Wednesday, August 14, 2013

Jai Samaikyaandhra

జై  ఆంధ్ర - సీమాంద్రా  

సీమాంధ్రాలో సమైక్య ఉద్యమము రెండు వారాలుగా ఆగక సాగుతుంది.
ప్రజాప్రతినిధుల ప్రేరణతో, ప్రభుత్వ ప్రోత్సాహముతో, పోలీసుల పర్యవెక్షణలో,
ఛానల్ల ప్రచార ప్రభంజనాలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా సమైక్య సమ్మె
సాగుతుంది జోరుగా హుషారుగా!  ప్రజల ఇక్కట్ల్లు అవసరము లేదు,
పేదలు, రోజు వారి కూలీల పొట్టకూటి గురించి పట్టింపు లేదు,
విద్యార్థుల చదవు చెడినా ఫర్వాలేదు, ప్రయాణికుల కష్టాలు తెలుసుకునే
పనిలేదు, ధరలు ఆకాశాన్నిఅంటి పేద మధ్యతరగతి వారి ఆకలి మంటల
గురించి ఆలోచించే ధ్యాసె లేదు, తోటి తెలుగు వాడిని అణచి, దోపిడి
చేసుకునే హక్కుని వదులుకునే ప్రశ్నేలేదు!  సమైక్య ఉద్యమము
ఒక ప్రాంతాన్ని, ప్రజలను దోచుకునె హక్కును వదులుకోమని
చేస్తున్న ఉద్యమము.  తెలుగుజాతని, అన్నదమ్ముల్లని సెంటి
మెంటుతో ఒక ప్రాంతాన్ని శాశ్వతంగా వలసవాసుల ఆధిపత్యానికి
లోబడి వుండె విధంగా చేసేయత్నమే ఈ సమైక్య ఉద్యమము.
సమైక్యమన్నది ఒకే స్థాయిలో, ఒకే వర్గానికి, ప్రాంతానికి చెందిన
వారి మధ్య మాత్రమే సాధ్యము.  ఇన్నేళ్ళు ఆం.ప్ర. జరిగిన ఘటనలే
ఇందుకు సాక్ష్యము.
ఇప్పుడు ఆంధ్రాలో జరిగేది జై సమైక్యాంధ్ర ఉద్యమమే కాని జై ఆంధ్ర
ప్రదేశ్ ఉద్యమము కాదు.  ఆంధ్ర రాష్ట్రము తెలంగాణలో కలిసి ఆంధ్ర
ప్రదేశ్ గా ఏర్పడప్పుడు కొన్ని ఒప్పందాలు జరిగాయి.  అవి ఆంధ్ర
రాష్ట్రము వాళ్ళు నీటి రాతలుగా మార్చి తెలంగాణ నిధులు, నీళ్ళు
వనరులు దోచుకోవటము, అది నిరాటంకంగా సాగేందుకు వాళ్ళ
ప్రాంతము వాళ్ళనే అన్నికీలక ఉద్యోగాల్లో నియమాకాలు చేసి
తెలంగాణ వారి ఉద్యోగాలను కూడ కొల్లగొట్టారు.  తెలంగాణా వారు
ఆంధ్ర దోపిడికి వ్యతిరెకంగా పోరాటము చేసి ఎన్నిఆరక్షణ హక్కులు
తెచ్చుకున్నా ఆంధ్రా పెత్తెందార్ల్రు వాటిని బుట్టదాఖలు చేసి వారి దోపిడిని
యధేచ్చగా సాగించారు.  ప్రతిసారి తెలంగాణ వాళ్ళుపోరాటము చేసి
కేంద్రము ద్వారా హక్కులను తెచ్చుకునేటప్పుడు ఆంధ్రా పాలకులు
వాటిని అమలు చేస్తామని కేంద్రములో హామి ఇచ్చిరాష్ట్రములో మాత్రము
వాటిని అటకెక్కించె వారు.
తెలంగాణ పోరాటము ఎందుకు వచ్చిందో అందరికి తెలుసు.  ఇదివరకు
ఏవో హామిలతో బుజ్జగించ యత్నించిన ఆంధ్రా పాలకులు ఈసారి మాత్రం
అలా చేయదలచుకోలేదు.  ఇన్నాళ్ళు వాళ్ళు ఈ ప్రాంతానికి చేసిన
అన్యాయాన్ని కూడ తప్పిదముగా భావించట్లేదు.  ఇప్పుడు వారు
పూర్తిగా సిగ్గువిడిచారు.  వారు చేసె సమైక్య ఉద్యమము వారు తెలంగాణకు
ఎలాంటి అస్థిత్వము లేకుండా చేయాలనే ఉద్దేశముతో చేస్తున్నది.
తెలంగాణాలో తెలంగాణ వారినే పరాయిలగా, బానిసలుగా మిగిల్చాలని
కొనసాగిస్తున్నది.  అందుకె వారు చేసేది సమైక్య ఆంధ్ర ఉద్యమము లెదా
జై సమైక్యాంధ్రా ఉద్యమము.  ఇది జై ఆంధ్రప్రదేశ్ ఉద్యమము కాదు.
వారికి కావలసింది ఆంధ్ర అస్థిత్వమె కాని తెలుగు జాతి అస్థిత్వము కాదు.
వారికి కావలసింది తెలంగాణలో చరిత్రాత్మకమైన హైదరాబాదు నగరమే
కాని తెలుగుజాతి సామరస్యము కాదు. వారికి కావలసింది తెలంగాణతో,
తెలంగాణ ప్రజలతో తెలుగుజాతిగా తెలంగాణ గడ్డమీద సహజీవనము
చేయటము కాదు,  తెలంగాణ అంతర్భాగమైన ప్రపంచ ఖ్యాతిగాంచిన
హైదరాబాదు నగరముపైన ఆధిపత్యము.  వారు నిస్సిగ్గుగా చెప్పుతున్నారు,
మాకు దక్కని హైదరాబాదు తెలంగాణాకు కూడ దక్కొద్దని తెలుగు
జాతి సోదరప్రేమ అంతా ఆ విషయానికి వచ్చెసరికి గాల్లో కల్సిపోయింది.

