మాట్లో రాజీనామా ఇయ్యంగనే వెంటనే తన ఆమోద ముద్ర
వేసినట్టున్నడు. ఇంకోసారి హరిక్రిష్న రాజ్యసభలో మాట్లాడితె ఎదురు కూర్చునే ధైర్యము
ఆయనకు లేదనుకుంటా!
No comments:
Post a Comment