ఆంధ్రప్రదేశ్  తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు కలిస్తె ఏర్పడింది.  తెలంగాణ విడి
పోతే వుండేది ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్.  తెలంగాణ అంతా ఒక్కటె.  ఆంధ్రా
లోనె ప్రాంతీయ బెధాలు వున్నాయి.  ఆంధ్రా అని, కోస్తాంధ్రా అని, రాయల
సీమా అని, ఉత్తరాంధ్రా అని.  ఇన్ని ప్రాంతీయ బెధాలు, వాటి మధ్యలో
విబేధాలు వుండి కొత్తగా ఏర్పడె ఆంధ్రప్రదేశ్ లోనైన ఆంధ్రులంతా సహ
జాతి భావముతో మెదులుకుంటూ అన్ని ప్రాంతాలకు న్యాయము చేస్తు,
అభివృద్దిలో అన్నింటిని సమంగా ముందుకు తీసుకెళ్ళు సహజీవనము
చేస్తె ఎంతో ప్రగతిని సాధించవచ్చు.  సమైక్యంగా పురోగమించవచ్చు.  అట్లా
కాకుండా తెలంగాణను అణగదొక్కినట్టు అక్కడ కూడా సీమనో, ఉత్తరాంధ్రనో
వెనకబడేసినా, ఏ విధంగా అన్యాయము చేసినా అక్కడ మరో ఉద్యమము
రాక తప్పదు.  తెలుగు మాట్లాడె వారికి మరో రాష్ట్రము ఏర్పాటు చేయక
తప్పదు.
మనసులో ఏ భావము పెట్టుకొని చేసినా ఈ సమైక్యాంధ్ర ఉద్యమము ఆంధ్రాలో
అందరిలో సామరస్యము తీసుకురావాలి.  ఆంధ్రా, రాయలసీమ తెలుగు సొదరులు
సఖ్యంగా వుండాలి.  ఇప్పుడు వారు చేస్తున్నఈ సమైక్యాంధ్రా స్ఫూర్తితో వారు
రాబోవు కాలములో కలిసి వుండి ప్రపంచ ఖ్యాతి గాంచె విధంగా వారి ఆంధ్ర
ప్రదేశ్ లేదా సమైక్యాంధ్రాని అభివృద్ధి చేసుకోవాలని తెలంగాణ ప్రజలంతా
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
జై తెలంగాణ!  జయహో తెలంగాణ!!
జై ఆంధ్రా/సీమాంధ్రా/సమైక్యాంధ్రా!

No comments:

Post a Comment